అన్వేషించండి

Vitamin Deficiency: వాసన, రుచి తెలియడం లేదా? కరోనా వల్లే కాదు, ఈ విటమిన్ లోపం వల్ల కూడా కావచ్చు

వాసన, రుచి తెలియకపోవడానికి కారణాలలో విటమిన్ లోపం కూడా ఒకటి.

కరోనా లక్షణాలలో వాసన, రుచి తెలియకపోవడం ప్రధానం. చాలా మంది కరోనా సోకిన రోగులు ఈ విచిత్రి పరిస్థితిని ఎదుర్కొన్నారు. అప్పట్నించి వాసన, రుచి శక్తి తగ్గితే చాలు కరోనా వచ్చిందేమో అన్న అనుమానాలు అధికమైపోయాయి. వాసన తెలియకపోయినా వెంటనే కరోనా టెస్టులు చేయించుకునే వారి సంఖ్య పెరిగిపోయింది. నిజానికి కరోనా వైరస్ కారణంగా  మాత్రం వాసన, రుచి శక్తిని కోల్పోదు శరీరం, విటమిన్ల లోపం వల్ల కూడా ఆ శక్తి సమర్థంగా పనిచేయదు. ముఖ్యంగా విటమిన్ డి లోపం వల్ల రుచి, వాసన గ్రహించే శక్తి తగ్గిపోతుంది. అందుకే విటమిన్ డి లోపం లేకుండా చూసుకోవాలి. 

విటమిన్ డి పుష్కలంగా దొరికేది నీరెండ నుంచే. కొన్ని ఆహారాలలో దొరికినా కూడా అది కొద్దిమొత్తమే. ఇప్పుడు ప్రజలకు నీరెండలో ఓ అరగంట పాటూ నిల్చునేంత టైమ్ ఎక్కడుంది? ఏసీ రూముల్లో ఇరుక్కుపోతున్నారు. ఎండ కనిపిస్తే చాలు నీడ పట్టుకు చేరుకుంటున్నారు. ఉదయాన కాచే ఎండనే నీరెండ అంటారు. ఈ ఎండ ద్వారానే విటమిన్ డి పుష్కలంగా అందుతుంది. అలాగే సాయంత్రం పూట సూర్యాస్తమయానికి ముందు కాచే ఎండ ద్వారా కూడా విటమిన్ డి అందుతుంది. అపార్టమెంట్లు అధికం అవ్వడంతో చాలా మందికి ఎండ జాడ తెలియడం లేదు. భారీ భవంతులు పెరిగిపోవడంతో నీరెండ ప్రజలకు చేరడం లేదు కూడా.అయినా సరే ఎండ తగిలే చోట రోజుకో అరగంటైనా నిల్చుంటే చాలా మంచిది. మనదేశంలో 90 శాతం ప్రజల్లో విటమిన్ డి లోపం ఉందంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎలా ఉందో.

విటమిన్ డి ఎలా?
సూర్యకిరణాలు మన చర్మంపై పడినప్పుడు, చర్మం కింద పొరల్లో ఉన్న కొవ్వులు కరిగి డి విటమిన్ ఉత్పత్తి అవుతుంది. కాబట్టి నీరెండలో నిల్చోవాల్సిన అవసరం ఉంది. డి విటమిన్ లోపం వల్ల ఎముకలు గుల్లబారడం, రోగనిరోధక శక్తి తగ్గడం, గుండె సంబంధ వ్యాధులు రావడం వంటివి జరుగుతాయి. విటమిన్ డి తగినంత అందకపోతే శరీరం కాల్షియాన్ని కూడా సరిగా గ్రహించలేదు. 

నిత్యం అలసట, తరచూ ఒళ్లు నొప్పులు, కండరాల నొప్పులు, మెట్లు ఎక్కలేకపోవడం, కింద కూర్చుని లేవలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయంటే విటమిన్ డి లోపమేమో చెక్ చేసుకోవాలి. 

సూర్య కాంతిలో నిల్చోవడమే కాదు, ఆహారంలో పాలకూర, సోయా బీన్స్, సాల్మన్, సార్టయిన్, గుడ్డులోని పచ్చసొన, పాలు, బెండకాయ వంటివి తింటూ ఉండాలి.  

Also read: ఆరు నెలలకోసారైనా ఈ టెస్టు చేయించుకుంటే మంచిది, డయాబెటిస్ రాకను ముందే కనిపెట్టవచ్చు

Also read: ఇంగువ మన దేశంలో ఇంతవరకు పండించలేదు, మరెలా మన వంటల్లో భాగమైంది?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ

వీడియోలు

టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Bhartha Mahasayulaku Wignyapthi Teaser : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
Nara Lokesh: నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
Trump: గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
Bangladesh Protest:బంగ్లాదేశ్‌లో ఘర్షణలతో భారత్‌ అలర్ట్‌! సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
బంగ్లాదేశ్‌లో ఘర్షణలతో భారత్‌ అలర్ట్‌! సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
Embed widget