అన్వేషించండి

Budget Travel in India : 10,000 బడ్జెట్‌లో ఇండియాలో టాప్ టూరిస్ట్ ప్లేస్‌లు.. తక్కువ ఖర్చుతో చూసేయండి

Affordable Travel in India : ఇండియాలో 10వేలలోపు వెళ్లగలిగే బెస్ట్ డెస్టినేషన్స్ కొన్ని ఉన్నాయి. తక్కువ ఖర్చుతో చూడగలిగే ప్రదేశాలు ఏంటి? ఎలా ప్లాన్ చేసుకుంటే తక్కువ ఖర్చు చేయవచ్చో చూసేద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • తక్కువ బడ్జెట్లో భారతదేశంలో ప్రయాణానికి జైపూర్, పాండిచ్చేరి ఆకర్షణీయమైనవి.
  • హంపి, చిరపుంజి సహజ సౌందర్యంతో బడ్జెట్ ఫ్రెండ్లీ అనుభూతిని అందిస్తాయి.
  • మనాలి కొండ ప్రాంతాల్లో తక్కువ ఖర్చుతో పర్యాటకులను ఆకట్టుకుంటుంది.

Best Destinations in India : భారతదేశంలో ప్రయాణించడానికి ఎక్కువ డబ్బులు అవసరం లేదు. తెలివిగా ప్లాన్ చేస్తే చాలు. దేశంలోని అత్యంత పేరుపొందిన గమ్యస్థానాలను 10,000 బడ్జెట్‌లో సౌకర్యవంతంగా చూసేయవచ్చు. రాజ నగరాలు, తీరప్రాంతాల నుంచి వారసత్వ శిధిలాలు, పర్వతాలకు వెళ్లడం వరకు బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రావెల్ చేయవచ్చు. ఎక్కువ ఖర్చు చేయనవసరంలేని ప్రయాణం కోసం ఇండియాలో ఏయే ప్రదేశాలకు వెళ్లొచ్చో చూసేద్దాం.

జైపూర్

(చిత్రం సోర్స్: Twitter/@INDHKY)
(చిత్రం సోర్స్: Twitter/@INDHKY)

జైపూర్ మీకు సినిమాటిక్ ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది. బడ్జెట్ ప్రయాణికులకు సరైన ఎంపిక. రోజువారీ ఖర్చులు సగటున 1,200 నుంచి 1,500 మధ్య ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు లేకుండా చరిత్ర, సంస్కృతి , ఆహారాన్ని ఆస్వాదించడానికి పింక్ సిటీకి వెళ్లవచ్చు. ఇక్కడ హాస్టల్స్ రాత్రికి 400 నుంచి ప్రారంభమవుతాయి. బడ్జెట్ హోటల్స్ 700 నుంచి 1,200 మధ్య ఉంటాయి. కచోరీలు, మిర్చి వడలు, లస్సీ వంటి స్థానిక వంటకాలు 100 లోపు లభిస్తాయి. ఆటో-రిక్షాలు, స్థానిక బస్సులు, నడవడానికి వీలున్న ప్రదేశాలు ఎంచుకోవచ్చు.

పాండిచ్చేరి

(చిత్రం సోర్స్: Twitter/@gostopsofficial)
(చిత్రం సోర్స్: Twitter/@gostopsofficial)

కరెక్ట్​గా ప్లాన్ చేస్తే బడ్జెట్‌లో వెళ్లేందుకు పాండిచ్చేరి అనువైనది. బస్సులు లేదా రైళ్ల వంటి ఆర్థిక రవాణా ఎంపికలను ఎంచుకోవాలి. అలాగే ముందుగానే బుక్ చేసుకోవడం వల్ల ఖర్చులు తగ్గుతాయి. వైట్ టౌన్, అరబిందో ఆశ్రమం చుట్టూ డార్మ్ బెడ్‌లు 400 నుంచి 600 మధ్య అందుబాటులో ఉంటాయి. ప్రైవేట్ రూమ్‌లు 900 నుంచి 1,500 వరకు ఉంటాయి. నడవడం లేదా సైకిల్ లేదా ద్విచక్ర వాహనాన్ని అద్దెకు తీసుకుంటే ట్రావెల్ ఖర్చులు తగ్గుతాయి. ఇది మొత్తం అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. స్థానిక రెస్టారెంట్లు, బేకరీలు, కేఫ్‌ల్లో తింటే రోజుకు 300 నుంచి 500 లోపు రుచికరమైన భోజనం పొందవచ్చు. రాక్ బీచ్‌లో సూర్యోదయం, ప్రొమెనేడ్‌లో నడక, ఫ్రెంచ్ క్వార్టర్‌ను చూడటం మాత్రం మరచిపోవద్దు.

హంపి

(చిత్రం సోర్స్: Twitter/@RHolidays2275)
(చిత్రం సోర్స్: Twitter/@RHolidays2275)

అధిక ఖర్చులు లేకుండా మంచి ప్రయాణ అనుభవాన్ని పొందాలంటే హంపి వెళ్లొచ్చు. బడ్జెట్ ప్రయాణికులు హంపి బజార్, సమీప గ్రామాల చుట్టూ ఉన్న గెస్ట్‌హౌస్‌లలో రాత్రికి 600 నుంచి 1,000 వరకు వసతిని పొందవచ్చు. హంపిని ప్రత్యేకంగా ఆకర్షణీయంగా మార్చేది ఏమిటంటే దాని వేగం. రద్దీగా ఉండే పర్యాటక కేంద్రాల మాదిరిగా కాకుండా.. ఇది మిమ్మల్ని నెమ్మదిగా అన్వేషించడానికి ఆహ్వానిస్తుంది. అరటి తోటల్లో సైకిల్ తొక్కడం, సూర్యాస్తమయ దృశ్యాల కోసం కొండలను ఎక్కడం లేదా తుంగభద్ర నది ఒడ్డున కూర్చోవడం వంటివి బెస్ట్ ఎక్స్​పీరియన్స్ ఇస్తాయి. ఈ అనుభవాలలో చాలా వరకు ఉచితంగా పొందవచ్చు. మొత్తం ఖర్చు రోజుకు 800 నుంచి 1,500 మధ్య ఉంటుంది. విరూపాక్ష దేవాలయం నుంచి విట్టల దేవాలయం వరకు, ఆర్థిక ఒత్తిడి లేకుండా సాంస్కృతిక లోతును అందిస్తుంది. 

చిరపుంజి

(చిత్రం సోర్స్: Twitter/@thepainterflynn)
(చిత్రం సోర్స్: Twitter/@thepainterflynn)

చిరపుండి అద్భుతమైన సహజ సౌందర్యంతో పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఇక్కడ జలపాతాలు, గుహలు, పచ్చని ప్రకృతి బడ్జెట్ ఫ్రెండ్లీ అనుభవాన్ని ఇస్తాయి. ఇక్కడ మూడు రోజుల పర్యటనను జాగ్రత్తగా ప్లాన్ చేస్తే 7,000 నుంచి 9,000 వరకు సౌకర్యవంతంగా సరిపోతుంది. హోమ్‌స్టేలు, గెస్ట్‌హౌస్‌లలో వసతి రాత్రికి 1,200 నుంచి 2,000 మధ్య ఉంటుంది. ఇది సౌకర్యం, స్థానిక ఆతిథ్యాన్ని అందిస్తుంది. షేర్డ్ టాక్సీలు, స్థానిక బస్సులను ఎంచుకోవడం ద్వారా రవాణా ఖర్చులను తగ్గించవచ్చు. స్థానిక రెస్టారెంట్లలో ఫుడ్స్ ట్రై చేయవచ్చు.

మనాలి

(చిత్రం సోర్స్: Twitter/@nagarkoti)
(చిత్రం సోర్స్: Twitter/@nagarkoti)

మనాలి భారతదేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన కొండ గమ్యస్థానాలలో ఒకటి. సరైన విధానంతో ప్లాన్ చేస్తే ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. ఢిల్లీ నుంచి రాత్రి బస్సులో ప్రయాణిస్తే ట్రావెల్ ఖర్చులు తగ్గించుకోవచ్చు. అలాగే రాత్రి వసతిని కూడా ఆదా చేసుకోవచ్చు. ఇది బడ్జెట్ ప్రయాణికులకు తెలివైన ఎంపిక. హాస్టల్స్, హోమ్‌స్టేలు వంటి బస ఎంపికలు తక్కువ ధరలో అందుబాటులో ఉంటాయి.1,500 నుంచి 2,000 మధ్య సౌకర్యవంతమైన గదులను తీసుకోవచ్చు. స్థానిక కేఫ్‌లు, ధాబాలను ఎంచుకోవడం ద్వారా ఆహార ఖర్చులు తగ్గుతాయి. ఓల్డ్ మనాలిని అన్వేషించడం, హిడింబా ఆలయాన్ని సందర్శించడం, బియాస్ నది ఒడ్డున విశ్రాంతి తీసుకోవడం లేదా పైన్ అడవుల గుండా నడవడం చాలా తక్కువ ఖర్చుతో కూడుకుని ఉంటాయి. సోలాంగ్ వ్యాలీకి వెళ్లే ప్రయాణాలను కూడా షేరింగ్ ట్రావెల్ చేస్తే ఆర్థికంగా మరింత బెనిఫిట్స్ పొందవచ్చు. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

AI Intimacy Survey: లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
Easy Breakfast Recipes: సింపుల్‌గా పది నిమిషాల్లో బ్యాచిలర్స్‌ చేసుకునే టిఫిన్స్‌ రెసిపీ లిస్ట్ ఇదే!
సింపుల్‌గా పది నిమిషాల్లో బ్యాచిలర్స్‌ చేసుకునే టిఫిన్స్‌ రెసిపీ లిస్ట్ ఇదే!
Indoor Pure Air Tips: ఇంట్లో గాలి ఫ్రెష్‌గా మార్చేసే మొక్కలు ఇవే! 5 ఇండోర్ ప్లాంట్స్‌తో అందం ఆక్సిజన్!
ఇంట్లో గాలి ఫ్రెష్‌గా మార్చేసే మొక్కలు ఇవే! 5 ఇండోర్ ప్లాంట్స్‌తో అందం ఆక్సిజన్!
Roti Pizza Recipe: మిగిలిపోయిన రొట్టెను పారేయొద్దు! 5 నిమిషాల్లో పిజ్జాను తయారు చేసుకోవచ్చు! 
మిగిలిపోయిన రొట్టెను పారేయొద్దు! 5 నిమిషాల్లో పిజ్జాను తయారు చేసుకోవచ్చు! 

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Embed widget