అన్వేషించండి

FSSAI : ఎక్స్పైరీ డేట్ 45 రోజుల కంటే తక్కువుంటే ఫుడ్ ఐటెమ్స్ సప్లై చేయొద్దట-FSSAI చెప్పిన విషయాలివే

FSSAI : ఆన్‌లైన్‌లో పనిచేస్తోన్న ఫుడ్ బిజినెస్ ఆపరేటర్‌లను కేవలం 45 రోజుల షెల్ఫ్ లైఫ్ ఉన్న వినియోగదారులకు ఆ ఆహార పదార్థాలను మాత్రమే డెలివరీ చేయాలని FSSAI కోరింది.

FSSAI : నేటి బిజీ లైఫ్‌లో సమయం లేక.. ఒకవేళ ఉన్నా వంట చేసే ఓపిక లేక చాలా మంది ఫుడ్ డెలివరీ యాప్స్, రెస్టారెంట్స్ పై ఆధారపడుతున్నారు. డబ్బు సంపాదించే ఆరాటంలో ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. దీనిపై ఎంత మంది నిపుణలు హెచ్చరించినా.. పరిస్థితి ఇప్పుడు చేయి దాటిపోయింది. టైంకి తిన్నామా, టేస్టీగా ఉందా అనే ఆలోచిస్తున్నారు తప్ప దాని క్వాలిటీ గురించి ఆలోచించట్లేదు. క్వాలిటీ ఫుడ్ ఇస్తున్నారా లేదా అని ఈ మధ్య కాలంలో అనేక చోట్ల అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ ఇంకా ఈ తరహా ఘటనలు ఆగట్లేదు. ఈ సమయంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ఆన్‌లైన్‌లో పనిచేస్తున్న ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లకు (FBOs) కీలక సూచనలు జారీ చేసింది. ఆహార వ్యాపార నిర్వాహకులు కనీసం 45 రోజుల షెల్ఫ్ లైఫ్.. అంటే ఎక్స్పైరీ డేట్ ఉన్న ఆహార పదార్థాలను వినియోగదారులకు డెలివరీ చేయాలని FSSAI పేర్కొంది. దీనర్థమేమిటంటే.. గడువు తేదీ 45 రోజుల కంటే తక్కువగా ఉంటే సప్లై చేయవద్దన్నమాట. ఇది కాకుండా ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు లేబులింగ్ అండ్ డిస్‌ప్లే నిబంధనలను సైతం అనుసరించాలని  ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తెలిపింది.

ఈ మధ్య కాలంలో ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేయడం కూడా ఆందోళనలను రేకిత్తిస్తోంది. బిర్యానీలో బళ్లులు, కీటకాలు వంటివి రావడం ఆహార ప్రియులను భయానికి గురి చేస్తోంది. దీంతో ఎప్పుడైనా ఆర్డర్ చేయాలనుకునే వారు ఆలోచించి మరీ ఫుడ్ ఆర్డర్ పెడుతున్నారు. అందుకే ఫుడ్ ఆర్డర్ చేస్తున్నపుడు జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో, మీరు ఆర్డర్ చేసిన ఆహారం వినియోగానికి అనుకూలంగా ఉందో లేదో ఒకటికి రెండు సార్లు చెక్ చేసినా పోయేదేం ఉండదు. అదే సమయంలో ఆ ఆహార పదార్ధం గడువు తేదీ 45 రోజుల కంటే తక్కువగా ఉంటే, దానిని తీసుకోవద్దు. వెంటనే మీరు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI)కి మీరు ఫిర్యాదు కూడా చేయవచ్చు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా వినియోగదారుల కోర్టులు, సంబంధిత ఫోరమ్‌లలో ఏటా 5 లక్షలకు పైగా ఫిర్యాదులు దాఖలవుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. అయితే వీటిలో చాలా కేసులు వివిధ కారణాల వల్ల పెండింగ్‌లో ఉన్నాయని చూపిస్తున్నాయి.

ఈ-జాగృతి పోర్టల్ ద్వారా కేసుల పరిష్కారం మరింత సులభతరం

చాలా మందికి తెలియని విషయమేమింటే.. ఇ-జాగృతి పోర్టల్‌తో కేసుల పరిష్కారం మరింత సులభం అవుతుంది. అందుకే వినియోగదారులు తమ హక్కుల గురించి అప్రమత్తంగా ఉండాలి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ఆన్‌లైన్‌లో పనిచేస్తోన్న ఫుడ్ బిజినెస్ ఆపరేటర్‌లను (FBOs) షెల్ఫ్ లైఫ్ అంటే కనీసం 45 రోజుల గడువు ఉన్న వినియోగదారులకు మాత్రమే డెలివరీ చేయాలని కోరింది.

జొమాటోకు నోటీసులు

ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటోకు మరోసారి ఊహించని రీతిలో జీఎస్టీ డిమాండ్‌ నోటీసులు అందాయి .వినియోగదారుల నుంచి వసూలు చేసిన డెలివరీ ఫీజుపై రూ.803.4 కోట్ల మేరు ఉన్న జీఎస్టీ బకాయిలు చెల్లించాల్సి ఉందంటూ ఈ నోటీసులు కంపెనీకి వచ్చాయి. ఈ విషయాన్ని రెగ్యులేటరీ ఫైలింగ్‌ సందర్భంగా జొమాటో కంపెనీ తెలిపింది.

Also Read : బరువు తగ్గేందుకు బొప్పాయిని పరగడుపునే తినాలట.. మరిన్నో బెనిఫిట్స్ కూడా

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget