అన్వేషించండి

Patanjali's Cardogrit Gold : పతంజలి మెడిసన్​తో గుండె జబ్బులు నయం!? ఆయుర్వేద చికిత్సపై తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

Cardiogrit Gold : పతంజలి పరిశోధన ప్రకారం కార్డియోగ్రిట్ గోల్డ్ అనే ఆయుర్వేద మందు గుండె జబ్బును నయం చేస్తుందని గుర్తించారు. దీనిపై అంతర్జాతీయ పరిశోధనా పత్రిక జర్నల్ ఏమందంటే..

Patanjali Medicine for Heart Disease : పతంజలి ఆయుర్వేదం, ఆధునిక విజ్ఞాన శాస్త్రాల కలయికతో.. తీవ్రమైన వ్యాధులను కూడా నయం చేయవచ్చని నిరూపించింది తాజా అధ్యయనం. క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే డోక్సోరుబిసిన్ అనే కీమోథెరపీ ఔషధం వల్ల వచ్చే గుండె జబ్బులను (కార్డియోటాక్సిసిటీ).. ఆయుర్వేద ఔషధమైన కార్డియోగ్రిట్ గోల్డ్‌తో నయం చేయవచ్చని తెలిపింది. ఈ పరిశోధన ప్రపంచానికి ఆయుర్వేద బలాన్ని మరోసారి నిరూపించింది.

అధ్యయన ఫలితాలు

కిమోథెరపీ ఔషదాల వల్ల వచ్చే గుండె సమస్యలను నయం చేసేందుకు అభివృద్ధి చేసిన హెర్బో మినరల్ డ్రగ్ కార్డియోగ్రిట్ గోల్డ్​పై పతంజలి శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. ఈ ఆయుర్వేద మందును శాస్త్రీయంగా పరీక్షించి.. ఇది కీమోథెరపీ వల్ల వచ్చే గుండె జబ్బులను దూరం చేస్తుందని నిర్ధారించారు. ఈ పరిశోధనలో కార్డియోగ్రిట్ గోల్డ్ తీసుకున్న తర్వాత గుండె పనిచేసే కండరాల పరిస్థితి మెరుగుపడిందని.. శరీరంలోని హానికరమైన మూలకాల స్థాయిలను (ROS) తగ్గించినట్లు గుర్తించారు.

జర్నల్ ఆఫ్ టాక్సికాలజీలో

ఈ అధ్యయనం సి.ఎలిగాన్స్ పద్ధతిలో చేసినట్లు పతంజలి శాస్త్రవేత్తలు తెలిపారు. కార్డియోగ్రిట్ గోల్డ్ తీసుకున్న తర్వాత ఎలిగాన్స్ అనే సూక్ష్మజీవులలో సానుకూల మార్పులు గుర్తించారు. ఇవి శరీరంలో డోక్సోరోబిసిన్ స్థాయిలు తగ్గించాయని వైద్యులు తెలిపారు. దీనికి సంబంధించిన ఫలితాలను ప్రపంచ ప్రఖ్యాత పరిశోధనా పత్రిక జర్నల్ ఆఫ్ టాక్సికాలజీలో ప్రచురించడంతో అందరి దృష్టి దీనిపై పడింది.

పతంజలి కృషికి ఫలితం

పతంజలి కార్డియోగ్రిట్ గోల్డ్‌లో యోగేంద్ర రాస్, అర్జున్, మోతీ పిష్టి, అకీక్ పిష్టి వంటి మూలికలు, భస్మాలు వినియోగించామని.. ఇవి పురాతన ఆయుర్వేద గ్రంథాలలో గుండె జబ్బులకు ప్రభావవంతంగా పనిచేశాయని పతంజలి ఆయుర్వేద్ సీఈఓ ఆచార్య బాలకృష్ణ తెలిపారు. "ఈ పరిశోధన ఆయుర్వేదంలోని శాస్త్రీయ స్వభావాన్ని మాత్రమే కాకుండా.. పురాతన వైద్య విధానాలను శాస్త్రీయంగా పరీక్షించింది. ఆధునిక వైద్యంలోని సంక్లిష్ట సమస్యలకు పరిష్కారాలు ఆయుర్వేదంలో కనుగొనవచ్చని నిరూపించింది" అని వెల్లడించారు.

"ఈ పరిశోధన పతంజలి శాస్త్రవేత్తల కృషికి ఫలితం. ఆయుర్వేదాన్ని పునరుద్ధరించడానికి మేము వేసిన పెద్ద ముందడుగు ఇది. దీనివల్ల ప్రపంచమంతా ఆయుర్వేదాన్ని స్వీకరించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఈ పరిశోధనను ప్రజలు నమ్మడానికి బలాన్ని చేకూరుస్తుంది. ఇది సంప్రదాయం, విజ్ఞాన శాస్త్రం కలయిక. మనకి దొరికిన అమూల్యమైన బహుమతి." అని హర్షం వ్యక్తం చేశారు. 

ఈ అధ్యయనం ఆయుర్వేద మెడిసన్​పై ప్రజల నమ్మకాన్ని మరింత రెట్టింపు చేస్తుందని పతంజలి శాస్త్రవేత్తలు తెలిపారు. ఆధునికమైన పద్ధతిలో కూడా ఇది మంచి ఫలితాలు ఇవ్వడంతో దీనిపై అందరి దృష్టి పడింది. 

Also Read : రేబిస్ మరణాలకు ఇక చెక్.. చికిత్సపై ఆశలు పెంచుతోన్న కొత్త అధ్యయం

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Embed widget