అన్వేషించండి

Explore 12 Jyotirlingas in One Trip : 12 జ్యోతిర్లింగాలను ఒకే ట్రిప్​లో ఎలా కవర్​ చేయొచ్చో తెలుసా? హైదరాబాద్​ నుంచి ఇలా స్టార్ట్ అయిపోండి

12 Jyothirlingalu List : మీరు జ్యోతిర్లింగాలు దర్శించుకోవాలనుకుంటే.. అది ఒకే ట్రిప్​లో ప్లాన్ చేయాలనుకుంటే.. మీకు ఈ రూట్ మ్యాప్ హెల్ప్ అవుతుంది. ఏ జ్యోతిర్లింగం ఎక్కడుందో ఎలా వెళ్లాలో తెలుసుకోండిలా.

Pilgrimage to 12 Jyotirlingas : ఇండియాలో మొత్తం 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. వీటిని దర్శించుకోవాలని భక్తులు చూస్తూ ఉంటారు. అలా మీరు జ్యోతిర్లింగాలు చూడాలని, దర్శించుకోవాలని అనుకుంటున్నారా? అది కూడా ఒకటే ట్రిప్​లో అన్ని కవర్ చేయాలనుకుంటున్నారా? అయితే మీకు ఇది హెల్ప్ అవుతుంది. అసలు జ్యోతిర్లింగాలు ఎక్కడున్నాయి? వాటిని ఎలా చేరుకోవాలి? హైదరాబాద్ నుంచి ట్రిప్ ఎలా స్టార్ట్ చేయాలి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

12 జ్యోతిర్లింగాలు - వాటి పేర్లు

సోమనాథుడు, మల్లీకార్జునుడు, మహాకాళుడు, ఓంకారేశ్వరుడు, వైద్య నాథుడు, భీమ శంకరుడు, రామేశ్వరుడు, నాగేశ్వరుడు, విశ్వనాథుడు, త్రయంబకేశ్వరుడు, కేదారేశ్వరుడు, ఘృష్ణేశ్వరుడు.

రూట్ మ్యాప్ ఎలా ఉండాలంటే..

మీరు హైదారాబాద్ నుంచి వీటిని కవర్ చేయాలనుకుంటే.. ఇవి ఉండే ప్రాంతాలు తెలుసుకుని.. వాటి ప్రకారం మీ ట్రిప్ ప్లాన్ చేసుకోండి. హైదరాబాద్ నుంచి వెళ్లాలనుకుంటే.. ముందుగా మీరు మల్లికార్జున జ్యోతిర్లింగం దర్శించుకోవచ్చు. అనంతరం తమిళనాడులోని రామేశ్వరం జ్యోతిర్లింగం దర్శించుకోవచ్చు. తర్వాత మహారాష్ట్రలో మూడు జ్యోతిర్లింగాలు ఉంటాయి. భీమాశంకర్, త్రయంబకేశ్వర, ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగాలు చూడొచ్చు. మధ్యప్రదేశ్​లో ఓంకారేశ్వర్, మహాకాలేశ్వర్ చూడొచ్చు. అనంతరం గుజరాత్ వెళ్లి అక్కడ సోమనాథ్, నాగేశ్వర్ జ్యోతిర్లింగాలు రెండూ కవర్ చేయొచ్చు. ఉత్తరఖాండ్​లో కేథారనాథ్ ఉంటుంది. ఉత్తర ప్రదేశ్​లో కాశీ విశ్వనాథ్. జార్ఖండ్​లో బైద్యనాథ్​ని చూడొచ్చు.  

మల్లికార్జున జ్యోతిర్లింగం..

మీరు హైదరాబాద్ నుంచి మల్లికార్జున జ్యోతిర్లింగమున్న శ్రీశైలంకి ఎలా వెళ్లాలంటే.. మీరు ఏ ప్రదేశంలో ఉన్నా.. ఎంజీబీఎస్ బస్ స్టాప్​కి వెళ్లండి. అక్కడ ఉదయం నుంచి శ్రీశైలంకి బస్సులు అందుబాటులో ఉంటాయి. జర్నీ సమయంలో 3 నుంచి 6 గంటలు ఉంటుంది. అక్కడ స్టే చేసేది లేనిది మీ ఇష్టం. టెంపుల్​కి వెళ్లి జ్యోతిర్లింగాన్ని దర్శించుకోండి. అనంతరం రామేశ్వరానికి స్టార్ట్ అయితే మంచిది. 

రామేశ్వరం జ్యోతిర్లింగం 

శ్రీశైలం బస్ స్టాప్ నుంచి మార్కాపురంకి టికెట్ తీసుకోవాలి. సాయంత్రం 6 లోపు మార్కాపురం స్టేషన్​కి వెళ్లేలా చూసుకోండి. ఎందుకంటే.. రోజుకు ఒకటే ట్రైన్ ఉంటుంది. అది కూడా తిరుపతి వరకే. శ్రీశైలం నుంచి వెళ్లాలంటే ఇదే బెటర్ రూట్. 6.40 మార్కాపూర్ నుంచి ట్రైన్ స్టార్ట్ అవుతుంది. తెల్లారుజాము 4 గంటలకు తిరుపతి రీచ్ అవుతారు. ఇక్కడి నుంచి రామేశ్వరానికి డైరక్ట్ ట్రైన్ కావాలనుకుంటే.. సోమవారం, గురువారం, శుక్రవారం, శనివారం మాత్రం ట్రైన్ సౌకర్యం ఉంటుంది. అవి కూడా ఉదయం 6.10కి, 11.55కి ఉంటాయి. రామేశ్వరంలో మండపం అనే స్టేషన్ వరకు వెళ్లాలి. అక్కడి నుంచి ఆటోలో వెళ్లాలి. లేదంటే తిరుపతి నుంచి చెన్నై ఎగ్మోర్ వెళ్తే అక్కడినుంచి రామేశ్వరంకి వెళ్లొచ్చు. 

భీమాశంకర్, త్రయంబకేశ్వర, ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగాలు

రామేశ్వరం నుంచి భీమాశంకర్​కి వెళ్లాలనుకుంటే..  మధురై జంక్షన్​కి వెళ్లాలి. అక్కడి నుంచి పూణే వెళ్లడానికి ఏ ట్రైన్ ఉంటే దానిని ఎక్కాలి. పూణె నుంచి వాక్డేవాడి బస్​స్టాప్​కి వెళ్లాలి. అక్కడి నుంచి భీమాశంకర్​కి వెళ్లొచ్చు. దర్శనం తర్వాత రిటర్న్ అయిపోవాలి. ఎందకంటే అక్కడ స్టేయింగ్ ఆప్షన్స్ ఎక్కువగా ఉండవు. 

భీమాశంకర్​ నుంచి మంచర్​కి వెళ్లాలి. అక్కడి నుంచి నాసిక్​. నాసిక్ నుంచి త్రియంబకేశ్వరం వెళ్లే బస్ ఎక్కాలి. అక్కడ దర్శనం చేసుకోవాలి. అక్కడి నుంచి మళ్లీ నాసిక్ వెళ్లి.. అక్కడి నుంచి ఛత్రపతి సామ్​వాజి నగర్​కి వెళ్లాలి. అక్కడ నుంచి నేరుగా ఘృష్ణేశ్వర టెంపుల్​కి తీసుకెళ్తారు. దర్శనం తర్వాత ఓంకారేశ్వర్ టెంపుల్​కి వెళ్లాలి. 

ఓంకారేశ్వర్, మహాకాలేశ్వర్ జ్యోతిర్లింగాలు

మధ్యప్రదేశ్​లోని ఓంకారేశ్వర్​కి వెళ్లేందుకు.. మహావీర్ చౌక్ అనే ప్లేస్​కి వెళ్లాలి. అక్కడి నుంచి.. ఇండోర్​కి వెళ్లాలి. అక్కడి నుంచి క్రిస్టల్ ఐటీపార్క్​ దగ్గర దిగాలి. అక్కడ నుంచి ఓంకారేశ్వర్ వెళ్లే బస్సు ఎక్కాలి. అక్కడి నుంచి నది ప్రయాణం చేయాలి. ఫ్రెష్ అయిన తర్వాత బ్రిడ్జ్​ లేదా బోట్​లో వెళ్లొచ్చు. ఓంకారేశ్వరుడి దర్శనం తర్వాత ఉజ్జయినికి బయలుదేరాలి. ఓంకారేశ్వర్​ నుంచి హోటల్ ప్రెసిడెంట్​ దగ్గర దిగాలి. అక్కడ ఉజ్జయిని టెంపుల్​లో మహాకాలేశ్వర్ దర్శనం చేసుకోవాలి. 

