అన్వేషించండి

Rohini Karthi 2024 : మరో వారం రోహిణి కార్తె ప్రభావం ఉంటుంది.. మండే ఎండలతో జాగ్రత్త

Rohini Karthe 2024 Duration : రోహిణి కార్తీ మొదలైపోయింది. ఎండలు మండిపోతున్నాయి. ఇంకో ఎనిమిది రోజులు దీనిని భరించాల్సిందే. ఈ సమయంలో రోహిణి కార్తీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Rohini Karthe Effect on Telugu States : రోహిణి కార్తీ పూర్తిగా సూర్యుడి ఆధీనంలో ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశిస్తే దానిని రోహిణి కార్తె అంటారు. అందుకే ఈ సమయంలో ఎండలు మండిపోతాయి. ప్రతి నక్షత్రంలో సూర్యుడు సుమారు 13.5 రోజులు ఉంటాడు. ఈ సంవత్సరం మే 25వ తేదీన ఈ రోహిణి కార్తె మొదలైంది. జూన్ 8వ తేదీవరకు ఈ ఎండలను భరించాల్సిందే. ఎందుకంటే ఆ సమయంలో సూర్యుడి తీవ్రత తారా స్థాయికి చేరుకుంటుంది. అనంతరం ఎండతీవ్రత తగ్గుతుంది. 

మండే సూరీడు..

సంవత్సరం మొత్తంలో అధిక వేడి ఈ సమయంలోనే ఉంటుంది. సాధారణంగా రోహిణి కార్తె మే మూడోవ లేదా మే చివరి వారంలో వస్తుంది. ఈ సంవత్సరం చివరి వారం అనగా మే 25న వచ్చింది. ఇది జూన్​ 8వ తేదీతో ముగిసిపోతుంది. వ్యవసాయ పంచాంగం ప్రకారం ఈ నక్షత్రాలను కార్తెలు అంటారు. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలానికి కార్తె అని పేరును జోడించి పిలుస్తారు. అంటే సంవత్సరానికి 27 కార్తెలు ఉంటాయి. సాధారణంగా ఉగాది నుంచి సూర్యుడి ప్రభావం పెరుగుతుంది. క్రమంగా ఎండలు పెరిగి.. రోహిణి కార్తె సమయంలో తీవ్రమైన స్థాయికి చేరుకుని క్రమంగా తగ్గి.. వర్షాకాలన్ని వెల్​కమ్ చెప్తాయి. ఈ కార్తెతో వేసవి కాలం పూర్తై.. వర్షాకాలం ప్రారంభమవుతుంది. వ్యవసాయంపై ఆధారపడే రైతులు అప్పుడు పొలం పనులు ప్రారంభిస్తారు. 

ఎల్లో అలెర్ట్

అసలే ఎండలు భరించలేకుండా ఉన్నాయిరా బాబు అనుకుంటే ఈ రోహిణి కార్తె వల్ల మరింత ఇబ్బంది కలుగుతుంది. అందుకే మధ్యాహ్నం వేళలో బయటకు వెళ్లేందుకు ప్రజలు భయపడుతున్నారు. దాదాపు రోడ్లు నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. ఒకవేళ ఎండలో బయటకు వెళ్తే జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెప్తున్నారు. తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రతల నేపథ్యంలో ఎల్లో అలెర్ట్ కూడా చేశారు. ఈ సమయంలో రిస్క్ తీసుకోవడం కంటే ఇంట్లోనే జాగ్రత్తగా ఉండడం మంచిదని చెప్తున్నారు. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..

ఎండ తీవ్రత వల్ల అలసిపోకుండా ఉండేందుకు నీరు తాగుతూ ఉండాలి. ఫ్రిడ్జ్ వాటర్​ కాకుండా మట్టి కుండలోని నీటి తాగడం మంచిది. కూల్ డ్రింక్స్ కాకుండా మజ్జిగ, పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, జావ వంటివి తాగాలి. ఇవి శరీరంలోని వేడిని తగ్గిస్తాయి. పైగా వీటితో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయి. ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. వెళ్లాల్సి వస్తే.. షేడ్స్, స్కార్ఫ్ వంటివి తీసుకుని జాగ్రత్తగా వెళ్లాలి. కాటన్, వైట్ కలర్ దుస్తులు శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. ఫుడ్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. డీప్ ఫై చేసిన ఫుడ్స్​కి దూరంగా ఉంటే మరీ మంచిది.

చల్లని కబురు.. 

నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు మరో మూడురోజుల్లో వస్తాయని వాతావరణశాఖ తెలిపింది. జూన్ రెండవ తేదీన వర్షం వచ్చే సూచనలు ఉన్నాయని కూడా తెలిపింది. అయితే వర్షం వచ్చినా.. ఈ ఎండల వల్ల ఉక్కపోత ఎక్కువగా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రజలు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలని.. వాతావరణంలోని సడెన్ మార్పులు ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయని అంటున్నారు. 

Also Read : ఎండ తీవ్రత ఎక్కువ అవుతోంది జాగ్రత్త.. ముఖ్యంగా వారు ఏమాత్రం లైట్ తీసుకున్నా అంతే సంగతులు

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆమె, డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ (Dr. BRAOU) నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2018లో హైదరాబాద్‌లో ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ ఆమె మూడేళ్లు పనిచేశారు.

తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో ఒక సంవత్సరం పాటు పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశం లో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ అందిస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs SA 5th T20 Highlights : తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ

వీడియోలు

Atha Kodalu In Sarpanch Elections Heerapur | హోరాహోరీ పోరులో కోడలిపై గెలిచిన అత్త | ABP Desam
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs SA 5th T20 Highlights : తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
Delhi Crime: కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Bhartha Mahasayulaku Wignyapthi Teaser : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
Embed widget