అన్వేషించండి

Kaju Pulao Recipe : టేస్టీ కాజు పులావ్​ను ఇంత సింపుల్​గా చేసేయొచ్చా? బాస్మతి రైస్​ అయితే ఇలా.. సోనా మసూరి అయితే అలా

Lunch box recipes : పిల్లల నుంచి పెద్దల వరకు.. లంచ్​ కోసం ఈజీగా చేసుకోగలిగే కాజు పులావ్​ రెసిపీ ఇక్కడుంది. అయితే కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అయితే టేస్టీగా చేసేయొచ్చు.

Easy Indian rice recipes for lunch : మీకు మధ్యాహ్నం లంచ్ తయారు చేసుకోవడానికి ఎక్కువ సమయం లేనప్పుడు మీరు టేస్టీ టేస్టీ కాజు పులావ్​ను లంచ్​కోసం కుక్ చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా తేలిక. ముఖ్యంగా కుక్కర్​లో చేస్తాము కాబట్టి.. మీరు తక్కువ సమయంలో టేస్టీ ఫుడ్​ని ఆస్వాదించవచ్చు. మరి ఈ టేస్టీ పులావ్​ను తయారు చేసేందుకు కావాల్సిన పదార్థాలు ఏమిటి? ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి? రెసిపీ ఏంటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

కావాల్సిన పదార్థాలు

బాస్మతి బియ్యం - 1 కప్పు

లవంగాలు - 5

యాలకులు - 5 

దాల్చిన చెక్క - అంగుళం

షాజీరా - 1 టేబుల్ స్పూన్ 

బిర్యానీ ఆకులు - 2

ఉల్లిపాయ ముక్కలు  - 1 పెద్దది

పచ్చిమిర్చి - 2

నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు

నూనె - 2 టేబుల్ స్పూన్లు 

జీడిపప్పు - 75 గ్రాములు 

అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1టేబుల్ స్పూన్ 

పుదీనా ఆకుల తురుము - 2 టీస్పూన్లు 

కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్లు 

ఉప్పు - రుచికి సరిపడేంత

పసుపు - చిటికెడు 

గులాబీ రేకులు - 1 టేబుల్ స్పూన్ (ఎండినవి)

తయారీ విధానం 

ముందుగా బాస్మతి రైస్​ను ఓ గంట నానబెట్టుకోవాలి. అనంతరం ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీరను కావాల్సిన విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై కుక్కర్ ఉంచండి. దానిలో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. అనంతరం దానిలో లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, షాజీరా వేసి వేయించుకోవాలి. అవి కాస్త వేగిన తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను దానిలో వేసి కలపాలి. 

ఉల్లిపాయలు కాస్త బంగారు రంగు వచ్చేవరకు వేయించి.. దానిలో జీడిపప్పు వేసి వేయించుకోవాలి. జీడిపప్పు కాస్త క్రిస్పీగా, గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేగితే పులావ్ చాలా రుచిగా ఉంటుంది. జీడిపప్పు నోటికి తగిలిన ప్రతిసారి మీరు దాని రుచిని ఆస్వాదిస్తారు. ఇప్పుడు దానిలో పుదీనా ఆకుల తురుము, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. పచ్చివాసన పోయే వరకు వేయించి.. దానిలో ఉప్పు, పసుపు వేసి మరికొంత వేయించాలి. 

ఒక కప్పు బాస్మతి రైస్ తీసుకుంటే.. దానికి ఒక కప్పు నీటిని తీసుకోవాలి. సోనా మసూరి రైస్ తీసుకుంటే మాత్రం వాటిని మరో గంట ఎక్కువ నానబెట్టుకోవాలి. నీటిని కూడా 1 కప్పునకు.. అరకప్పునకు ముప్పావు కప్పు చొప్పున రెండు కప్పులు వేయాలి. ఇలా సిద్ధం చేసుకుని.. బియ్యాన్ని, నీటిని కుక్కర్​లో వేయాలి. ఇప్పుడు దానిలో మీ దగ్గర ఎండిన గులాబీ రేకులు ఉంటే వేయొచ్చు. ఇది పులావ్​కు మంచి రుచిని ఇస్తుంది. గులాబీ రేకులు వేసిన తర్వాత.. కుక్కర్​ను మూతపెట్టి ఒక విజిల్ వచ్చేవరకు ఉంచితే సరిపోతుంది. సోనా మసూరి అయితే 2 విజిల్స్ రావాలి. 

వెంటనే స్టౌవ్ ఆపి.. ప్రెజర్ పోయేంత వరకు కుక్కర్​ మూతను అలాగే ఉంచాలి. మీ దగ్గర గులాబీ రేకులు లేక వేయకపోతే.. కుక్కర్​ దించిన తర్వాత.. దానిలో రోజ్ వాటర్​ ఒక స్పూన్ వేసి.. బాగా కలపాలి. కాస్త వేడి తగ్గిన తర్వాత ఇలా చేయాలి. లేదంటే రోజ్ వాటర్​ కలిపే సమయంలో రైస్ మెత్తగా అయిపోతుంది. ఇలా కలిపిస్తే.. వేడి వేడి కాజు పులావ్ రెడీ. దీనిని మీరు పనీర్, చికెన్, మటన్​కు మంచి కాంబినేషన్​గా తీసుకోవచ్చు. లేదంటే రైతాతో తీసుకున్న మంచి రుచి ఉంటుంది. మీరు వేడిగా తింటే నేరుగా.. ఎలాంటి సైడ్ కర్రీ లేకుండా తినేయొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ టేస్టీ రెసిపీని తయారు చేసేయండి. 

Also Read : బూందీ లడ్డూలను ఇలా చుట్టేయండి.. ఈ టిప్స్ ఫాలో అయితే వారంపైగా నిల్వ ఉంటాయి

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget