అన్వేషించండి

మాల్దీవులను మెచ్చుకున్న WHO - ఎందుకో తెలుసా?

Maldives: రెండు దేశాల్లో హెపటైటిస్ బి వ్యాక్సిన్ దేశ ప్రజలందరికీ ఇచ్చినట్టు డబ్ల్యూహెచ్ఓ అధికారికంగా దృవీకరించింది. మరి అవి ఏ దేశాలు? ఏం జరిగిందో తెలుసుకుందాం.

మాల్దీవులు, శ్రీలంక హెపటైటిస్ బి వ్యాధి మీద పూర్తిస్థాయిలో నియంత్రణ సాధించాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఈ రెండు దేశాల్లో పిల్లల్లో హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఎక్కువ మందికి సిఫారసు చేసిన డోసుల్లో పూర్తిచేశారని, ఇటీవల నిర్వహించిన సెరోలాజికల్ సర్వేల ద్వారా ఈ విషయాలను దృవీకరిస్తున్నట్టు నిపుణుల బృందం ప్రకటించింది.

WHO ఆగ్నేయాసియా ప్రాంతీయ డైరెక్టర్ ఖేత్రపాల్ సింగ్ ఈ దేశాల్లోని ఆరోగ్య సంస్థలను, అక్కడి అధికారులను, కార్యకర్తలను వారి కృషిని ప్రశంసిస్తూ వారికి అభినందనలు తెలిపారు.

WHO సౌత్-ఈస్ట్ ఆసియా రీజియన్‌లోని హెపటైటిస్ బి నియంత్రణను ధృవీకరించేందుకు నిపుణుల ప్యానెల్ ను మాల్దీవులు, శ్రీలంక దేశాల్లో పిల్లల్లో నిరోధకతను సమీక్షీంచింది. ఈ సమీక్ష ప్రకారం హెపటైటిస్ బి వ్యాక్సిన్ 90 శాతం పైగా కవర్ చేశారు.

2022-23 సంవత్సరాల్లో జాతీయ సర్వే ఫలితాలను కూడా నిపుణులు సమీక్షించారు. ఈ వివరాల ఆధారంగా నిపుణుల ప్యానెల్ ఈ రెండు దేశాల్లో హెపటైటిస్ బి నియంత్రణను దృవీకరించడానికి అవసరమైన అన్ని ప్రమాణాలతో ఉన్నట్టు నిర్ధారించారు. ఈ విషయాన్ని దృవీకరిస్తూ ఆగ్నేయాసియా హెపటైటిస్ బి నియంత్రణ నిపుణుల ప్యానెల్ చైర్ పర్సన్ డాక్టర్ సుపమిత్ చున్సుట్టివాట్ అభినందనలు తెలిపారు.

2019లోనే ఈ లక్ష్యాన్ని బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, థాయ్‌లాండ్‌ సాధించాయి. ఇప్పుడు కొత్తగా మాల్దీవులు, శ్రీలంక వీటి సరసన చేరాయి. బాల్యంలోనే హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ ను నివారించడం వల్ల దీర్ఘకాలికంగా కాలేయ క్యాన్సర్, సిర్రోసిన్ వంటి సమస్యలు గణనీయంగా తగ్గుతాయి.

ఆగ్నేయాసియా ప్రాంతంలో ఒక ముఖ్యమైన ప్రజారోగ్య కార్యక్రమంగా హెపటైటిస్ నియంత్రణను WHO నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా 11 దేశాలున్నాయి. ఈ దేశాల మొత్తం జనాభా ప్రపంచ జనాభాలో నాలుగింట ఒక వంతు గా చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతాల్లో దీర్ఘకాలిక హెపటైటిస్ బితో దాదాపుగా 60 మిలియన్ల మంది జీవిస్తున్నారు. ప్రతి యేటా 2,18000 మంది హెపటైటిస్ బి, సితో మరణిస్తున్నారు.

2016లో ఆగ్నేయ ఆసియా రీజినల్ ఇమ్యూనైజేషన్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ హెపటైటిస్ బి నియంత్రణకు సంబంధించిన ప్రాంతీయ లక్ష్యాన్ని ఆమోదించి హెపటైటిస్ బి ప్రాభల్యాన్ని 5 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లల్లో 1 శాతం కంటే తక్కువ నమోదయ్యే లక్ష్యాన్ని సాధించాల్సి ఉంది.

పెంటావ్యాలెట్ వ్యాక్సిన్ మూడు మోతాదులలో మొదటి సంవత్సరం పిల్లలకు అందించారు. ఈ ప్రాంతంలోని ఎనిమిది దేశాలు నవజాత శిశువులకు హెపటైటిస్ బి వ్యాక్సిన్ బర్త్ డోస్ అందిస్తున్నాయి. కోవిడ్ 19 సమయంలో పెంటావ్యాలెట్ టీకా  3 వ డోస్ కవరేజి గణనీయంగా తగ్గింది కానీ తర్వాత 2021 లొ 82 శాతానికి పెరిగింది.

హెపటైటిస్ బి బర్త్ డోసుల కవరేజిని పెంచడానికి ఉన్న అవరోధాల్లో ప్రధానమైంది ఇంట్లో డెలివరీలు జరగడం అని నిపుణులు చెబుతున్నారు. ఇలా ఇంటి ప్రసవాల్లో పుట్టిన పిల్లలకు హెపటైటిస్ బి వ్యాక్సిన్ సమయానికి అందించడం సాధ్యపడడం లేదని డబ్య్లూహెచ్ఓ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ ఖేతర్ పాల్ వివరణ ఇస్తున్నారు. హెపటైటిస్ బి టీకా కవరేజి సమర్థవంతంగా జరగాలంటే ప్రచారం, అవగాహన చాలా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

హెపటైటిస్ ను తప్పకుండా నివారించాలి, చికిత్స కూడా అందించాలి. టీకాతోపాటు సురక్షితమైన ఇంజెక్షన్, సురక్షిత రక్తం వంటి నివారణల్లో అత్యంత కీలకం. వీటి గురించి నిరంతరం అవగాహన కల్పిస్తూ ఉండడం చాలా అవసరమని డాక్టర్ ఖెతర్ పాల్ సింగ్ వివరించారు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also read : Disease X: డిసీజ్ X - ఇది కోవిడ్ కంటే ప్రమాదకర మహమ్మారి, మరో ముప్పు తప్పదా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget