అన్వేషించండి

పెళ్లి కాకపోయినా పర్వాలేదు, పిల్లలను కనండి - పాలకులు షాకింగ్ నిర్ణయం, ఎక్కడో తెలుసా?

పెళ్లి చేసుకుని పిల్లలను కనండని చెప్పడం ఒకప్పటి మాట. అయితే, ఆ దేశంలోని స్థానిక పాలకులు పెళ్లితో పనిలేకుండానే పిల్లలను కని, వారి పేర్లను నమోదు చేసుకోండని చెబుతున్నారు.

పెళ్లి కాకుండా పిల్లలను కనడాన్ని చాలా పెద్ద నేరంగా చూస్తారు. దాదాపు అన్ని దేశాల్లో ఇది అమోదయోగ్యం కాదు. కొన్ని పాశ్చాత్య దేశాల్లో మాత్రం సహజీవనం చేస్తూనే పిల్లలను కనేందుకు అనుమతి ఉంటుంది. కానీ, కొన్ని దేశాలు మాత్రం ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తాయి. ఎందుకంటే.. పెళ్లి చేసుకోకుండా పిల్లలను కనే జంట వారిపట్ల బాధ్యతాయుతంగా ఉండరని, వారి మధ్య సంబంధాలు తెగినట్లయితే ఆ పిల్లలు అనాథలవుతారని.. లేదా, ఆ ఇద్దరిలో ఒకరికి పిల్లలు భారం కావచ్చనే ఆందోళన కూడా ఉంది. అందుకే, చైనాలో పెళ్లి చేసుకోకుండా పిల్లలను కనకూడదనే చట్టం ఉంది. ఒక వేళ పెళ్లి కాకుండా పిల్లలను కన్నట్లయితే.. వారి పేర్లపై ప్రభుత్వం బర్త్ సర్టిఫికెట్లను కూడా జారీ చేయదు. పిల్లలను కన్న తర్వాత ఆ జంట పెళ్లి చేసుకుంటేనే అర్హులవుతారు. ఈ నేపథ్యంలో చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌ పాలకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పెళ్లికాకుండా పిల్లలను కనేవారిపై ఉన్న నిషేదాన్ని ఎత్తివేసింది. ఇకపై పెళ్లికాని జంటలు తమ పిల్లల వివరాలను ప్రభుత్వ పథకాలు, సర్టిఫికెట్ల కోసం నమోదు చేసుకోవచ్చని ప్రకటించింది.

చైనాలో సంతానోత్పత్తి రేటు పడిపోవడం వల్ల అధికారులు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే పిల్లల పుట్టుకను నమోదు చేసుకోవడానికి జంటలు వివాహం చేసుకోవాలనే చట్టాన్ని తొలగించినట్లు ఓ స్థానిక మీడియా ప్రకటించింది. సిచువాన్ ప్రావిన్స్‌లోని హెల్త్ కమిషన్ ఫిబ్రవరి 15 నుంచి పిల్లల జనన నమోదు ప్రక్రియను సులభతరం చేస్తున్నట్లు వెల్లడించింది. పెళ్లి కాకుండా పిల్లలకు జన్మనిచ్చిన జంటలు ఇకపై వారి జననాలను నమోదు చేయాలని పేర్కొంది. 

చైనా చరిత్రలో గత 60 ఏళ్లలో ఎన్నడూ లేనంత స్థాయిలో చైనాలో జనాభా పడిపోయింది. 2022లో చైనాలో 9.56 మిలియన్ల మంది జన్మించారని, మరణాల సంఖ్య 10.41 మిలియన్ల కంటే ఎక్కువగా ఉందని ఆ దేశ ప్రభుత్వం జనవరి 17న వెల్లడించింది. గత ఆరేళ్ల నుంచి చైనాలో జనన శాతం తగ్గపోతునట్లు వెల్లడించింది. ఈ రిపోర్టులు వచ్చిన వారం వ్యవధిలోనే సిచువాన్ ప్రావిన్స్‌ పాలకులు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అయితే, ఈ నష్టాన్ని ముందే అంచనా వేసి చైనా.. ఒక జంట కేవలం ఒక బిడ్డను మాత్రమే కనాలనే రూల్‌ను కూడా ఎత్తేసింది. 2021 నుంచి ప్రతి జంట కనీసం ఇద్దరు పిల్లలను కనాలనే పాలసీని ప్రకటించింది. అయితే, చైనా ప్రజలు మాత్రం ఒక బిడ్డతో సరిపెట్టుకోవడానికే ఆసక్తి చూపిస్తున్నారు. ఆర్థిక సమస్యల వల్ల ఇద్దరు పిల్లలను పోషించడం కష్టమని.. ఒక్కరే ముద్దని చెబుతున్నారు. 
 
అయితే, సిచువాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. స్థానిక పాలకులు తీసుకున్న ఈ నిర్ణయం వివాహేతర సంబంధాలను ప్రోత్సహించేలా ఉందని, పెళ్లి అవసరం లేకుండా పిల్లలను కనమని చెప్పేలా ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. దానికి బదులుగా సింగిల్ ఫాదర్ లేదా సింగిల్ మదర్స్‌కు సాయం చేసే పథకాలను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ నిబంధన సిచువాన్ ప్రాంతానికే పరిమితం. చైనాలోని మిగతా ప్రాంతాల్లో పాత విధానాలే అమల్లో ఉన్నాయి. అక్కడి మహిళా ఉద్యోగులు ప్రసూతి సెలవులు తీసుకోవాలంటే తప్పకుండా మ్యారేజ్ సర్టిఫికెట్‌ను చూపించాల్సిందే. పెళ్లికాకుండా గర్భం దాల్చే మహిళలకు ఆ సదుపాయం కల్పించడం లేదు.  

Also read: గీజర్‌లో ఉండే గ్యాస్ లీక్ అయితే ఎంత ప్రమాదమో తెలుసా? ఈ జాగ్రత్తలు తీసుకోండి

 
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
Gudivada News: బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Andhra Pradesh: ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
Weather Latest Update: ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
Embed widget