అన్వేషించండి

Life After Death : చనిపోయాక గుండె ఆగిపోయినా కూడా బ్రెయిన్ పని చేస్తుందా? కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు

Brain Activity Post-Death : మరణించిన తర్వాత ఓ వ్యక్తి ఎలా భావిస్తాడు? బ్రెయిన్ పనిచేస్తుందా? అనే విషయాలపై పరిశోధనలు చేశారు. ఈ స్టడీలో షాకింగ్ విషయాలు బయటకొచ్చాయి. అవేంటంటే.. 

Brain Work After Death : చనిపోయిన తర్వాత మనిషి ఎలా ఫీల్ అవుతాడు.. మరణం తర్వాత కూడా బ్రెయిన్ పని చేస్తుందా? అనే అంశాలపై కొత్త పరిశోధనలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఇవి కచ్చితంగా దిగ్భ్రాంతికి గురిచేస్తాయని అంటున్నారు పరిశోధకులు. న్యూయార్క్‌లోని NYU లాంగోన్ మెడికల్ సెంటర్‌కు చెందిన డాక్టర్ సామ్ పర్నియా.. మరణానంతరం మెదడు చురుగ్గా ఉంటుందా అనే దానిపై అధ్యయనం చేశారు. దీనిలో భాగంగా ఆయన బృందం US, UKలోని 25 ఆసుపత్రులలో గుండెపోటు నుంచి బయటపడిన 53 మందిని అధ్యయనం చేసింది.

మరణం ఎల్లప్పుడూ జీవితంలోని చివరి దశగా పరిగణిస్తారు. అయితే గుండె కొట్టుకోవడం ఆగిపోయిన తర్వాత.. ఒక వ్యక్తి స్పృహ ఆగిపోతుందని నమ్ముతారు. కానీ ఒక కొత్త శాస్త్రీయ అధ్యయనం దీనిని సవాలు చేసింది. గుండె ఆగిపోయిన తర్వాత కూడా మెదడు కొంతకాలం చురుకుగా పని చేస్తుందని.. అలాగే చనిపోయిన వ్యక్తి తన చుట్టూ ఉన్న సమాచారాన్ని గ్రహించగలడని పరిశోధన తెలిపింది. ఈ వాదన వినడానికి ఆశ్చర్యకరంగా మాత్రమే కాదు.. జీవితం, మరణం గురించి మన అవగాహనను పునరాలోచించుకునేలా చేస్తుంది.

కొత్త అధ్యయనం ఏం చెప్తోందంటే..

రీసస్సిటేషన్ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం గురించి ప్రచురించారు. గుండె కొట్టుకోవడం ఆగిపోయి క్లినికల్‌గా చనిపోయినట్లు ప్రకటించిన తర్వాత కొంతమందిలో CPR సమయంలో మెదడు కార్యకలాపాలు నమోదు అయ్యాయని నివేదిస్తుంది. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. కొన్ని సందర్భాల్లో గుండె ఆగిపోయిన 35 నుంచి 60 నిమిషాల తర్వాత EEGలు గామా, డెల్టా, తీటా, ఆల్ఫా, బీటా.. మెదడు తరంగాల సంకేతాలను చూపించాయి. ఇవి సాధారణంగా ఆలోచన, అవగాహనతో సంబంధం ఉన్న అదే తరంగాలట.

హార్ట్ పేషెంట్లపై చేసిన ఈ పరిశోధనలో చాలామంది రోగులు హార్ట్ కొట్టుకోవడం ఆగిపోయిన తర్వాత కూడా జ్ఞాపకాలు, అనుభవాలను అనుభవిస్తున్నట్లు వారు నివేదించారు. గుండె ఆగిపోయిన 10 నిమిషాల తర్వాత శాశ్వత మెదడు దెబ్బతింటుందని గతంలో నమ్మేవారు.. కానీ CPR సమయంలో కూడా మెదడు విద్యుత్ కోలుకునే సంకేతాలను చూపించగలదని పరిశోధనలో కనుగొన్నట్లు డాక్టర్ పర్నియా చెప్పారు.

40 శాతం మందికి అవగాహన ఉందట..

అధ్యయనంలో పాల్గొన్న వారిలో దాదాపు 40 శాతం మంది కొంత స్థాయి వరకు అవగాహనను కలిగి ఉన్నట్లు నివేదించారు. కొందరు తమ శరీరాల నుంచి వేరు అయినట్లు.. ఆసుపత్రి గదిలో కార్యకలాపాలను చూస్తున్నట్లు లేదా గ్రహించినట్లు అనుభూతి చెందారని వివరించారు. ఈ అనుభవాలు కలలు, భ్రాంతులు లేదా భ్రమల నుంచి భిన్నంగా ఉన్నాయని పరిశోధకులు అంటున్నారు.

దీనిని బట్టి చూస్తే చనిపోయిన తర్వాత కూడా మనిషికి తన చుట్టూ ఏమి జరుగుతుందో అని తెలుస్తుంది. ఇది ఓ రకంగా కాస్త భయానికి గురిచేసే విషయమే అయినా.. శాస్త్రీయంగా మరింత బలంగా చెప్పేందుకు ఇంకా పరిశోధనలు చేయాల్సి ఉంది.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Night Sweats : రాత్రుళ్లు చెమట వల్ల నిద్ర రావట్లేదా? కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
రాత్రుళ్లు చెమట వల్ల నిద్ర రావట్లేదా? కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
Piles Cases : ఐటీ ఉద్యోగుల్లో పెరుగుతోన్న పైల్స్ సమస్యలు.. కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
ఐటీ ఉద్యోగుల్లో పెరుగుతోన్న పైల్స్ సమస్యలు.. కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
Thyroid Weight Loss Tips : థైరాయిడ్ ఉంటే బరువు తగ్గడం కష్టమా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
థైరాయిడ్ ఉంటే బరువు తగ్గడం కష్టమా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
Joining in Hostel : మీ పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేసే ముందు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే
మీ పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేసే ముందు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే
Advertisement

వీడియోలు

Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget