అన్వేషించండి

Billionaire: భూమ్మీద ఇప్పటివరకు పుట్టినవాళ్లలో అత్యంత ధనవంతుడు ఈయనే, పనివారికి కూడా బంగారు వస్త్రాలే

ప్రపంచంలో ఇప్పటివరకు పుట్టినవాళ్లలో అత్యంత ధనవంతుడి జీవిత కథ ఇది.

బిలియనీర్లు అనగానే ఎలన్ మస్క్, అదానీ, జెఫ్ బెజోస్... ఇలా పేర్లు చెబుతారు కానీ, వీరందరి ఆస్తులు కలిపినా కూడా ఓ ఆఫ్రికన్ రాజు సంపదలో కనీసం పావు వంతు కూడా ఉండవేమో. ఇప్పటివరకు ఈ భూమిపై పుట్టిన మనుషుల్లో అత్యంత సంపన్నుడు ఇతడేనట. అంటే మానవ జాతిలోనే అత్యంత ధనవంతుడని చెప్పుకోవచ్చు. అతని పేరు మాన్సా మూసా. ఓ ఆఫ్రికన్ రాజు. ప్రస్తుతం ఆఫ్రికాలో ఉన్న మాలి దేశం ఉన్న ప్రాంతంలోనే ఈయన రాజ్యం ‘టింబక్తు‘ ఉండేది. దాదాపు 2000 మైళ్ల పరిధిలో ఈ రాజ్యం పరుచుకుని ఉండేది. కొన్ని వందల ఏళ్లక్రితం ఆయన దీన్ని పాలించాడు. పుట్టుకతోనే సంపన్నుడు. కానీ తన తెలివి తేటలతో ఆ సంపదను కొన్ని వేల రెట్లు పెంచుకున్నాడు. ఇతను ఆ రాజ్యాన్ని 12వ శతాబ్ధంలో పరిపాలించినట్టు చెబుతారు.

పనివారికి బంగారు వస్త్రాలు
మాన్సా మూసా ఎక్కడికి వెళ్లినా ఆయన వెంట పెద్ద పరివారం వెళ్లేది. రక్షణ కోసం వందల మంది సైనికులు వెళ్లేవారు. ఒంటెలు, వాటిని నడిపేవారు, కళాకారులు, అలాగే వందల మంది పనివారు, దారి మధ్యలో వంటలు చేసేందుకు వంటగాళ్లు, గొర్రెలు, కోళ్లు, కూరగాయలు మోసేవారు... ఇలా వేల మందితో వెళ్లేవాడు. ఆయన చుట్టూ ఉండే పనివారు కూడా బంగారంతో నేసిన వస్త్రాలే ధరించేవారట.ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ సంపన్న జీవితాన్నే జీవించినట్టు చెప్పుకుంటారు. 

తెలివెక్కువే...
మాన్సా మూసాకు తెలివి తేటలు ఎక్కువే. అతడు పుట్టిన సమయానికి అతడి రాజ్యం సంపన్న రాజ్యం. తన తెలివితేటలతో వ్యాపారాన్ని మరింతగా విస్తరించాడు. ఆ రాజ్యంలో ఉన్న బంగారు గనులను, ఉప్పు నిక్షేపాలను తవ్వి ఇతర దేశాలకు ఎగుమతి చేసేవాడు. ఏనుగు దంతాల వ్యాపారం విపరీతంగా లాభించి సంపదను కుమ్మరించింది. 

అప్పటి అతని ఆస్తిని ఇప్పుడు లెక్కల్లో చెప్పాలంటే ఎంత లేదన్నా రూ.31 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. ఇంత ఆస్తి ఉన్న వ్యక్తి ఇంతవరకు భూమ్మీద పుట్టలేదు. మాన్సా రాజ్యంలోనే ప్రపంచంలో ఉన్న సగం బంగారం ఉండేదని చెప్పుకుంటారు చరిత్రకారులు. ఆ బంగారమంతా దాదాపు పరాయిదేశాలకు తరలిపోయినట్టు చెబుతారు. బ్రిటన్ దేశానికి ఎక్కువ మొత్తంలో బంగారం చేరినట్టు చెబుతారు. ఒకప్పుడు బంగారంతో, సంపదతో తులతూగి పోయిన ఆ ప్రాంతం తరువాత కాలంలో మాలి దేశంగా మారింది. కానీ మాలి ఇప్పుడు పేద ఆఫ్రికా దేశంగా మారిపోయింది. దానికి కారణం మాన్సా మూసానే అని చెప్పుకోవచ్చు. ఎంత తెలివిగా డబ్బు సంపాదించాడో అంతే వెర్రితనంగా కోల్పోయాడు కూడా. దేశ ఆర్ధిక వ్యవస్థలో మార్పులు చేసేందుకు ప్రయత్నించాడు. కొంత బంగారాన్ని చెలామణీ నుంచి తొలగించాడు. విపరీతంగా ఖర్చులు చేసి చివరికి బంగారు నాణాలు కూడా చేతిలో మిగలకుండా అయిపోయాడు. 

మక్కా ప్రయాణం ఓ చరిత్రే...
అతడు తన రాజ్యం టింబక్తు నుంచి మక్కా వరకు చేసిన తీర్ధయాత్ర చరిత్రలో నిలిచిపోయింది. ఇప్పటికీ ఎంతో పుస్తకాలలో ఈ విషయం గురించి ప్రస్తావించారు. 1324లో తన రాజ్యానికి  2,700 మైళ్ల దూరంలో ఉన్న మక్కాకు ప్రయాణం అయ్యాడు. రాజ్య భారాన్ని కొడుక్కి అప్పగించాడు. మక్కాకు ఊరేగింపుగా ప్రయాణమయ్యాడు. తనతో పాటూ 60,000 మంది మగ పనివారు, 12,000 బానిసలు వెళ్లారు. వీరంతా తమతో పాటూ కిలోన్నర బంగారు కడ్డీలు తీసుకెళ్లారు. బంగారు పూల దండలు, గుర్రాలు, ఒంటెలు కూడా వెంట తీసుకెళ్లారు.పరివారం మొత్తానికి ఆహారాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా అందించారు. అందుకే మాన్సా మూసా ఇప్పటికీ చరిత్ర మర్చిపోని సంపన్నుడు. 

Also read: మాస్ హిస్టీరియాతో తలలు బాదుకున్న విద్యార్థులు, అసలేంటి ఈ హిస్టీరియా? ఎందుకు వస్తుంది?

Also read: పిల్లల్లో పెరుగుతున్న టమోటో ఫీవర్ కేసులు, ఇది టమోటొలు తినడం వల్ల మాత్రం రాదు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Embed widget