అన్వేషించండి

Amarnath Yatra 2025 : అమర్​నాథ్ యాత్ర ప్రారంభ తేదీ, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇదే.. ఆ సర్టిఫికెట్ లేకుంటే యాత్రకు అనుమతి ఉండదట, డిటైల్స్ ఇవే

Amarnath Yatra 2025 : అమర్​నాథ్​ యాత్రకు వెళ్లాలనుకుంటున్నారా? అయితే దానికోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైపోయింది. మరి ఆన్​లైన్​ ప్రాసెస్​ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం.

Amarnath Yatra 2025 Registration Process : అమర్​నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ 2025 ప్రారంభమైపోయింది. ఏప్రిల్ 14వ తేది నుంచి ఈ స్లాట్స్ ఆన్​లైన్​లో అందుబాటులో ఉన్నాయి. అయితే మీరు అమర్​నాథ్​కి వెళ్లి స్వయంభూని దర్శించుకోవాలనుకుంటే.. ఈ యాత్ర కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంతకీ అమర్​నాథ్​ యాత్ర కోసం రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి? ఏ ప్రక్రియను ఫాలో అవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

వేసవికాలంలో అమర్​నాథ్ యాత్ర జరుగుతుంది. ఈ తీర్థయాత్రను మతపరంగా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు భక్తులు. ప్రతి సంవత్సరం ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు ప్రారంభించి.. యాత్రకు వెసులుబాటు కల్పిస్తుంది. లక్షల్లో భక్తులు పాల్గొంటారు. దీనిలో భాగంగానే 2025కు గానూ.. ఏప్రిల్ 14వ తేదీ నుంచి అమర్‌నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. దానికి సంబంధించిన పూర్తి ప్రక్రియను, ఎలా దరఖాస్తు చేయాలో చూసేద్దాం. 

అమర్​నాథ్ యాత్ర ఆన్​లైన్ రిజిస్ట్రేషన్

అమర్​నాథ్ యాత్రకు ఆన్​లైన్​, ఆఫ్​లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమైపోయాయి. అమర్​నాథ్​ యాత్ర 2025లో జూన్ 29 నుంచి ఆగస్టు 19వ తేదీవరకు కొనసాగనుంది. మీరు ఇక్కడికి వెళ్లాలనుకుంటే.. అమర్​నాథ్​ యాత్రకు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్ www.jksasb.nic.in ని సందర్శించాలి. సైట్​లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ ఫామ్ నింపాల్సి ఉంటుంది. 

ధర ఎంతంటే.. 

ఆధార్, ఓటర్​ ఐడీలు లేదా పాస్​పోర్ట్​లును ప్రూఫ్​గా సబ్​మీట్ చేయవచ్చు. ఏ ప్రూఫ్ ఇచ్చిన పాస్​పోర్ట్ సైజ్​ ఫోటోతో కూడిన ఐడీనే ఇవ్వాలి. అలాగే మెడికల్ ఫిట్​నెస్ సర్టిఫికెట్ కూడా తీసుకోవాలి. అయితే బయట తీసుకునేది కాకుండా పుణ్యక్షేత్ర బోర్డు ఆమోదించిన వైద్యుడి నుంచి మాత్రమే వైద్య ధృవీకరణ పత్రం తీసుకోవాలి. ఇవి కాకుండా రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 150 డిపాజిట్ చేయాలి. సమయాన్ని బట్టి ఈ రిజిస్ట్రేషన్ ఫీజులలో మార్పులు ఉండొచ్చు. ఫారమ్​ నింపిన తర్వాత మీ జర్నీకోసం అనుమతి పత్రం లభిస్తుంది. మీరు దానిని ప్రింట్ తీసుకుని జర్నీ సమయంలో మీ దగ్గర ఉంచుకోవాలి. 

అమర్​నాథ్ యాత్ర ఆఫ్​లైన్ రిజిస్ట్రేషన్.. 

మీరు ఆన్​లైన్​ కాకుండా ఆఫ్​లైన్​లో అమర్​నాథ్ యాత్రకు రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే.. మీరు బ్యాంకు నుంచి ట్రావెల్ ఫారమ్ తీసుకోవాలి. పంజాబ్ నేషనల్ బ్యాంక్, జమ్మూ కాశ్మీర్ బ్యాంక్, యస్​ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్​లలో దీనిని సులభంగా పొందవచ్చు. అక్కడ మీరు మెడికల్ రిపోర్ట్​ని చూపించి.. వారు ఇచ్చే ఫారమ్​ని నింపి ప్రయాణానికి అనుమతి తీసుకోవచ్చు. 

మెడికల్ రిపోర్ట్.. 

మెడికల్ రిపోర్ట్ లేకుండా మీరు అమర్​నాథ్ యాత్ర చేసేందుకు అనుమతి లభించదు. అలా అని మీరు మీ వైద్యుల నుంచి ఈ సర్టిఫికెట్ తెస్తే కుదరదు. SASB వెబ్‌సైట్‌లో ఏ ఆస్పత్రిలో ఏ వైద్యుల దగ్గర నుంచి మెడికల్ సర్టిఫికెట్ తీసుకోవాలో లిస్ట్ ఉంటుంది. 

మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఫిట్​గా ఉంటే వెంటనే అమర్​నాథ్ యాత్రకోసం రిజిస్టర్​ చేయించుకోండి. శివుని దర్శనం చేసేసుకోండి. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

AI Intimacy Survey: లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
Easy Breakfast Recipes: సింపుల్‌గా పది నిమిషాల్లో బ్యాచిలర్స్‌ చేసుకునే టిఫిన్స్‌ రెసిపీ లిస్ట్ ఇదే!
సింపుల్‌గా పది నిమిషాల్లో బ్యాచిలర్స్‌ చేసుకునే టిఫిన్స్‌ రెసిపీ లిస్ట్ ఇదే!
Indoor Pure Air Tips: ఇంట్లో గాలి ఫ్రెష్‌గా మార్చేసే మొక్కలు ఇవే! 5 ఇండోర్ ప్లాంట్స్‌తో అందం ఆక్సిజన్!
ఇంట్లో గాలి ఫ్రెష్‌గా మార్చేసే మొక్కలు ఇవే! 5 ఇండోర్ ప్లాంట్స్‌తో అందం ఆక్సిజన్!
Roti Pizza Recipe: మిగిలిపోయిన రొట్టెను పారేయొద్దు! 5 నిమిషాల్లో పిజ్జాను తయారు చేసుకోవచ్చు! 
మిగిలిపోయిన రొట్టెను పారేయొద్దు! 5 నిమిషాల్లో పిజ్జాను తయారు చేసుకోవచ్చు! 

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Embed widget