అన్వేషించండి

Water: నీరు తక్కువగా తాగుతున్నారా? అయితే కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది జాగ్రత్త

నీరు తక్కువగా తాగితే శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోయే అవకాశం ఉంది.

ఎండాకాలంలో దాహం విపరీతంగా వేస్తుంది. కానీ వానాకాలం, శీతాకాలంలో మాత్రం దాహం తగ్గిపోతుంది. దానికి కారణం వాతావరణంలో ఉండే చల్లదనమే దాహం వేసినా, వేయకపోయినా ప్రతి రెండు గంటలకు ఒకసారి కచ్చితంగా నీళ్లు తాగాల్సిందే. కానీ చాలామంది దాహం వేస్తే మాత్రమే నీళ్లు తాగుతారు. దీని వల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. త్వరగా డిహైడ్రేషన్ బారిన పడతారు. శరీరంలో నీళ్లు తగ్గితే ప్రధాన అవయవాలైన కాలేయం, కండరాలు, కీళ్లు వంటివి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోయే అవకాశం ఉంది.

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే అనేక రకాల సమస్యలు మొదలవుతాయి. అధ్యయనం చెబుతున్న ప్రకారం ఎప్పుడైతే శరీరంలో నీరు తగ్గుతుందో కొలెస్ట్రాల్ ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ల మోతాదులు పెరుగుతాయి. నీటి శాతం తగ్గిపోతే కాలేయం రక్తంలోకి ఎక్కువగా కొలెస్ట్రాల్ ని విడుదల చేస్తుందని చెబుతున్నారు పరిశోధనకర్తలు.

అంతేకాదు రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్‌ను తొలగించాల్సిన ప్రక్రియ కూడా నెమ్మదిస్తుంది. దీనివల్ల రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇలా చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండెకు సమస్య రావచ్చు. గుండెపోటు వంటివి త్వరగా వచ్చే అవకాశం ఉంది. అయితే నీటికి, ఈ కొలెస్ట్రాల్ పెరుగుదలకు మధ్య సంబంధం ఏంటన్నది ఇంకా అధ్యయనకర్తలు తెలుసుకోలేకపోయారు. కానీ తగినంత నీరు తాగితే మాత్రం శరీరంలో కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవచ్చనే విషయాన్ని మాత్రం చెబుతున్నారు. ఎవరైతే ఎక్కువగా నీరు తాగుతారో వారిలో చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతున్నట్టు అధ్యయనంలో తేలింది.

గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే కచ్చితంగా నీరు తాగాల్సిందే. నీరు ఎక్కువగా తాగితే... కొలెస్ట్రాల్ తక్కువగా రక్తంలోకి విడుదలవుతుంది. గుండె పోటు వంటివి వచ్చే పరిస్థితులు తగ్గుతాయి. కాబట్టి కాలంతో పని లేకుండా ప్రతి రెండు గంటలకు ఒకసారి కనీసం గ్లాసు నీళ్లు తాగుతూ ఉండండి. రోజు మొత్తంలో ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగండి. ఇది శరీరానికి శక్తిని అందిస్తుంది. అలాగే కొలెస్ట్రాల్‌‌ను తగ్గించి, శరీరం ఉత్సాహంగా ఉండేలా చూస్తుంది. 

శరీరంలో నీరు తగ్గడం చాలా ప్రమాదకరం. తగినంత నీరు తీసుకోవడం ద్వారా 80 శాతం రోగాలను దూరం పెట్టవచ్చు. జీవక్రియలు సక్రమంగా సాగాలంటే తగినంత నీరు అవసరం. మెదడుకు సరిగా పనిచేయాలన్నా నీరే కావాలి. నీరు తగ్గితే తలనొప్పి వచ్చేస్తుంది. నీరు తక్కువగా తాగే వారిలో ఏకాగ్రత కుదరదు. మతిమరుపు కూడా వచ్చేస్తుంది. డిప్రెషన్ వంటివి త్వరగా దాడి చేస్తాయి. కాబట్టి శారీరక, మానసిక ఆరోగ్యం కోసం కచ్చితంగా నీటిని తగినంత తాగుతూ ఉండాలి. 

Also read: చూయింగ్ గమ్ నములుతూ అనుకోకుండా అలా మింగేస్తే ఏమవుతుంది?

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

టాప్ హెడ్ లైన్స్

ఉదయం సూర్యుడు ఎర్రగా ఎందుకు? శాస్త్రీయ, ఆధ్యాత్మిక కారణాలు!
ఉదయం సూర్యుడు ఎర్రగా ఎందుకు? శాస్త్రీయ, ఆధ్యాత్మిక కారణాలు!
Cancer Risk: అర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా కూర్చుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌! ఆందోళన కలిగిస్తున్న కొత్త పరిశోధన !
అర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా కూర్చుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌! ఆందోళన కలిగిస్తున్న కొత్త పరిశోధన !
Monsoon 2026: వర్షం పడుతుంటే టీ తాగుతూ పకోడీలు తినాలనే కోరిక ఎందుకు పెరుగుతుంది?
వర్షం పడుతుంటే టీ తాగుతూ పకోడీలు తినాలనే కోరిక ఎందుకు పెరుగుతుంది?
Gen Z vs Millennials: మిలీనియల్స్ కంటే జెన్ జీ ఎక్కువ ఫిట్‌, ఆరోగ్యంగా ఉందా? ఆశ్చర్యపరుస్తున్న కొత్త నివేదిక! 
మిలీనియల్స్ కంటే జెన్ జీ ఎక్కువ ఫిట్‌, ఆరోగ్యంగా ఉందా? ఆశ్చర్యపరుస్తున్న కొత్త నివేదిక! 

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Embed widget