అన్వేషించండి

Copper Vessel: రాగి పాత్రల్లో నీళ్లు ఉంచి, తాగుతున్నారా? మీ ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపుతుందో తెలుసా

Health Tips in Telugu | తాగే నీటిని రాగి పాత్రలో 6 నుంచి 8 గంటలు ఉంచడం వల్ల రాగి కొద్దిగా నీటిలో కరిగి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీన్ని ఒలిగోడైనమిక్ ప్రభావం అంటారు.

ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి ఒక భాగం అయిపోయింది. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు, మహిళలు ఇలా అంతా ఒత్తిడికి చిత్తవుతున్నారు. దాంతో ప్రజలు ఆరోగ్యం పట్ల అవగాహన పెంచుకున్నారు. దీనికోసం రోజువారీ జీవితంలో పూర్వకాలపు ఆరోగ్య పద్ధతులను చేర్చుకుంటున్నారు. వీటిలో ఒకటి చాలా ప్రాచుర్యం పొందింది. అదే రాగి పాత్రల్లో (Copper Vessels)లో మంచి నీళ్లు తాగడం. 

కొందరు ఇంట్లో రాగి బిందెలు, రాగి చెంబులలో నీళ్లు పోసి తాగుతుంటారు. కొందరు పని ప్రదేశాలలో రాగి బాటిల్స్ వినియోగిస్తుంటారు. ఆయుర్వేద సంప్రదాయంలో రాగి పాత్రలలో నీరు నిల్వ ఉంచి త్రాగడాన్ని ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుందని భావిస్తారు. కానీ శాస్త్రీయ పరంగా సైతం రాగి పాత్రలలో నీళ్లు తాగడం సురక్షితమా? ఇక్కడ తెలుసుకోండి..

రాగి పాత్రలో నీరు తాగడం ఎలా ప్రారంభమైంది?

రాగి పాత్రల్లో తాగునీటిని నిల్వ చేసుకునే ఆచారం ప్రాచీన భారతదేశానికి ఈజిప్టు నుండి వచ్చింది. ఆయుర్వేదంలో దీన్ని తామ్రజలం అంటారు. ఇది శరీరంలోని మూడు దోషాలను (వాతం, పిత్తం, కఫం) సమతుల్యం చేయడంలో దోహదం చేస్తుంది. శరీరాన్ని శుద్ధి చేయడంలో, మీ శక్తిని పెంచడంలో సహాయపడుతుందని భావిస్తారు.

నీటిలో రాగి కరుగుతుందా?

నీటిని రాగి పాత్రలో 6 నుండి 8 గంటలు లేదా రాత్రంతా నిల్వ చేసినప్పుడు, కొద్ది మొత్తంలో రాగి అయాన్లు నీటిలో కలిసిపోతాయి. ఈ ప్రక్రియను ఒలిగోడైనమిక్ ఎఫెక్ట్ అంటారు. ఇవి బ్యాక్టీరియా, వైరస్‌లను నాశనం చేస్తాయి.

ఇవి ప్రయోజనాలు

  • రోగనిరోధక శక్తిని పెంచుతుంది: రాగిలో యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరాన్ని ఇన్ఫెక్షన్లు, వాపు లాంటివి రాకుండా పోరాడటంలో సహాయపడతాయి.
  • జీర్ణక్రియ: రాగి హానికరమైన బ్యాక్టీరియాను చంపుతుంది. మన కడుపులో వాపు, పుండ్లు, జీర్ణక్రియ సమస్యలు దూరం చేస్తుంది. ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పిస్తుంది.
  • బరువు నియంత్రణ: రాగి పాత్రల్లో నిల్వ ఉంచిన నీరు ప్రతిరోజూ తాగినే మీ బరువు కంట్రోల్‌లో ఉంటుంది. ఇది శరీరంలో అదనపు కొవ్వును  సమర్థవంతంగా తొలగించడంలో సహాయపడుతుంది. 
  • ఆరోగ్యకరమైన చర్మం: శరీరంలో రాగి మెలనిన్ ఉత్పత్తిలో సహాయపడుతుంది. ఇది చర్మాన్ని పునరుత్పత్తి చేయడంతో పాటు మచ్చలను తొలగిస్తుంది.
  • థైరాయిడ్ సమతుల్యత: థైరాయిడ్ గ్రంధి పనితీరుకు రాగి కావాలి. దాని లోపం అసమతుల్యతకు దారితీస్తుంది.

రాగి పాత్రలను ఎలా ఉపయోగించాలి?

  • రాగి సీసాను శుభ్రమైన నీటితో నింపాలి. దాన్ని రాత్రంతా లేదా కనీసం 6 గంటలు ఉంచండి.
  • రాగి పాత్రలోని నీటి ద్వారా ఫలితాలు పొందాలంటే ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి
  • రాగి అధికంగా శరీరంలో చేరకుండా ఉండటానికి, రోజుకు ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే ఆ పాత్రలో పోసిన నీళ్లు తీసుకోవాలి. 
  • ఆమ్ల ద్రవాలను (ఉదాహరణకు నిమ్మరసం) లాంటివి రాగి పాత్రల్లో నిల్వ చేసి తాగవద్దు

ఎంత మోతాదులో రాగి తీసుకోవాలి

అధిక మోతాదులో రాగి శరీరంలో చేరడం సైతం ఇన్‌టాక్సినేషన్ కు దారితీస్తుంది. తద్వారా వికారం, వాంతులు, కడుపు నొప్పి, కాలేయ సమస్యలు వంటి లక్షణాలు కనిపించవచ్చు. పెద్దలు రోజుకు 0.9 మిల్లీగ్రాముల రాగి శరీరంలోకి చేరినా ఏ సమస్య ఉండదు. దీన్ని ఆహారం ద్వారా సైతం పొందవచ్చు.

గమనిక: వార్తలో పేర్కొన్న సమాచారం కొన్ని వైద్య నివేదికల ఆధారంగా ఇక్కడ అందించాం. ఇందులోని విషయాలకు ఏబీపీ దేశం బాధ్యత వహించదు. మీరు ఏదైనా వైద్య, ఆరోగ్య సలహాను పాటించే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించండి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs SA 1st T20: కటక్‌ టీ20లో సౌతాఫ్రికాపై 101 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా
కటక్‌ టీ20లో సౌతాఫ్రికాపై 101 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా
Andhra Pradesh Latest News: స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్ నియమించనున్న ఏపీ ప్రభుత్వం
స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్ నియమించనున్న ఏపీ ప్రభుత్వం
Telangana Rising Summit: సినీ రంగానికి పూర్తి స్థాయి ప్రోత్సాహం - సీఎం రేవంత్ హామీ
సినీ రంగానికి పూర్తి స్థాయి ప్రోత్సాహం - సీఎం రేవంత్ హామీ
Karthigai Deepam Row: ప్రభుత్వం Vs విపక్షాలు Vs కోర్టు - తమిళనాడు రాజకీయాల్లో సెగ రేపుతున్న ఆలయ దీపం
ప్రభుత్వం Vs విపక్షాలు Vs కోర్టు - తమిళనాడు రాజకీయాల్లో సెగ రేపుతున్న ఆలయ దీపం

వీడియోలు

Smriti In Nets After Wedding Cancellation | బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న స్మృతి మంధాన
SKY about Sanju Samson as Opener | టీమ్ పై కీలక వ్యాఖ్యలు చేసిన SKY
Gambhir about Team India Batting Order | గంభీర్ కొత్త స్టేట్మెంట్ అర్థం ఏంటి..?
Irfan Pathan Comments on Captain Shubman Gill | గిల్‌కు కీలక సూచన చేసిన ఇర్ఫాన్ పఠాన్‌
Irfan Pathan Comments on Shubman Gill | గిల్‌కు కీలక సూచన చేసిన ఇర్ఫాన్ పఠాన్‌

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs SA 1st T20: కటక్‌ టీ20లో సౌతాఫ్రికాపై 101 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా
కటక్‌ టీ20లో సౌతాఫ్రికాపై 101 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా
Andhra Pradesh Latest News: స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్ నియమించనున్న ఏపీ ప్రభుత్వం
స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్ నియమించనున్న ఏపీ ప్రభుత్వం
Telangana Rising Summit: సినీ రంగానికి పూర్తి స్థాయి ప్రోత్సాహం - సీఎం రేవంత్ హామీ
సినీ రంగానికి పూర్తి స్థాయి ప్రోత్సాహం - సీఎం రేవంత్ హామీ
Karthigai Deepam Row: ప్రభుత్వం Vs విపక్షాలు Vs కోర్టు - తమిళనాడు రాజకీయాల్లో సెగ రేపుతున్న ఆలయ దీపం
ప్రభుత్వం Vs విపక్షాలు Vs కోర్టు - తమిళనాడు రాజకీయాల్లో సెగ రేపుతున్న ఆలయ దీపం
Pilot Rostering Issues: భారత్‌లో పైలట్‌ల కొరతకు కారణాలేంటీ? యువత అటువైపుగా ఎందుకు ఆసక్తి చూపడం లేదు?
భారత్‌లో పైలట్‌ల కొరతకు కారణాలేంటీ? యువత అటువైపుగా ఎందుకు ఆసక్తి చూపడం లేదు?
IPL 2026 Auction :ఐపీఎల్ 2026 వేలం కోసం ఎంపికైన 350 మంది ఆటగాళ్ల వివరాలు ఇవే!
ఐపీఎల్ 2026 వేలం కోసం ఎంపికైన 350 మంది ఆటగాళ్ల వివరాలు ఇవే!
Dekhlenge Saala Song Promo: 'దేఖ్‌లేంగే సాలా' ప్రోమో వచ్చేసిందోచ్... మైఖేల్ జాక్సన్ స్టైల్‌లో పవర్ స్టార్ స్టెప్పులు - ఫ్యాన్స్‌కు పండగ
'దేఖ్‌లేంగే సాలా' ప్రోమో వచ్చేసిందోచ్... మైఖేల్ జాక్సన్ స్టైల్‌లో పవర్ స్టార్ స్టెప్పులు - ఫ్యాన్స్‌కు పండగ
Satya Nadella: భారత్‌లో మైక్రోసాప్ట్ 17.5 బిలియన్ డాలర్ల పెట్టుబడి -ప్రధాని మోదీతో భేటీ తర్వాత సత్యనాదెళ్ల ప్రకటన
భారత్‌లో మైక్రోసాప్ట్ 17.5 బిలియన్ డాలర్ల పెట్టుబడి -ప్రధాని మోదీతో భేటీ తర్వాత సత్యనాదెళ్ల ప్రకటన
Embed widget