అన్వేషించండి

Gateway To Hell: నరక ద్వారం.. 50 ఏళ్లుగా ఇక్కడి భూమి మండుతూనే ఉంది.. చిన్న తప్పు ఎంత పనిచేసింది!

నరకానికి దారిగా చిలిచే.. ఈ Gateway To Hell గత 50 ఏళ్లుగా మండుతూనే ఉంది. భవిష్యత్తులో ఇది కనుమరుగయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే..

కటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 50 ఏళ్ల నుంచి ఇక్కడ ఏర్పడిన బిలం మండుతూనే ఉంది. అప్పట్లో చేసిన చిన్న తప్పిదం వల్ల ఏళ్ల తరబడి అక్కడి వాతావరణ పరిస్థితులు ప్రమాదకరంగా మారుతూ వస్తున్నాయి. ఆ మంటల వల్ల పర్యవరణానికి మాత్రమే కాదు.. స్థానిక ప్రజలు కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరి, ఆ మంటకు కారణం ఏమిటీ? అది ఎందుకు ఏర్పడిందో తెలియాలంటే.. 1971లో ఏం జరిగిందో తెలుసుకోవాలి. 

తుర్క్మెనిస్తాన్(Turkmenistan) ఓ భారీ అగ్నిబిలం ఉంది. దీన్ని అంతా నరక ద్వారం(Gateway To Hell) అంటారు. అయితే, అగ్నిపర్వతాలకు, ఈ బిలానికి చాలా వ్యత్యాసం ఉంది. అగ్నిపర్వాతాల్లో లావా ద్రవం నిత్యం మండుతూ ఉంటుంది. అవి ఎప్పుడు పేలుతాయో చెప్పడం కష్టం. అయితే, ఈ బిలం అలాంటిది కాదు. ఇది మానవ తప్పిదం వల్ల ఏర్పడిన ఓ భయానక ఘటన.

ఈ నరక ద్వారం గురించి తెలుసుకొనే ముందు మనం 1995, జనవరి 8న తూర్పు గోదావరి జిల్లా పాశర్లపూడి గ్రామంలో చోటుచేసుకున్న ఘటన గురించి తెలుసుకోవాలి. చమురు అన్వేషణలో భాగంగా ONGC డ్రిల్లింగ్ పనులు జరుపుతుండగా గ్యాస్ లీకైంది. ఆ వెంటనే నిప్పు అంటుకుంది. సుమారు 65 రోజులపాటు అది మండుతూనే ఉంది. ఎట్టకేలకు నిపుణులు రంగంలోకి దిగి ఆ మంటలను అదుపులోకి తెచ్చారు. దాదాపు అలాంటి ఘటనే అష్గాబాత్‌కు 260 కిమీల దూరంలో చోటుచేసుకుంది. 

1971లో సోవియెట్ జియోలజిస్టులు చమురు కోసం అక్కడ డ్రిల్లింగ్ చేపట్టారు. ఈ సందర్భంగా వారు అక్కడ భారీ గ్యాస్ లీకైంది. ఆ వెంటనే అక్కడ పెద్ద రంధ్రం ఏర్పడి భారీ బిలంగా ఏర్పడింది. దాని నుంచి వెలువడుతున్న గ్యాస్ పక్క గ్రామాలకు వ్యాపిస్తుందనే భయంతో జియోలజిస్టులు.. గ్యాస్‌ను మండించారు. కొద్ది రోజుల తర్వాత ఆ గ్యాస్ మొత్తం ఆరిపోతుందని భావించారు. అయితే, 50 ఏళ్లు గడిచినా.. ఆ గ్యాస్ ఇంకా మండుతూనే ఉంది. 

‘దర్వాజా క్రేటర్’ అని పిలిచే ఈ ప్రాంతం క్రమేనా పర్యాటక స్థలిగా మారింది. చాలామంది ఇక్కడికి వచ్చి ఫొటోలు దిగుతుంటారు. అయితే.. భవిష్యత్తులో మీరు ఈ నరక ద్వారాన్ని చూసే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే.. తుర్క్మెనిస్తాన్ ప్రభుత్వం ఈ బిలాన్ని మూసివేయాలనే నిర్ణయానికి వచ్చింది. నిత్యం గ్యాస్ మండటం వల్ల పర్యవరణానికి, ప్రజలకు హాని జరుగుతోందని.. ఈ బిలాన్ని మూసివేయడానికి ఉన్న మార్గాలను అన్వేషించాలని అధికారులను ఆదేశించారు. అయితే, 2010లోనే ఇక్కడి మంటలు ఆర్పడానికి ప్రయత్నాలు జరిగాయి. కానీ సాధ్యం కాలేదు. మరి ఈ సారైనా సక్సెస్ సాధిస్తారో లేదో చూడాలి.

