అన్వేషించండి

Ksheerannam Recipe : దసర నవరాత్రులు ప్రారంభం.. అమ్మవారికి మొదటిరోజు క్షీరాన్నాన్ని ఇలా చేసి నైవేద్యంగా పెట్టేయండి

Dussehra Navaratri day 1 : దసర నవరాత్రులు ప్రారంభమైపోయాయి. ఈ సమయంలో అమ్మవారికి ఎలాంటి నైవేద్యాలు పెట్టాలో.. ఎలా చేయాలో రెసిపీలు చూసేద్దాం. మొదటిరోజు ఏమి నైవేద్యం పెట్టాలంటే..

Dussehra Navaratri day 1 Prasadam Recipe : దసర నవరాత్రులు ఈరోజు నుంచే ప్రారంభమయ్యాయి. ఒక్కోరోజు అమ్మవారిని ఒక్కో అలంకరణ చేసి.. ఒక్కోరకమైన టేస్టీ వంటకాలను నైవేద్యంగా పెడతారు. అలా మొదటిరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన క్షీరాన్నాన్ని పెడతారు. దీనినే పరమాన్నం (Paramannam Recipe)అనికూడా అంటారు. ఇది అంటే అమ్మవారికి మహాప్రీతి అట. మరి ఈ టేస్టీ క్షీరాన్నాన్ని ఎలా తయారు చేయాలో.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు చూసేద్దాం. 

కావాల్సిన పదార్థాలు 

బియ్యం - ముప్పావు కప్పు

సగ్గు బియ్యం - పావు కప్పు

పాలు - 5 కప్పులు 

నీళ్లు - 2 కప్పులు

బెల్లం - ఒకటిన్నర కప్పులు

నెయ్యి - రెండు టేబుల్ స్పూన్లు

జీడిపప్పు - 15

ఎండుద్రాక్ష - 10

కొబ్బరి ముక్కలు - గుప్పెడు

యాలకుల పొడి - అర టీస్పూన్

తయారీ విధానం

ముందుగా బియ్యం, సగ్గుబియ్యం కలిపి వాటిని బాగా కడిగి నానబెట్టాలి. అవి ఓ గంట నానితే సరిపోతుంది. మీరు సగ్గుబియ్యం వద్దు అనుకుంటే కప్పు నిండుగా బియ్యం తీసుకోవాలి. వాటిని కూడా ఇలాగే నానబెట్టుకోవాలి. గంట తర్వాత మందపాటి కడాయి లేదా గిన్నె తీసుకుని దానిని స్టౌవ్​పై వెలిగించి పెట్టాలి. దానిలో కాస్త నీళ్లు వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పాలు అడుగుపట్టకుండా ఉంటాయి. బియ్యాన్ని ఏ కప్పుతో కొలిచామో.. అదే కప్పుతో పాలు తీసుకోవాలి. ఒక కప్పుకి 5 కప్పుల పాలు వేసుకోవాలి. అదే కప్పుతో రెండు కప్పుల నీళ్లు వేసుకోవాలి. పాలు చిక్కగా పాయసం రుచి బాగుంటుంది. అలాగే మీరు నీళ్లు వద్దనుకుంటే కేవలం పాలతోనే దీనిని వండుకోవచ్చు. 

పాలు మరిగేలోపు మరో స్టౌవ్ వెలిగించాలి. దానిపై కడాయి పెట్టి బెల్లం వేసుకోవాలి. ఒక కప్పు బియ్యాన్ని ఒకటిన్నర కప్పు బెల్లం సరిపోతుంది. దానిలో అరకప్పు నీళ్లు వేసి బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత మంటను మీడియంలో ఉంచి దానిని బాగా మరిగించుకోవాలి. అనంతరం స్టౌవ్ ఆపేసి.. బెల్లం పాకాన్ని మలినాలు లేకుండా ఫిల్టర్ చేసుకోవాలి. దానిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోపు పాలు కూడా పూర్తిగా కాగిపోతాయి. ఇప్పుడు వాటిలో ముందుగా నానబెట్టుకున్న బియ్యం, సగ్గుబియ్యాన్ని పాలల్లో వేసి కలపాలి. 

మంటను తగ్గించి అన్నాన్ని ఉడికిస్తే నిదానంగా ఉడుకుతుంది. మూతపెడితే అన్నం మంచిగా ఉడుకుతుంది. అలాగే మీరు దగ్గర్లోనే ఉంటారనుకుంటే మంటను మీడియంలో చేసి ఉడికించుకోవచ్చు. మధ్యమధ్యలో రైస్​ని కలుపుతూ ఉండాలి. లేదంటే అడుగుపడుతూ ఉంటుంది. ఇలా అన్నం పూర్తిగా మెత్తబడేవరకు ఉడికించుకోవాలి. అన్నం పాలల్లో కలిసి చిక్కగా మారుతుంది. ఇప్పుడు దానిలో యాలకుల పొడి వేసి కలిపి స్టౌవ్​ని ఆపేయాలి. 

ఇప్పుడు అదే రైస్​లో ముందుగా తయారు చేసుకున్న బెల్లం పాకం వేసుకోవాలి. బెల్లం పాకం పూర్తిగా చల్లారాలి. లేదంటే రైస్ విరిగిపోతుంది. అన్నంలో బెల్లం పూర్తిగా కలుపుకోవాలి. ఇప్పుడు చిన్నకడాయిలో డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. వాటిని నెయ్యితోపాటు క్షీరాన్నంలో వేసేయాలి. అంతే టేస్టీ టేస్టీ క్షీరాన్నం రెడీ. ఈ నవరాత్రుల్లో దీనిని అమ్మవారికి మొదటిరోజున దీనిని చేసి నైవేద్యంగా పెట్టేయండి. సాధారణ రోజుల్లో కూడా ఈ టేస్టీ క్షీరాన్నం లేదా పరమాన్నం చేసి పెట్టేయొచ్చు.  

Also Read : దసరా సమయంలో అమ్మవారికి చిట్టిగారెలు ఎందుకు పెడతారో తెలుసా? ఇలా చేసి నైవేద్యంగా సమర్పిస్తే

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget