అన్వేషించండి

Patanjali’s Wellness Treatments : పతంజలి వెల్నెస్ కార్యక్రమాలతో క్యాన్సర్, కిడ్నీ ఫెయిల్యూర్, డయాబెటిస్ వ్యాధులకు చెక్ పెట్చొచ్చా?

Patanjali : పతంజలి వెల్నెస్ సెంటర్​లో యోగ-ఆయుర్వేదంతో క్యాన్సర్, డయాబెటిస్ వంటి వాటికి చికిత్స చేస్తున్నారు. వాటివల్ల రోగులు పొందుతున్న ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూసేద్దాం.

Patanjali’s Wellness Centre : మందులు, చికిత్సల ద్వారా నయం చేయలేని ఎన్నో వ్యాధులకు బాధపడుతున్న రోగులకు యోగా, ఆయుర్వేదం, ప్రకృతి వైద్యంతో కొత్త జీవితం లభిస్తోందని పతంజజలి పేర్కొంది. హరిద్వార్‌లోని వెల్నెస్ సెంటర్‌ ద్వారా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పురుషులు, మహిళా రోగులకు పురాతన వైద్య విధానం అందిస్తూ.. మంచి ఫతితాలు అందుకుంటున్నట్లు పతంజలి చెప్తోంది. ఇది ఎంతవరకు నిజం? ప్రకృతి వైద్యంతో నిజంగానే మధుమేహం, మోకాళ్ల నొప్పులు వంటి దీర్ఘకాలిక సమస్యలు తగ్గుతున్నాయా? ఈ వెల్నెస్ సెంటర్లో ఇచ్చే వైద్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

క్యాన్సర్, కిడ్నీ సమస్య నుంచి విముక్తి!?

ఉత్తరప్రదేశ్​లోని కాన్పూర్​కు చెందిన 63 ఏళ్ల రమా త్రివేది మాట్లాడుతూ.. "5 సంవత్సరాల క్రితం నాకు క్యాన్సర్ వచ్చింది. దీనికి అల్లోపతిలో చికిత్స లేదు. కానీ పతంజలి వెల్నెస్​లో ఆయుర్వేద చికిత్స, యోగా, ప్రాణాయామం ద్వారా ఈ వ్యాధిని అదుపులోకి తెచ్చాను. క్యాన్సర్ నయమైంది." అని తెలిపారు. అలాగే "క్యాన్సర్ చికిత్స సమయంలో నా కిడ్నీలో సమస్యలు తలెత్తాయి. దీని కోసం నేను 5 సార్లు డయాలసిస్ చేయించుకోవాల్సి వచ్చింది. కిడ్నీ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి, నేను ఇప్పుడు మళ్లీ పతంజలి వెల్నెస్​లో చికిత్స తీసుకుంటున్నాను. నేను త్వరలో కోలుకుంటానని నమ్ముతున్నాను." అని తెలిపారు.న

74 ఏళ్ల వృద్ధుడికి కొత్త జీవితం - పతంజలి

"రాజస్థాన్లోని భరత్‌పూర్​కి చెందిన 74 ఏళ్ల వేద్ ప్రకాష్​కు కిడ్నీ క్యాన్సర్ వచ్చింది. దీని కారణంగా అతని పొత్తికడుపు ఎడమ వైపున నొప్పి ఉండేది. పరీక్షలో అతని కిడ్నీలో 80% దెబ్బతిన్నట్లు తేలింది. అతను క్యాన్సర్ చివరి దశలో ఉన్నాడు. ఆ తర్వాత పతంజలి వెల్నెస్​లో జాయిన్ అయ్యాడు. ఇక్కడ యోగా, ఇతర మార్గాల ద్వారా చికిత్స అందించాము. ప్రతిరోజూ అతనిలో మెరుగుదల కనిపించింది. ఇప్పుడు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు." అంటూ పతంజలి తెలిపింది

మధుమేహం, మోకాళ్ల నొప్పులు మాయం

ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్రకు చెందిన 50 ఏళ్ల అజయ్ ద్వివేది మధుమేహం, మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందారని పతంజలి తెలిపింది. "అజయ్ ద్వివేది పతంజలి వెల్నెస్కు వచ్చినప్పుడు.. అతనిలో షుగర్ లెవెల్స్ 245 ఉంది. రక్తపోటు కూడా పెరిగింది. ఇక్కడి చికిత్స, ఆహారం, యోగా అతనిపై చాలా లోతైన ప్రభావాన్ని చూపించాయి. కొన్ని రోజుల్లోనే అతనిలో షుగర్ కంట్రోల్ అయింది. రక్తపోటు కూడా సాధారణ స్థితికి వచ్చింది." అని తెలిపారు.

ఇవి మాత్రమే కాదు. పతంజలి ద్వారా మోకాళ్ల నొప్పులు కూడా తగ్గాయని తెలిపింది. "హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రాకు చెందిన 70 ఏళ్ల సరళా దేవి బంగాలియాకు 30 సంవత్సరాలుగా మోకాళ్ల నొప్పులు ఉన్నాయి. వివిధ ప్రదేశాలలో చికిత్స చేయించుకున్నా, వైద్యులు మోకాళ్ళను మార్చమని సలహా ఇచ్చినప్పటికీ.. ఆమెకు ఎటువంటి ఉపశమనం లభించలేదు. 2022లో పతంజలి వెల్నెస్లో చికిత్స చేయించుకున్న తర్వాత ఆమెకు 75% ఉపశమనం లభించింది. వైద్యులు సూచించిన చికిత్సను పూర్తిగా పాటించింది. ఇప్పుడు పూర్తిగా ఆరోగ్యంగా ఉంది." అని తెలిపింది.

వ్యాధుల నుంచి విముక్తికి ఇచ్చే చికిత్సలు ఇవే

పతంజలి వెల్నెస్ కేంద్రాలలో రక్తపోటు, చక్కెర, క్యాన్సర్, ఆర్థరైటిస్, ఊబకాయం, కిడ్నీ, కాలేయ సమస్యలు వంటి నయం చేయలేని వ్యాధులకు యోగా, ఆయుర్వేదం, పంచకర్మ, నేచురోపతి, ఆక్యుప్రెషర్, ఆక్యుపంక్చర్ చికిత్స వంటి సమగ్ర ఆరోగ్య ప్యాకేజీని అందిస్తున్నట్లు తెలిపింది. సరైన పద్ధతిలో యోగా, ప్రాణాయామం, ఆహారం మరియు జీవనశైలిలో మార్పులపై దృష్టి పెడతమన్నది. అలాగే ఇక్కడి చికిత్స కేవలం వ్యాధి నివారణకు మాత్రమే కాదని.. ఇది జీవితంలో మార్పు తెచ్చే ప్రక్రియగా చెప్తోంది పతంజలి. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Bondi Beach Shooting: బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
Advertisement

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Bondi Beach Shooting: బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Embed widget