Also Read: ఈ గ్రామంలో మహిళలు 5 రోజులు నగ్నంగా ఉంటారు.. వారిని చూసి నవ్వితే..

Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!

Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mahesh Kumar Goud: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ - ఏఐసీసీ అధిష్టానం కీలక నిర్ణయం
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ - ఏఐసీసీ అధిష్టానం కీలక నిర్ణయం
TGDSC Final Key: తెలంగాణ డీఎస్సీ ఫైనల్ ఆన్సర్ కీ విడుదల - ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ డీఎస్సీ ఫైనల్ ఆన్సర్ కీ విడుదల - ఫలితాలు ఎప్పుడంటే?
Constable Suicide: బ్రిడ్జి పైనుంచి గోదావరిలోకి దూకి కానిస్టేబుల్ ఆత్మహత్య, కారణం ఏంటంటే!
బ్రిడ్జి పైనుంచి గోదావరిలోకి దూకి కానిస్టేబుల్ ఆత్మహత్య, కారణం ఏంటంటే!
Actor Raj Tarun Case: రాజ్‌తరుణ్‌, లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్‌- సహజీవనం నిజమని కోర్టుకు చెప్పిన పోలీసులు
రాజ్‌తరుణ్‌, లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్‌- సహజీవనం నిజమని కోర్టుకు చెప్పిన పోలీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Chandrababu Naidu Escape Train Accident |రైలు వచ్చే కొన్ని క్షణాల ముందు చంద్రబాబు ఏం చేశారో చూడండిJainoor Tribal Woman Incident: ఆదివాసీ మహిళపై లైంగిక దాడి.. అట్టుడుకుతున్న జైనూర్ | ABP DesamFloods At Gabbarsingh Re Release Chilakaluripet |నడుం లోతు నీళ్లలోనూ సినిమా చూస్తున్న ఫ్యాన్స్ |ABPRobotic Life Jacket SDRF | ఏలూరులో తమ్మిలేరులో రోబోటిక్ లైఫ్ జాకెట్ డెమో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mahesh Kumar Goud: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ - ఏఐసీసీ అధిష్టానం కీలక నిర్ణయం
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ - ఏఐసీసీ అధిష్టానం కీలక నిర్ణయం
TGDSC Final Key: తెలంగాణ డీఎస్సీ ఫైనల్ ఆన్సర్ కీ విడుదల - ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ డీఎస్సీ ఫైనల్ ఆన్సర్ కీ విడుదల - ఫలితాలు ఎప్పుడంటే?
Constable Suicide: బ్రిడ్జి పైనుంచి గోదావరిలోకి దూకి కానిస్టేబుల్ ఆత్మహత్య, కారణం ఏంటంటే!
బ్రిడ్జి పైనుంచి గోదావరిలోకి దూకి కానిస్టేబుల్ ఆత్మహత్య, కారణం ఏంటంటే!
Actor Raj Tarun Case: రాజ్‌తరుణ్‌, లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్‌- సహజీవనం నిజమని కోర్టుకు చెప్పిన పోలీసులు
రాజ్‌తరుణ్‌, లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్‌- సహజీవనం నిజమని కోర్టుకు చెప్పిన పోలీసులు
Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో ఉద్రిక్తత- ఏబీవీపీ నేతల్ని అడ్డుకోవడంతో చినిగిన చొక్కాలు
బాసర ట్రిపుల్ ఐటీలో ఉద్రిక్తత- ఏబీవీపీ నేతల్ని అడ్డుకోవడంతో చినిగిన చొక్కాలు
Ganesh Chaturthi 2024 Special: దశభుజ శ్రీ మహాగణపతి- ఒక్క ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలు, ఎక్కడో కాదండోయ్
దశభుజ శ్రీ మహాగణపతి- ఒక్క ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలు, ఎక్కడో కాదండోయ్
Uttar Pradesh : రూ.25 వేల జీతం కోసం అప్లయ్ చేసుకుంటే రూ. 250 కోట్ల జీఎస్టీ బిల్లొచ్చింది - ఈ నిరుద్యోగి కష్టం తీర్చేదెవరు  ?
రూ.25 వేల జీతం కోసం అప్లయ్ చేసుకుంటే రూ. 250 కోట్ల జీఎస్టీ బిల్లొచ్చింది - ఈ నిరుద్యోగి కష్టం తీర్చేదెవరు ?
Andra Pradesh Trains: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక- విజయవాడ మార్గంలో 44 రైళ్లు రద్దు- దసరా దీపావళికి ప్రత్యేక ట్రైన్స్‌
రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక- విజయవాడ మార్గంలో 44 రైళ్లు రద్దు- దసరా దీపావళికి ప్రత్యేక ట్రైన్స్‌
Embed widget