అన్వేషించండి

Chikungunya Treatment : చికున్ గున్యా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే.. వస్తే ఈ హోమ్ రెమిడీలు ఫాలో అయిపోండి

Chikungunya: కరోనా కంటే ముందు అందరినీ భయపెట్టిన వైరస్​లలో చికున్ గున్యా ఒకటి. తీవ్రమైన దీర్ఘకాలిక కీళ్లనొప్పులతో ఈ జ్వరం గురించి తెలుసుకోవాల్సిన విషయాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే. 

Chikungunya Virus : వర్షాలు ఇతర కాలుష్య కారణాల వల్ల దోమల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో చికున్​గున్యా కూడా వ్యాపిస్తుంది. చికున్​గున్యా వైరస్ వల్ల కలిగే వైరల్ వ్యాధి. ఇది సోకిన ఏడిస్ దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది. దీనివల్ల విపరీతమైన కీళ్ల నొప్పులు, జ్వరం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇది రాకుండా కొన్నిజాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. కొన్ని ఇంటి నివారణలు, సెల్ఫ్ కేర్ తీసుకుంటే చికున్ గున్యా రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చంటున్నారు. 

2005, 2010 మధ్యకాలంలో చికున్ గున్యా ఇండియాను తెగ భయపెట్టింది. అప్పటి నుంచి దీనికి భయపడేవారు చాలామందే ఉన్నారు. అందుకే దీని గురించిన ఏ విషయాన్ని నిర్లక్ష్యం చేయవద్దని చెప్తున్నారు నిపుణులు. చికున్ గున్యా వైరస్ సోకిన దోమ కుట్టిన నాలుగు నుంచి ఎనిమిదిరోజుల్లో ఇది డెవలప్ అవుతుంది. ఒకటి నుంచి రెండువారాల వరకు దీని లక్షణాలు ఇబ్బంది పెడతాయి. 

లక్షణాలివే.. 

అధిక జ్వరం, తీవ్రమైన కీళ్ల నొప్పులు వస్తాయి. ఈ నొప్పులు నెలలు, సంవత్సరాల వరకు ఉండొచ్చు. జ్వరం ఉన్న సమయంలో తలనొప్పి కూడా ఎక్కువగా ఉంటుంది. తీవ్రమైన అలసట, అనారోగ్యం ఉంటుంది. చర్మంపై దద్దుర్లు వస్తాయి. వికారం, వాంతులు ఉంటాయి. పరిస్థితి విషమించే సమయంలో ఇది కాలేయాన్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. 

హోమ్ రెమిడీలు

ఒకవేళ చికున్ గున్యా వస్తే వైద్యులు ఇచ్చే మందులతో పాటు.. కొన్ని ఇంటి చిట్కాలు ఫాలో అవుతూ ఉండాలి. నీరు, కొబ్బరి నీళ్లు, ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా తీసుకోవాలి. శరీరాన్ని హైడ్రెటెడ్​గా ఉంచుకోవాలి. తగినంత విశ్రాంతి తీసుకోవాలి. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి, మంటను, వేడిని తగ్గించుకోవడానికి ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. తాజా పండ్లు, జ్యూస్​లు, సూప్​లు తీసుకోవాలి. ప్రోటీన్లు అధికంగా ఉండే ఫుడ్స్, మిల్లెట్స్ తీసుకుంటే చాలా మంచిది. 

యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు ఉండే పసుపు, అల్లం వంటివాటిని తీసుకుంటే కీళ్ల నొప్పులు కంట్రోల్ అవుతాయి. విటమిన్, మినరల్ రిచ్ ఉండే గుమ్మడికాయ గింజలు, బచ్చలికూరలు అలసటను తగ్గిస్తాయి. విటమిన్ సి అధికంగా ఉండే ఫుడ్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. పాలు తీసుకోవడం, ఎండలో కూర్చోవడం వల్ల విటమిన్ డి అందుతుంది. ఎముకలు స్ట్రాంగ్ అవుతాయి. దీనివల్ల కీళ్ల నష్టం కూడా తగ్గుతుంది. 

ఆ ఫుడ్స్ జోలికి పోవద్దు.. 

చికున్ గున్యా అనే కాదు.. ఏ ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చినా కొన్ని ఫుడ్స్​ని అవాయిడ్ చేయాలి. అలాంటి వాటిలో ప్రోసెస్డ్​ ఫుడ్ ఒకటి. స్వీట్స్, అన్​హెల్తీ ఫ్యాట్స్, కలర్స్ ఎక్కువగా ఉండే ఫుడ్ వంటివి తీసుకోకూడదు. ఈ పరిస్థితిని తీవ్రం చేస్తాయి.  రికవరీ లేట్​గా ఉంటుంది. అలాగే హెల్త్ బాగున్నప్పుడు కూడా వీటిని తీసుకుంటే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశముంది. కాఫీ, సోడా వంటి ఎనర్జీ డ్రింక్స్, షుగర్ డ్రింక్స్, కెఫిన్ ఇమ్యూనిటీని తగ్గించేస్తాయి. దీనివల్ల పరిస్థితి విషమించవచ్చు. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు 

దోమలు రాకుండా రెప్లికెంట్స్ ఉపయోగించాలి. కాయిల్స్, జెల్స్ కూడా ఉపయోగించవచ్చు. దోమలు కుట్టుకుండా పొడవాటి చేతులున్న దుస్తులు వేసుకోవాలి. ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. మొక్కలు, నీటి తొట్టిలో దోమలు చేరే అవకాశముంది కాబట్టి వాటిపై శ్రద్ధ వహించాలి. 

Also Read : ప్రసవానికి ముందు తల్లికి చికెన్ గున్యా.. పుట్టిన బేబికి అరుదైన వ్యాధి, కారణం అదేనట

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kerala Tragedy: సంచలనం కోసం వీడియో తీసి వైరల్ చేసిన మహిళ - అవమానంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి - కేరళలో ఘోరం !
సంచలనం కోసం వీడియో తీసి వైరల్ చేసిన మహిళ - అవమానంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి - కేరళలో ఘోరం !
Delhi Earthquake: ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు

వీడియోలు

Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు
Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kerala Tragedy: సంచలనం కోసం వీడియో తీసి వైరల్ చేసిన మహిళ - అవమానంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి - కేరళలో ఘోరం !
సంచలనం కోసం వీడియో తీసి వైరల్ చేసిన మహిళ - అవమానంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి - కేరళలో ఘోరం !
Delhi Earthquake: ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
Aamir Khan Weight Loss : జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో
జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో
RTC Bus Overturns: డ్రైవింగ్ చేస్తుండగా ఫిట్స్.. పొలాల్లోకి దూసుకెళ్లి ఆర్టీసీ బస్సు బోల్తా - విజయనగరంలో ఘటన
డ్రైవింగ్ చేస్తుండగా ఫిట్స్.. పొలాల్లోకి దూసుకెళ్లి ఆర్టీసీ బస్సు బోల్తా - విజయనగరంలో ఘటన
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Embed widget