సోమనాథ్, నాగేశ్వర్ జ్యోతిర్లింగాలు 

ఉజ్జయిని నుంచి వెరావల్​కి ట్రైన్​లో వెళ్లాలి. స్టేషన్ బయట బస్సులు ఉంటాయి. అవి డైరక్ట్ టెంపుల్ దగ్గరికి తీసుకెళ్తాయి. లేదంటే ఆటోలో కూడా సోమనాథ్ టెంపుల్​కి వెళ్లొచ్చు. దర్శనం తర్వాత నాగేశ్వర్ జ్యోతిర్లింగ దర్శనానికి వెళ్లాలి. దీనికోసం మీరు వెరావెల్ స్టేషన్​కి వెళ్లి.. అక్కడి నుంచి ద్వారక వెళ్లాలి. అక్కడి నుంచి నాగేశ్వర్​కి ఆటోలో లేదా టూర్ బస్​కి వెళ్లొచ్చు. 

కేదారనాథ్

కేదరానాథ్​కి వెళ్లేందుకు ద్వారక నుంచి ఢిల్లీకి ట్రైన్ జర్నీ చేయాలి. అక్కడి నుంచి రిషికేష్ వెళ్లేందుకు బస్ ఎక్కాలి. ఢిల్లీ నుంచి హరిద్వార్​కి కూడా ట్రైన్ జర్నీ చేయొచ్చు. రిషికేష్​, హరిద్వార్ ఈ రెండిటీలో ఎక్కడి దిగినా.. సోన్​ప్రయాగ్ వెళ్లాలి. ఉదయం 11లోపు మాత్రమే బస్సులు అందుబాటులో ఉంటాయి. సోనుప్రయాగ్​లో దిగిన తర్వాత ఎంత లేట్ అయినా.. గౌరికూన వెళ్లిపోతే మంచిదని చెప్తున్నారు. రెస్ట్ తీసుకుని.. ట్రెక్ స్టార్ట్ చేసి.. దర్శనం చేసుకుని రిటర్న్ అయిపోవచ్చు. అనంతర ఢిల్లీ చేరుకుని.. అక్కడి నుంచి కాశీ బయలుదేరొచ్చు. 

కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం

ఢిల్లీ నుంచి కాశీకి వెళ్లేందుకు ఢిల్లీ నుంచి వారణాసికి ట్రైన్​ జర్నీ చేయాలి. కాశికి వెళ్లిన తర్వాత అక్కడ కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలి. 

బైద్యనాథ్ జ్యోతిర్లింగం

వారణాసి నుంచి జసిద్ జంక్షన్ వెళ్లాలి. అక్కడి నుంచి బైద్యనాథ్  టెంపుల్​కి వెళ్లి జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలి. 

ఇలా ఒకే ట్రిప్​లో 12 జ్యోతిర్లింగాలు దర్శించుకోవచ్చు. అయితే ఇది కేవలం ఎలా ట్రావెల్ చేయాలో చెప్పే సమాచారం మాత్రమే. బడ్జెట్, ఎక్కడ స్టే చేయాలి వంటివి దీనిలో మెన్షన్ చేయలేదు. మీరు జ్యోతిర్లింగాలు ఒకే ట్రిప్​లో కవర్​ చేయాలనుకున్నప్పుడు ఇది మీకు బాగా హెల్ప్ అవుతుంది. అలాగే కేదార్​నాథ్ టెంపుల్ ఎప్పుడు తెరిచి ఉంటుందో తెలుసుకుని.. దాని ప్రకారం మీ ట్రిప్​ని ప్లాన్​ చేసుకోవాలి.

Also Read : సోలో ట్రిప్​కి వెళ్లాలనుకుంటే ఇండియాలో బెస్ట్ ప్లేస్​లు ఇవే.. ఈ ఏడాదైనా వెళ్లొచ్చేయండి

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Embed widget