అన్వేషించండి

Ksheerannam Recipe : దసర నవరాత్రులు ప్రారంభం.. అమ్మవారికి మొదటిరోజు క్షీరాన్నాన్ని ఇలా చేసి నైవేద్యంగా పెట్టేయండి

Dussehra Navaratri day 1 : దసర నవరాత్రులు ప్రారంభమైపోయాయి. ఈ సమయంలో అమ్మవారికి ఎలాంటి నైవేద్యాలు పెట్టాలో.. ఎలా చేయాలో రెసిపీలు చూసేద్దాం. మొదటిరోజు ఏమి నైవేద్యం పెట్టాలంటే..

Dussehra Navaratri day 1 Prasadam Recipe : దసర నవరాత్రులు ఈరోజు నుంచే ప్రారంభమయ్యాయి. ఒక్కోరోజు అమ్మవారిని ఒక్కో అలంకరణ చేసి.. ఒక్కోరకమైన టేస్టీ వంటకాలను నైవేద్యంగా పెడతారు. అలా మొదటిరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన క్షీరాన్నాన్ని పెడతారు. దీనినే పరమాన్నం (Paramannam Recipe)అనికూడా అంటారు. ఇది అంటే అమ్మవారికి మహాప్రీతి అట. మరి ఈ టేస్టీ క్షీరాన్నాన్ని ఎలా తయారు చేయాలో.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు చూసేద్దాం. 

కావాల్సిన పదార్థాలు 

బియ్యం - ముప్పావు కప్పు

సగ్గు బియ్యం - పావు కప్పు

పాలు - 5 కప్పులు 

నీళ్లు - 2 కప్పులు

బెల్లం - ఒకటిన్నర కప్పులు

నెయ్యి - రెండు టేబుల్ స్పూన్లు

జీడిపప్పు - 15

ఎండుద్రాక్ష - 10

కొబ్బరి ముక్కలు - గుప్పెడు

యాలకుల పొడి - అర టీస్పూన్

తయారీ విధానం

ముందుగా బియ్యం, సగ్గుబియ్యం కలిపి వాటిని బాగా కడిగి నానబెట్టాలి. అవి ఓ గంట నానితే సరిపోతుంది. మీరు సగ్గుబియ్యం వద్దు అనుకుంటే కప్పు నిండుగా బియ్యం తీసుకోవాలి. వాటిని కూడా ఇలాగే నానబెట్టుకోవాలి. గంట తర్వాత మందపాటి కడాయి లేదా గిన్నె తీసుకుని దానిని స్టౌవ్​పై వెలిగించి పెట్టాలి. దానిలో కాస్త నీళ్లు వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పాలు అడుగుపట్టకుండా ఉంటాయి. బియ్యాన్ని ఏ కప్పుతో కొలిచామో.. అదే కప్పుతో పాలు తీసుకోవాలి. ఒక కప్పుకి 5 కప్పుల పాలు వేసుకోవాలి. అదే కప్పుతో రెండు కప్పుల నీళ్లు వేసుకోవాలి. పాలు చిక్కగా పాయసం రుచి బాగుంటుంది. అలాగే మీరు నీళ్లు వద్దనుకుంటే కేవలం పాలతోనే దీనిని వండుకోవచ్చు. 

పాలు మరిగేలోపు మరో స్టౌవ్ వెలిగించాలి. దానిపై కడాయి పెట్టి బెల్లం వేసుకోవాలి. ఒక కప్పు బియ్యాన్ని ఒకటిన్నర కప్పు బెల్లం సరిపోతుంది. దానిలో అరకప్పు నీళ్లు వేసి బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత మంటను మీడియంలో ఉంచి దానిని బాగా మరిగించుకోవాలి. అనంతరం స్టౌవ్ ఆపేసి.. బెల్లం పాకాన్ని మలినాలు లేకుండా ఫిల్టర్ చేసుకోవాలి. దానిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోపు పాలు కూడా పూర్తిగా కాగిపోతాయి. ఇప్పుడు వాటిలో ముందుగా నానబెట్టుకున్న బియ్యం, సగ్గుబియ్యాన్ని పాలల్లో వేసి కలపాలి. 

మంటను తగ్గించి అన్నాన్ని ఉడికిస్తే నిదానంగా ఉడుకుతుంది. మూతపెడితే అన్నం మంచిగా ఉడుకుతుంది. అలాగే మీరు దగ్గర్లోనే ఉంటారనుకుంటే మంటను మీడియంలో చేసి ఉడికించుకోవచ్చు. మధ్యమధ్యలో రైస్​ని కలుపుతూ ఉండాలి. లేదంటే అడుగుపడుతూ ఉంటుంది. ఇలా అన్నం పూర్తిగా మెత్తబడేవరకు ఉడికించుకోవాలి. అన్నం పాలల్లో కలిసి చిక్కగా మారుతుంది. ఇప్పుడు దానిలో యాలకుల పొడి వేసి కలిపి స్టౌవ్​ని ఆపేయాలి. 

