అన్వేషించండి

New Study: పిల్లల్ని కనేందుకు సిద్ధపడుతున్నారా, చేపలు తినడం ఆపేయండి, కొత్త అధ్యయనంలో షాకింగ్ ఫలితాలు

చేపలు గర్భంలోని శిశువుపై ఎలాంటి ప్రభావాన్నో చూపిస్తాయో కొన్ని అధ్యయనాలు బయటపెట్టాయి.

పిల్లలను కనాలని ప్లానింగ్ ఉన్న వాళ్లు చేపలు తినడం మానేయమని సూచిస్తున్నారు అధ్యయనకర్తలు. ‘చేపలు తినడం మానేస్తే ఎలా? వీళ్లు ఇలాగే చెబుతారు’ అని విసుక్కోకండి. పూర్తిగా చదివితే ఎందుకు చేపలు వద్దంటున్నారో అర్థమవుతుంది. చేపలు మంచివే, కానీ మనమే వాటిని విషపూరితం చేస్తున్నాం. అందుకే పిల్లల్ని కనాలన్న ప్లాన్ ఉంటే ముందునుంచే చేపల్ని దూరం పెట్టమని సూచిస్తున్నారు. అమెరికన్ సొసైటీ ఫర్ రిప్రొడక్టివ్ మెడిసిన్ సంస్థతో పాటూ, అమెరికన్ కాలేజ్ ఆఫ్ అబ్ స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ సంస్థలు కలిసి మరీ ఈ విషయంపై తమ అభిప్రాయాన్ని వెల్లడించాయి. దానికి ముందు వారు ఎన్నో అధ్యయనాలు కూడా నిర్వహించారు. 

 చేపలు ఎందుకు తినకూడదు?
సముద్ర జలాల్లో, నదుల్లో వ్యర్థ పదార్థాలు అధికంగా కలుస్తున్నాయి. వాటిల్లో ఎన్నో రసాయనాలు కూడా ఉన్నాయి. పరిశ్రమల వ్యర్థాలైన పాలక్లోరినేటెడ్ బైఫైనైల్ పై నిషేధం ఉన్నప్పటికీ ఇప్పటికీ అది జలాల్లో కలుస్తూనే ఉంది. వాటి ప్రభావం చేపలపై అధికంగా ఉంటుంది. ముఖ్యంగా పాదరసాన్ని చేపలు తమలో నింపుకుంటాయి. వాటిని మనం తినడం వల్ల పాదరసం మన శరీరంలో చేరుతుంది. క్యాన్సర్ కారక లోహాల్లో ఇదీ ఒకటి. డయాబెటిస్, గుండె సంబంధ సమస్యలు రావడానికి పాదరసం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. నిజానికి కూరగాయల్లో కూడా కాస్త పాదరం ఉంటుంది, కానీ 78 శాతం పాదరసం చేపల ద్వారానే మన శరీరంలో వస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. చేపల ద్వారా శరీరంలోని చేరిన పాదరసం నేరుగా మనిషి మెదడుపై ప్రభావం చూపిస్తుంది. 

పుట్టబోయే బిడ్డపై ప్రభావం
గర్భిణిలు చేపలు తినడం తగ్గించాలని ఎప్పుడు అమెరికాలోని ఆరోగ్యసంస్థలు చెప్పాయి. దానికి కారణం పాదరసమే. పాదరసం కలిగిన చేపలను తినడం వల్ల పిండంపై చాలా ప్రభావం చూపిస్తుంది. శిశువులు అసాధారణంగా పుట్టడం, న్యూరోటాక్సిసిటీతో కళ్లు లేనివారిగా, మానసిక, శారీరక ఎదుగుదల లోపంతో పుట్టే అవకాశం ఉంది. అధ్యయనంలో భాగంగా గర్భంతో ఉన్నప్పుడు చేపలు తిన్న తల్లులను ఎంపిక చేసుకున్నారు. వారిలో తల్లులను ఒక వర్గంగా, శిశువులను ఒక వర్గంగా విభజించారు. వారిలో జుట్టుని పరిశోధించడం ద్వారా పాదరసం స్థాయిలను నిర్ధారించారు.పాదరసం స్థాయిలు తక్కువగా ఉన్న తల్లులకు పుట్టిన బిడ్డలతో పోలిస్తే, పాదరసం స్థాయిలు అధికంగా ఉన్న తల్లులకు పుట్టిన బిడ్డల్లో చిన్నమెదడు కొలతల్లో తేడాలు వచ్చాయి. చిన్నమెదడు 1.6మి.మీ చిన్నదిగా ఉంది. అంటే మెదడు ఎదుగుదలపై పాదరసం ప్రభావం చూపించింది. అందుకే పిల్లల్ని కనేందుకు ప్లానింగ్ ఉన్న వారు, గర్భిణిలు చేపలను తినకూడదు అని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు.

