అన్వేషించండి

New Study: పిల్లల్ని కనేందుకు సిద్ధపడుతున్నారా, చేపలు తినడం ఆపేయండి, కొత్త అధ్యయనంలో షాకింగ్ ఫలితాలు

చేపలు గర్భంలోని శిశువుపై ఎలాంటి ప్రభావాన్నో చూపిస్తాయో కొన్ని అధ్యయనాలు బయటపెట్టాయి.

పిల్లలను కనాలని ప్లానింగ్ ఉన్న వాళ్లు చేపలు తినడం మానేయమని సూచిస్తున్నారు అధ్యయనకర్తలు. ‘చేపలు తినడం మానేస్తే ఎలా? వీళ్లు ఇలాగే చెబుతారు’ అని విసుక్కోకండి. పూర్తిగా చదివితే ఎందుకు చేపలు వద్దంటున్నారో అర్థమవుతుంది. చేపలు మంచివే, కానీ మనమే వాటిని విషపూరితం చేస్తున్నాం. అందుకే పిల్లల్ని కనాలన్న ప్లాన్ ఉంటే ముందునుంచే చేపల్ని దూరం పెట్టమని సూచిస్తున్నారు. అమెరికన్ సొసైటీ ఫర్ రిప్రొడక్టివ్ మెడిసిన్ సంస్థతో పాటూ, అమెరికన్ కాలేజ్ ఆఫ్ అబ్ స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ సంస్థలు కలిసి మరీ ఈ విషయంపై తమ అభిప్రాయాన్ని వెల్లడించాయి. దానికి ముందు వారు ఎన్నో అధ్యయనాలు కూడా నిర్వహించారు. 

 చేపలు ఎందుకు తినకూడదు?
సముద్ర జలాల్లో, నదుల్లో వ్యర్థ పదార్థాలు అధికంగా కలుస్తున్నాయి. వాటిల్లో ఎన్నో రసాయనాలు కూడా ఉన్నాయి. పరిశ్రమల వ్యర్థాలైన పాలక్లోరినేటెడ్ బైఫైనైల్ పై నిషేధం ఉన్నప్పటికీ ఇప్పటికీ అది జలాల్లో కలుస్తూనే ఉంది. వాటి ప్రభావం చేపలపై అధికంగా ఉంటుంది. ముఖ్యంగా పాదరసాన్ని చేపలు తమలో నింపుకుంటాయి. వాటిని మనం తినడం వల్ల పాదరసం మన శరీరంలో చేరుతుంది. క్యాన్సర్ కారక లోహాల్లో ఇదీ ఒకటి. డయాబెటిస్, గుండె సంబంధ సమస్యలు రావడానికి పాదరసం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. నిజానికి కూరగాయల్లో కూడా కాస్త పాదరం ఉంటుంది, కానీ 78 శాతం పాదరసం చేపల ద్వారానే మన శరీరంలో వస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. చేపల ద్వారా శరీరంలోని చేరిన పాదరసం నేరుగా మనిషి మెదడుపై ప్రభావం చూపిస్తుంది. 

పుట్టబోయే బిడ్డపై ప్రభావం
గర్భిణిలు చేపలు తినడం తగ్గించాలని ఎప్పుడు అమెరికాలోని ఆరోగ్యసంస్థలు చెప్పాయి. దానికి కారణం పాదరసమే. పాదరసం కలిగిన చేపలను తినడం వల్ల పిండంపై చాలా ప్రభావం చూపిస్తుంది. శిశువులు అసాధారణంగా పుట్టడం, న్యూరోటాక్సిసిటీతో కళ్లు లేనివారిగా, మానసిక, శారీరక ఎదుగుదల లోపంతో పుట్టే అవకాశం ఉంది. అధ్యయనంలో భాగంగా గర్భంతో ఉన్నప్పుడు చేపలు తిన్న తల్లులను ఎంపిక చేసుకున్నారు. వారిలో తల్లులను ఒక వర్గంగా, శిశువులను ఒక వర్గంగా విభజించారు. వారిలో జుట్టుని పరిశోధించడం ద్వారా పాదరసం స్థాయిలను నిర్ధారించారు.పాదరసం స్థాయిలు తక్కువగా ఉన్న తల్లులకు పుట్టిన బిడ్డలతో పోలిస్తే, పాదరసం స్థాయిలు అధికంగా ఉన్న తల్లులకు పుట్టిన బిడ్డల్లో చిన్నమెదడు కొలతల్లో తేడాలు వచ్చాయి. చిన్నమెదడు 1.6మి.మీ చిన్నదిగా ఉంది. అంటే మెదడు ఎదుగుదలపై పాదరసం ప్రభావం చూపించింది. అందుకే పిల్లల్ని కనేందుకు ప్లానింగ్ ఉన్న వారు, గర్భిణిలు చేపలను తినకూడదు అని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు.