ఇప్పుడు అదే రైస్​లో ముందుగా తయారు చేసుకున్న బెల్లం పాకం వేసుకోవాలి. బెల్లం పాకం పూర్తిగా చల్లారాలి. లేదంటే రైస్ విరిగిపోతుంది. అన్నంలో బెల్లం పూర్తిగా కలుపుకోవాలి. ఇప్పుడు చిన్నకడాయిలో డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. వాటిని నెయ్యితోపాటు క్షీరాన్నంలో వేసేయాలి. అంతే టేస్టీ టేస్టీ క్షీరాన్నం రెడీ. ఈ నవరాత్రుల్లో దీనిని అమ్మవారికి మొదటిరోజున దీనిని చేసి నైవేద్యంగా పెట్టేయండి. సాధారణ రోజుల్లో కూడా ఈ టేస్టీ క్షీరాన్నం లేదా పరమాన్నం చేసి పెట్టేయొచ్చు.  

Also Read : దసరా సమయంలో అమ్మవారికి చిట్టిగారెలు ఎందుకు పెడతారో తెలుసా? ఇలా చేసి నైవేద్యంగా సమర్పిస్తే

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Amaravati: జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
Jagan: రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
Revanth Reddy comments: కార్పొరేట్ కంపెనీల కోసమే ఉపాధి హామీ పథకంలో మార్పులు- మోదీ ప్రభుత్వంపై రేవంత్ సంచలన ఆరోపణలు
కార్పొరేట్ కంపెనీల కోసమే ఉపాధి హామీ పథకంలో మార్పులు- మోదీ ప్రభుత్వంపై రేవంత్ సంచలన ఆరోపణలు
YS Jagan on Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు భూ సేకరణ చేసింది మేమే, కేసులు వాదించింది మేమే, అనుమతులు తెచ్చింది మేమే- మొదటి ఫ్లైట్‌ ఎప్పుడు ఎగురుతుందో చెప్పింది మేమే: జగన్
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు భూ సేకరణ చేసింది మేమే, కేసులు వాదించింది మేమే, అనుమతులు తెచ్చింది మేమే- మొదటి ఫ్లైట్‌ ఎప్పుడు ఎగురుతుందో చెప్పింది మేమే: జగన్

వీడియోలు

India vs South Africa Vaibhav Suryavanshi | మూడో వన్డేలో 233 పరుగుల తేడాతో విజయం
Shreyas Iyer Fitness Update Ind vs NZ | టీమ్ ఇండియాకు గుడ్‌న్యూస్!
Robin Uthappa about Team India | ఉత‌ప్ప సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati: జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
Jagan: రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
Revanth Reddy comments: కార్పొరేట్ కంపెనీల కోసమే ఉపాధి హామీ పథకంలో మార్పులు- మోదీ ప్రభుత్వంపై రేవంత్ సంచలన ఆరోపణలు
కార్పొరేట్ కంపెనీల కోసమే ఉపాధి హామీ పథకంలో మార్పులు- మోదీ ప్రభుత్వంపై రేవంత్ సంచలన ఆరోపణలు
YS Jagan on Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు భూ సేకరణ చేసింది మేమే, కేసులు వాదించింది మేమే, అనుమతులు తెచ్చింది మేమే- మొదటి ఫ్లైట్‌ ఎప్పుడు ఎగురుతుందో చెప్పింది మేమే: జగన్
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు భూ సేకరణ చేసింది మేమే, కేసులు వాదించింది మేమే, అనుమతులు తెచ్చింది మేమే- మొదటి ఫ్లైట్‌ ఎప్పుడు ఎగురుతుందో చెప్పింది మేమే: జగన్
Hyderabad Crime News: సంక్రాంతి వేళ హైదరాబాద్‌లో చైనా మాంజాపై ఉక్కుపాదం; ఆ దారంతో పతంగులు ఎగరేసిన వారిపై కేసులు! పోలీసుల సంచలన నిర్ణయం
సంక్రాంతి వేళ హైదరాబాద్‌లో చైనా మాంజాపై ఉక్కుపాదం; ఆ దారంతో పతంగులు ఎగరేసిన వారిపై కేసులు! పోలీసుల సంచలన నిర్ణయం
The Raja Saab Story : అసలు 'రాజా సాబ్' ఎవరు? - నానమ్మ... నేను... ఓ విలన్ - డార్లింగ్ ప్రభాస్ క్యూట్ లీక్స్
అసలు 'రాజా సాబ్' ఎవరు? - నానమ్మ... నేను... ఓ విలన్ - డార్లింగ్ ప్రభాస్ క్యూట్ లీక్స్
ED Raids at IPAC Office: IPAC కార్యాలయంలో ED సోదాలు! ఫైల్స్‌తో రైడ్ జరిగే ప్రాంతానికి మమతా బెనర్జీ!
IPAC కార్యాలయంలో ED సోదాలు! ఫైల్స్‌తో రైడ్ జరిగే ప్రాంతానికి మమతా బెనర్జీ!
Gurram Papireddy OTT : ఓటీటీలోకి డార్క్ కామెడీ 'గుర్రం పాపిరెడ్డి' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి డార్క్ కామెడీ 'గుర్రం పాపిరెడ్డి' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Embed widget