ఎన్నో నెలలు...
ఒకరి శరీరంలో చేరిన పాదరసం బయటికి పోవడానికి కొన్ని నెలల సమయం పడుతుంది. అందుకే పిల్లలు వచ్చే ఏడాది కనే అవకాశం ఉందనే ఆలోచన ఉంటే ముందుగానే చేపలు తినడం మానేయాలి తల్లి. పరిశోధకులు మాట్లాడుతూ మహిళ రక్తంలో ఉన్న పాదరసం బయటకు త్వరగానే పోవచ్చని, కానీ మెదడు నుంచి బయటకు రావడానికి మాత్రం దశబ్ధాలు పడుతుందని చెప్పారు. కొన్ని అధ్యయనాలు దాదాపు శరీరం నుంచి పూర్తిగా పాదరసం బయటికి పోవడానికి 27 ఏళ్లు పట్టే అవకాశం ఉందని చెప్పాయి. అందుకే పెళ్లి వయసు దగ్గరగా ఉన్న అమ్మాయిలు పిల్లలు పుట్టే వరకు చేపలు తినడం ఆపేయడం మంచిది అని సూచిస్తున్నారు అధ్యయనకర్తలు. 

Also read: ఈ మూడు ఆహారాలు వీర్యకణాల సంఖ్యను తగ్గిస్తాయి, హెచ్చరిస్తున్న అధ్యయనాలు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Scrolling Social Media for Hours : గంటల తరబడి సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తున్నారా? ఈ అలవాటు ఎంత ప్రమాదమో తెలుసా?
గంటల తరబడి సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తున్నారా? ఈ అలవాటు ఎంత ప్రమాదమో తెలుసా?
Foods for Bone Health : ఎముకలను డ్యామేజ్ చేసే ఫుడ్స్ ఇవే.. బోన్స్ హెల్తీగా ఉండాలంటే ఇవి తినేయండి
ఎముకలను డ్యామేజ్ చేసే ఫుడ్స్ ఇవే.. బోన్స్ హెల్తీగా ఉండాలంటే ఇవి తినేయండి
Excessive Typing Side Effects : రోజంతా టైపింగ్ చేస్తున్నారా? అయితే జాగ్రత్త.. మీకు చేతి, మణికట్టు సమస్యలు రావచ్చు
రోజంతా టైపింగ్ చేస్తున్నారా? అయితే జాగ్రత్త.. మీకు చేతి, మణికట్టు సమస్యలు రావచ్చు
Right Time to Drink Water : నీళ్లు ఏ సమయంలో తాగితే మంచిది? ఇలా తాగితేనే బెస్ట్, లేదంటే సమస్యలు రావచ్చు
నీళ్లు ఏ సమయంలో తాగితే మంచిది? ఇలా తాగితేనే బెస్ట్, లేదంటే సమస్యలు రావచ్చు

వీడియోలు

GT vs RR Qualifier 2 Highlights IPL 2026 | ఐపీఎల్ ఫైనల్‌కు గుజరాత్ టైటాన్స్
Vaibhav Sooryavanshi 96 Runs Highlights IPL 2026 | వైభవ్ సూర్యవంశీని వెంటాడిన దురదృష్టం
Riyan Parag about Vaibhav IPL 2026 | రాజస్థాన్‌కు రెండో టైటిల్ తెచ్చేది వైభవే
Hardik Pandya Leaves Mumbai Indians | ముంబైని వీడి CSKలోకి హార్దిక్ ఎంట్రీ?
Sai Sudharsan Hit Wicket In IPL 2026 | వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హిట్ వికెట్ అయిన సాయి సుదర్శన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karnataka New CM DK Shivakumar: సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక ఏకగ్రీవం.. జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణం
సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక ఏకగ్రీవం.. జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణం
PM SETU Scheme: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
Kurnool Tragedy: కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
Deputy CM Pawan Kalyan: డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్
డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్
AP Telangana regional politics: ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
IPL 2026 Final GT vs RCB: ఆర్‌సీబీతో ఫైన‌ల్లో మాకు ఆ అడ్వాంటేజ్.. ప్రెజర్ అస్సలు లేదు - ఫైనల్ కు ముందు జీటీ కెప్టెన్ గిల్
ఆర్‌సీబీతో ఫైన‌ల్లో మాకు ఆ అడ్వాంటేజ్.. ప్రెజర్ అస్సలు లేదు - ఫైనల్ కు ముందు జీటీ కెప్టెన్ గిల్
Ram Charan : సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
Vaibhav Sooryavanshi News: ఏషియన్ గేమ్స్ ప్రాబబుల్స్ లిస్టులో వైభవ్ సూర్యవంశీ: సూర్య, గిల్‌కు దక్కని చోటు.. 
ఏషియన్ గేమ్స్ ప్రాబబుల్స్ లిస్టులో వైభవ్ సూర్యవంశీ: సూర్య, గిల్‌కు దక్కని చోటు.. 
Embed widget