ఎన్నో నెలలు...
ఒకరి శరీరంలో చేరిన పాదరసం బయటికి పోవడానికి కొన్ని నెలల సమయం పడుతుంది. అందుకే పిల్లలు వచ్చే ఏడాది కనే అవకాశం ఉందనే ఆలోచన ఉంటే ముందుగానే చేపలు తినడం మానేయాలి తల్లి. పరిశోధకులు మాట్లాడుతూ మహిళ రక్తంలో ఉన్న పాదరసం బయటకు త్వరగానే పోవచ్చని, కానీ మెదడు నుంచి బయటకు రావడానికి మాత్రం దశబ్ధాలు పడుతుందని చెప్పారు. కొన్ని అధ్యయనాలు దాదాపు శరీరం నుంచి పూర్తిగా పాదరసం బయటికి పోవడానికి 27 ఏళ్లు పట్టే అవకాశం ఉందని చెప్పాయి. అందుకే పెళ్లి వయసు దగ్గరగా ఉన్న అమ్మాయిలు పిల్లలు పుట్టే వరకు చేపలు తినడం ఆపేయడం మంచిది అని సూచిస్తున్నారు అధ్యయనకర్తలు. 

Also read: ఈ మూడు ఆహారాలు వీర్యకణాల సంఖ్యను తగ్గిస్తాయి, హెచ్చరిస్తున్న అధ్యయనాలు

టాప్ హెడ్ లైన్స్

Testosterone Screening After 30: టెస్టోస్టెరాన్‌ ప్రభావం 30 ఏళ్ల తర్వాత తగ్గుతుందా? అమెరికా ఆర్మీ సైనికులకు ఎందుకు స్క్రీనింగ్ పరీక్షలు చేస్తోంది?
టెస్టోస్టెరాన్‌ ప్రభావం 30 ఏళ్ల తర్వాత తగ్గుతుందా? అమెరికా ఆర్మీ సైనికులకు ఎందుకు స్క్రీనింగ్ పరీక్షలు చేస్తోంది?
WHO Global Cancer Report 2026:ప్రతి ఐదుగురిలో ఒకరికి క్యాన్సర్‌ ముప్పు! ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన రిపోర్ట్‌!
ప్రతి ఐదుగురిలో ఒకరికి క్యాన్సర్‌ ముప్పు! ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన రిపోర్ట్‌!
Why To Avoid Salads In Monsoon:వర్షాకాలంలో ఆకుకూరలు, కూరగాయలు, సలాడ్స్ తినకూడదా? తింటే ఏం జరుగుతుంది?
వర్షాకాలంలో ఆకుకూరలు, కూరగాయలు, సలాడ్స్ తినకూడదా? తింటే ఏం జరుగుతుంది?
Dengue Vaccine India: డెంగీకి హైదరాబాద్ మందు! జపాన్‌కు చెందిన QDENGA వ్యాక్సిన్ అమ్మకాలకు భారత్‌ గ్రీన్‌ సిగ్నల్!
డెంగీకి హైదరాబాద్ మందు! జపాన్‌కు చెందిన QDENGA వ్యాక్సిన్ అమ్మకాలకు భారత్‌ గ్రీన్‌ సిగ్నల్!

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
Mee Bhoomi Blockchain Project:ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌!
ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌! "మీ భూమి–బ్లాక్‌ చెయిన్" ప్రాజెక్టు ప్రయోజనమేంటి?
Sonam Wangchuk Letter:సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ! నిరాహార దీక్ విరమణకు షరతులు!
సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ రాశారు! నిరాహార దీక్ విరమణకు షరతులు విధించారు!
Adilabad Latest News:
"ఆదిలాబాద్‌ సీసీఐ కర్మాగార పునరుద్ధరణకు రూ.250 కోట్లు కేటాయించలేరా?" రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ!
Rahul Gandhi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
Gabbar Singh Ramesh: 'గబ్బర్ సింగ్' రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్... కండిషన్ క్రిటికల్ - అపోలోలో ట్రీట్మెంట్
'గబ్బర్ సింగ్' రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్... కండిషన్ క్రిటికల్ - అపోలోలో ట్రీట్మెంట్
Supreme Court: వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
YS Jagan Mohan Reddy: ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం
ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం
Embed widget