అన్వేషించండి

Health Tips : రోజూ హాట్ వాటర్ టబ్‌లో స్నానం చేస్తే ఆసుపత్రికి వెళ్లాల్సిన పనిలేదు.!

హాట్ వాటర్ టబ్ లో స్నానానికి  నాచురోపతిలో చాలా ప్రాముఖ్యత ఉంది. దీన్ని హైడ్రో ట్రీట్‌మెంట్ అంటారు. వేడి నీటిలో కూర్చోవడం అనేక వ్యాధులను నివారిస్తుంది.ఈ పద్ధతి ఏ వ్యాధికి ఉపయోపడుతుందో తెలుసుకుందాం.

హాట్ వాటర్ టబ్ లో స్నానానికి  నాచురోపతిలో చాలా ప్రాముఖ్యత ఉంది. దీన్ని హైడ్రో ట్రీట్‌మెంట్ అని కూడా అంటారు. ఈ థెరపీలో మెడ నుండి కిందకి శరీరాన్ని వేడి నీళ్లలో నానబెట్టి కూర్చుంటారు. నేచురోపతిలో హాట్ వాటర్ టబ్ థెరపీని చాలా రకాల వ్యాధులలో ఉపయోగిస్తారు. వేడి నీటిలో కూర్చోవడం అనేక వ్యాదులను నివారిస్తుంది. ఈ సహజ చికిత్స పద్ధతిలో రోగి ఏ వ్యాధికి ఏ ఉష్ణోగ్రత వద్ద కూర్చోవాలో తెలుసుకుందాం. 

ఒక వ్యక్తికి అనారోగ్యం వచ్చినప్పుడల్లా వేడినీళ్లతో స్నానం చేయమని మన పెద్దలు సలహా ఇస్తారు ఇలా చేయడం వల్ల రోగికి ఎలాంటి హాని జరగదు, స్నానం చేయడం వల్ల అతని శరీరం,  మనస్సు రెండూ తేలికవుతాయి. రోగి ఆరోగ్యంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఔషదంలా పనిచేసే హాట్ వాటర్ టబ్ వెనుక ఉన్న  సైన్స్ ఇదే.  వేడి నీటి టబ్బులో కూర్చోవడం వల్ల ఏయే జబ్బులు తగ్గుతాయో తెలుసుకుందాం. .

కిడ్నీ ఫెయిల్యూర్ 

కిడ్నీ రోగులు వేడి నీటిలో కూర్చోవడం ద్వారా  జబ్బును తగ్గించుకోవచ్చు.ఈ పద్ధతిలో రోగిని ఒక టబ్‌లో కూర్చోబెడితే శరీరంలో  సోడియం, పొటాషియం వంటి అనవసరమైన మూలకాల పరిమాణం కూడా తగ్గుతుంది దీంతో మూత్ర ఉత్పత్తి పెరుగుతుంది. కిడ్నీ రోగిని మెడ వరకు వేడి నీటిలో ముంచి, టబ్‌లో కూర్చోబెట్టడం వల్ల అతని శరీరం చెమటలు పట్టి, చెమటతో పాటు యూరియా, క్రియాటినిన్, సోడియం పొటాషియం వంటి వ్యర్థ పదార్థాలు కూడా బయటకు వస్తాయి. ఈ విధంగా, కిడ్నీ రోగిని వేడి నీటిలో కూర్చోబెట్టడం ద్వారా డయాలసిస్ ప్రమాదం తగ్గించవచ్చు.

అధిక రక్త పోటు

హై బ్లడ్ ప్రెజర్ తగ్గించడంలో హాట్ వాటర్ టబ్ చాలా మేలు చేస్తుందని పరిశోధనల్లో తేలింది. అధిక రక్తపోటు ఉన్న రోగిని వేడి నీటిలో కూర్చోబెట్టడం వల్ల రోగి రక్త నాళాలు  తెరుచుకోవడం ప్రారంభమవుతాయి  వాటిలో రక్త ప్రసరణ వేగంగా జరుగుతుంది  రోగి  రక్తపోటు సాధారణమవుతుంది. ప్రతిరోజూ 15 నుండి 20 నిమిషాలు వేడి నీటిలో  వేడి నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి తలస్నానం చేయండి, ఇది రక్తపోటును సాధారణంగా ఉంచుతుంది.

గుండె రోగులకు ప్రయోజనాలు

వేడి నీటి టబ్ సహాయంతో, రోగికి గుండెపోటు వచ్చే అవకాశాలను తగ్గించవచ్చు. వేడి నీటి టబ్ ద్వారా రోగిలో గ్లైకోలిసిస్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. గుండె రోగి ప్రతిరోజూ 30 నుండి 40 నిమిషాల పాటు వేడి నీటిలో కూర్చోవాలి. నిజానికి కూడా హార్ట్ పేషెంట్లు ఎప్పుడూ వేడి నీళ్లలో మాత్రమే స్నానం చేయాలి.

హాట్ వాటర్ టబ్ చికిత్స ద్వారా కాలేయ సంబంధిత సమస్యలైన జాండిస్, ఫ్యాటీ లివర్, లివర్ సిర్రోసిస్ వంటి సమస్యలను కూడా నయం చేయవచ్చు. లివర్ సిర్రోసిస్ ఉన్న రోగి ప్రతిరోజూ వేడి నీటి టబ్‌లో కూర్చుంటే, అతని కాలేయం పని సామర్థ్యం పెరుగుతుంది.

నిద్రలేమి (పెద్దలకు వేడి నీటి బాత్ టబ్):

వేడి నీటి థెరపీలో కూర్చొని నిద్రలేమికి చికిత్స చేయవచ్చు. వేడి నీరు మన మానసిక స్థితిని సడలించడంలో అలాగే ఒత్తిడి  నిద్రలేమి నుండి ఉపశమనం పొందడంలో ఉపయోగకరంగా ఉంటుంది. రోజూ హాట్ వాటర్ టబ్ వాడితే నిద్రలేమి సమస్యతో పాటు ఒత్తిడి కూడా తగ్గుముఖం పట్టినట్లు అనిపిస్తుంది.

బరువు తగ్గవచ్చు:

మీ శరీరాన్ని మొత్తం నీటిలో ముంచి, 40 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద 20 నుంచి 25 నిమిషాలు వేడి నీటిలో కూర్చోండి, అప్పుడు మీ బరువు సహజంగా తగ్గడం ప్రారంభమవుతుంది, ఇది మీ శరీరానికి ఎటువంటి హాని కలిగించదు. శరీరంలోని అదనపు కొవ్వు కూడా తొలగిపోతుంది  

పైల్స్ కోసం వేడి నీటి టబ్:

పైల్స్ సమస్యలో, వేడి నీటిలో కూర్చోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది, పైల్స్ రోగి ప్రతిరోజూ 30 నుండి 40 నిమిషాల పాటు నీటిలో నడుము లోతు వరకు కూర్చోవాలి. ఇలా చేయడం వల్ల పైల్స్ రోగికి ఉపశమనం కలుగుతుంది.  అతని కండరాలు మృదువుగా మారుతాయి. మలవిసర్జన సమస్య నుంచి ఉపశమనం కూడా అందిస్తుంది.

Also Read : గ్రీన్​ టీ తాగండి మంచిదే కానీ.. ఆ సమయంలో మాత్రం వద్దు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Embed widget