అన్వేషించండి

Sun Stroke Prevention Tips : ఈ ఎండలను తక్కువ అంచనా వేయకండి.. ఈ పొరపాట్లు చేస్తే చనిపోయే ప్రమాదముంది 

Heat Strokes : సమ్మర్ హీట్ వేవ్స్​ మొదలైపోయాయి. వాతావరణ శాఖ కూడా ప్రజలను బయటకు వెళ్లొద్దని హెచ్చరికలు ఇస్తుంది. మీకు తెలుసా? ఈ హీట్ వేవ్స్ మీ ప్రాణాలు కూడా తీస్తాయని?

Heat Waves in India Summer 2024 : గతంలో వేసవి కాలం కూడా కాస్త బెటర్​గానే ఉండేది. కానీ ఇప్పుడు వేసవి మరి వేడెక్కిపోతుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు ఈ ఎండలను భరించలేకపోతున్నాయి. 2024 గురించి మాట్లాడుకుంటే.. జనవరి మూడోవారం నుంచి ఉష్ణోగ్రతలు పెరగడం మొదలయ్యాయి. ఫిబ్రవరికే ఎండకాలాన్ని తలపించే ఎండలు వచ్చేశాయి. మార్చి, ఏప్రిల్​లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మే వచ్చే రెండు రోజులు కూడా అవ్వలేదు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటేసింది. కొన్నిప్రాంతాల్లో 45 డిగ్రీలు మించిన ఉష్ణోగ్రతలు చూస్తున్నాము. రానున్న రోజుల్లో కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇండియా మొత్తంగా ఈ ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువయ్యే అవకాశముందని వాతావరణ శాఖ చెప్తోంది. 

వారు మరింత జాగ్రత్తగా ఉండాలి..

భారత్​లోని వివిధ ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని అలెర్ట్స్ జారీ చేస్తుంది. అయితే ఈ హీట్​ వేవ్​లు, అధిక ఉష్ణోగ్రతలు ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపిస్తాయి. కొన్నిసందర్భాల్లో మనిషి చనిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. తాజాగా ఓ పదిహేడేళ్ల కుర్రాడు ఎండవల్ల చనిపోయాడనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అందుకే ఈ సమ్మర్​లో.. ముఖ్యంగా హీట్​ వేవ్​ల సమయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, ఆరోగ్య ఇబ్బందులు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు. 

ఆ సమస్యలున్నవారికి ఇంకా ప్రమాదం

అధిక వేడివల్ల అలసట, హీట్ స్ట్రోక్ వంటి వేడి సంబంధిత ఆరోగ్యసమస్యలు ఎక్కువ అవుతాయి. అంతేకాకుండా వేడి తీవ్రత ఎక్కువగా ఉంటే.. డీహైడ్రేషన్ సమస్య ఎక్కువ అవుతుంది. అధిక ఉష్ణోగ్రతలు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఇవి అదనపు మరణాలుకు దారితీస్తాయి. పగలు ఎక్కువగా రాత్రి తక్కువగా ఉంటుంది. ఉదయం ఆరుగంటలకే మధ్యాహ్నమా అనే రేంజ్​లో ఎండలు ఉంటున్నాయి. ఇవి శరీరాన్ని ఒత్తిడికి గురిచేస్తాయి. శ్వాసకోశ, గుండె సంబంధిత సమస్యలు, డయాబెటిస్, మూత్రపిండాల వ్యాధులతో ఇబ్బందే పడేవారిలో ఈ అధిక ఉష్ణోగ్రతలు మరణానికి ప్రధాన కారణంగా మారుతున్నాయని తాజా అధ్యయనం తెలిపింది. 

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..

హీట్​వేవ్స్​లో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఎండలో బయటకు వెళ్లకపోవడమే మంచిది. వీలైతే ఇంట్లోనే ఉండేలా చూసుకోండి. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వచ్చినా.. ఉదయాన్నే మీ గమ్యస్థానానికి చేరుకునేలా.. సాయంత్రం ఇంటికి వచ్చేలా చూసుకోవాలి. డీహైడ్రేషన్​కు గురైతే.. వెంటనే ప్రాథమిక చికిత్సను అందించాలి. వీలైనంత హైడ్రేటెడ్​గా ఉండాలి. హెల్తీ ఫుడ్స్, హైడ్రేటెడ్​గా ఉంచే ఫుడ్స్​ని డైట్​లో చేర్చుకోవాలి. స్పైసీ ఫుడ్స్, ఫ్రై చేసిన ఫుడ్స్​కి దూరంగా ఉండాలి. ఎండలో ప్రయాణిస్తే.. మధ్యలో కాస్త నీడలో ఆగుతూ.. నీటిని తాగుతూ ఉండాలి. లేదంటే ఈ వేసవిలో ప్రాణాలమీద ఆశలు వదులుకోవాల్సిందే అంటున్నారు. ఈ చిన్న మిస్టేక్స్ మీరు చేస్తే హీట్​వేవ్స్​కి బలైపోవాల్సి వస్తుందని చెప్తున్నారు నిపుణులు.

ఎండలు జనాభాను వివిధ రూపాల్లో తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఆరోగ్యం విషయంలో అత్యవసర పరిస్థితులను ప్రేరేపిస్తాయి. పని సామర్థ్యం తగ్గిపోతుంది. ఇలా ఎండలు ఏర్పడడానికి గ్లోబల్ వార్మింగే ప్రధాన కారణం. వాతావరణంలో కలిగే తీవ్రమార్పులన్నీ గ్లోబల్ వార్మిగ్ వల్లే జరుగుతున్నాయి. ఇలాగే ఇది కంటిన్యూ అయితే భవిష్యత్తులో మరిన్నీ తీవ్రమమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి పర్యావరణహిత పనులు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. 

Also Read : రోజురోజుకు పెరుగుతున్న గవదబిళ్లల సమస్య.. పిల్లలను సురక్షితంగా ఉంచే మార్గాలివే

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget