అన్వేషించండి

Kidney Transplantation: మెడికల్ మిరాకిల్ - కోతికి పంది కిడ్నీ, రెండేళ్లుగా హాయిగా జీవించేస్తోన్న వానరం

జంతు అవయవ మార్పిడి మీద జరుగుతున్న ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు.

సాధ్యాలని సుసాధ్యం చేయడంలో పరిశోధకులు ఎప్పుడు ముందుంటారు. జంతువుల కిడ్నీలు మనిషి శరీరంలో ఏ విధంగా పని చేస్తాయనే దాని మీద ఇప్పటికే విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తిలో ఇప్పటికే పంది కిడ్నీ పెట్టగా రెండు నెలలకు పైగా విజయవంతంగా పని చేస్తుందని తెలిపారు. తాజాగా మరొక ఆసక్తికరమైన విషయం బయటకి వచ్చింది.

పంది కిడ్నీ అమర్చిన కోతి రెండు సంవత్సరాలుగా జీవించే ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. అవయవ మార్పిడికి చేసిన తర్వాత అత్యంత ఎక్కువ కాలం జీవించి ఉన్న ఘటన ఇదే. జంతువుల అవయవాల ఉపయోగించి మానవుల ప్రాణాలు రక్షించడం కోసం పరిశోధనలు జరుగుతున్నాయి. మానవ అవయవాల కొరత తగ్గించే లక్ష్యాన్ని నెరవేర్చడమే ఈ పరిశోధనల ప్రయోగాలు. ఈ విధానాన్ని జెనోట్రాన్స్ ప్లాంటేషన్ అంటారు.

మానవేతర ప్రైమేట్స్ లో జన్యుపరంగా ఇంజనీరింగ్ చేసిన జంతువుల అవయవాలు ఏ విధంగా పని చేస్తాయని, అవి ఎంత సురక్షితంగా పని చేస్తాయనేది చెప్పేందుకు ఇది రుజువుగా నిలిచాయని పరిశోధకులు తెలిపారు. దీనికి సంబంధించిన అధ్యయనం నేచర్ జర్నల్ లో ప్రచురించారు. ఈ అధ్యయనం యూఏస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ రెగ్యులేటర్ కి మరింత డేటాని అందిస్తుంది. మానవేతర అవయవ మార్పిడికి సంబంధించి ఎంతవరకు ఫలితాలు ఇస్తాయనేది, పందులని ఎంత వరకు ఉత్పత్తి చేయడం సాధమవుతుందని తెలుసుకోవడం ముఖ్యం.

పంది నుంచి మనిషికి మార్పిడి

గత కొన్ని సంవత్సరాలుగా పరిశోధకులు పంది హృదయా, మూత్రపిండాలు ఇద్దరు వ్యక్తులకి అమర్చారు. వారిలో ఒక వ్యక్తి గుండె మార్పిడి చేయించుకున్న కొన్ని రోజులకి ఇన్ఫెక్షన్ కారణంగా మరణించాడు. అయితే గుండెకి ముందుగానే ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల అలా జరిగిందని వైద్యులు వెల్లడించారు. మూత్రపిండాల మార్పిడి చేయించుకున్న వ్యక్తి ముందుగానే బ్రెయిన్ డెడ్ అయ్యాడు. వైద్యుల పరిశోధనల కోసం తన శరీరాన్ని ఇవ్వమని కుటుంబ సభ్యులకి చెప్పడంతో ఈ పరిశోధనకి ఆయన శరీరాన్ని ఉపయోగించుకున్నారు. కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ విజయవంతంగా చేశారు. కిడ్నీలు అమర్చిన రెండు నెలలుగా బాగానే పని చేస్తున్నాయని ఇటీవలే వైద్యులు ప్రకటించారు.

జెనోట్రాన్స్ ప్లాంటేషన్ పరిశోధన ప్రధానంగా పందులపై దృష్టి సారించింది. ఎందుకంటే వాటి అవయవాలు మానవులతో పోల్చదగిన పరిమాణం, శరీర నిర్మాణాన్ని కలిగి ఉంటున్నాయి. మానవుల రోగనిరోధక వ్యవస్థలు, పంది కణాల ఉపరితలాలపై మూడు అణువులకి ప్రతి స్పందిస్తాయి.  

మానవులకి ఉపయోగపడుతుందా?

అవయవ మార్పిడి చేసిన తర్వాత రెండు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జీవించిన ఘాట్ మాత్రం అసాధారణమైంది. జన్యుమార్పిడి చేసిన పందుల అవయవాలు మానవులలో మెరుగ్గా పని చేసే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కోతుల కంటే మానవుల చాలా ఎక్కువ బరువు కలిగి ఉంటారు. అధిక రక్తపోటు ఉంటుంది. అందుకే పంది అవయవాలు మానవ శరీరంలో తట్టుగోలవో లేదో విస్తృతంగా పరిశోధనలు చేయాల్సి ఉంది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

Also Read: గుడ్లు తింటే రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోతాయా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
Virat Kohli Century: మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Embed widget