అన్వేషించండి

Indonesia New Visa Rules: ఇక స్వర్గంలో సెటిలైపోవచ్చు, బాలీలో ‘సెకండ్ హోం వీసా’ ప్రత్యేకతలు ఇవే

ఇండోనేషియాలో అత్యంత రమణీయ ప్రదేశం బాలి ద్వీపం. అక్కడికి వచ్చే పర్యాటకులను మరింత ఆకట్టుకునేందుకు అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణం తీసుకున్నది. 10 ఏండ్లు బాలిలో ఉండేలా వీసాలు జారీ చేయబోతున్నది.

ర్యాటక రంగం మీద ఎక్కువ ఆధారపడే దేశాల్లో ఇండోనేషియా ఒకటి. నిత్యం వేలాది మంది విదేశీ టూరిస్టులు ఆ దేశానికి వస్తుంటారు. ఇండోనేషియాలోని బాలి ద్వీపం గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  ప్రపంచ పర్యాటకులు అత్యంత ఎక్కువగా ఇష్టపడే ప్రాంతం. ఇక్కడ ఉండే ప్రకృతి అందాలు, పురాతన కట్టడాలు, వారసత్వ నిర్మాణాలు ఎంతో ఆకట్టుకుంటాయి. కరోనా తర్వాత మళ్లీ పర్యాటక రంగాన్ని మరింత ప్రోత్సహించే దిశగా ఇండోనేషియా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.  ఇందులో భాగంగానే తాజాగా ‘సెకండ్ హోమ్ వీసా’ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఈ వీసాలు గతానికి భిన్నంగా ఉన్నాయి. వీటిని పొందిన విదేశీ పర్యాటకులు బాలిలో ఎక్కువ కాలం ఉండడానికి, పని చేయడానికి అవకాశం ఉంటుంది.

10 ఏండ్ల నివాస వీసాకు నిబంధన ఒక్కటే!

బాలిలో దీర్ఘకాల నివాసం కోసం సంపన్న పర్యాటకులను ఆకర్షించడానికి ఇండోనేషియా ‘సెకెండ్ హోమ్ వీసా’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా  విదేశీయులు దేశంలో ఎక్కువ కాలం ఉండటంతో పాటు పని చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే, ఈ వీసా ఇవ్వడానికి ఇండోనేషియా సర్కారు కొన్ని నిబంధనలను పెట్టినట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక  ప్రకారం, బ్యాంకు ఖాతాల్లో కనీసం 2 బిలియన్ రూపాయలు (₹10,717,544) కలిగి ఉన్న విదేశీయులకు 5, 10 సంవత్సరాలు నివాసం ఉండేలా సరికొత్త 'సెకండ్ హోమ్ వీసా'ను అందిస్తామని అధికారులు ప్రకటించారు. ఈ నూతన వీసా విధానం క్రిస్మస్ రోజున లేదంటే కొత్త నిబంధన జారీ చేసిన 60 రోజుల తర్వాత అమలులోకి వస్తుంది.

పర్యాటకుల ఆకర్షణకు కీలక నిర్ణయం

పర్యాటకులు ఎక్కువ రోజులు నివసించేందుకు ఉండేలా కోస్టా రికా, మెక్సికో ప్రభుత్వాలు ఇప్పటికే సెకండ్ హోమ్ వీసాలు జారీ చేస్తున్నాయి. తాజాగా వాటి లిస్టులో ఇండోనేషియా చేరింది. ఈ నూతన  వీసా విధానం ద్వారా పర్యాటకులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. నిపుణులు, పదవీ విరమణ చేసినవారు, ఇతర సంపన్న వ్యక్తులను ఆకర్షించడానికి  దీర్ఘకాలిక  వీసా ఉపయోగపడనుంది. "బాలితో పాటు దేశంలోని ఇతర పర్యాటక ప్రాంతాలకు వచ్చే విదేశీ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నాం" అని ఇమ్మిగ్రేషన్ యాక్టింగ్ డైరెక్టర్ జనరల్ విడోడో ఏకత్జాజానా తెలిపారు.    

పూర్తి స్థాయిలో విమాన సేవలు

ఇప్పటికే పర్యాటకులను బాగా ఆకర్షించేందుకు  గరుడ ఇండోనేషియా వంటి విమానయాన సంస్థలు అంతర్జాతీయ విమానాలను పునఃప్రారంభించాయి. కరోనా తర్వాత మత సేవలను మళ్లీ పూర్తి స్థాయిలో అందిస్తున్నాయి. ఇండోనేషియాకు విదేశీ పర్యాటకుల రాక గణనీయంగా పుంజుకుంది. అటు నవంబర్‌లో బాలిలో జరగబోయే G-20 సమ్మిట్‌ కారణంగా ఈ ద్వీపంపై అంతర్జాతీయ దృష్టి పడే అవకాశం ఉంది. ఈ సమ్మిట్ లో సుమారు 10 వేల మంది విదేశీ ప్రతినిధులు పాల్గొననున్నారు.

Read Also: స్నానమంటే బద్దకమా? ఈ మిషన్‌లో పడుకుంటే చాలు, అదే స్నానం చేయించేస్తుంది

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget