అన్వేషించండి

Kedarnath Yatra 2025 : కేదార్​నాథ్ యాత్ర 2025 ప్రారంభ తేది ఇదే.. యాత్ర​ ప్రాముఖ్యత, ఇంట్రెస్టింగ్ విషయాలు ఇవే

Kedarnath Yatra : చార్​ధామ్ తీర్థయాత్ర ప్రదేశాలలో కేదార్​నాథ్ ఒకటి. ఈ ఏడాది మీరు కూడా ఇక్కడికి వెళ్లాలనుకుంటున్నారా? అయితే కేదార్​నాథ్ యాత్ర గురించి తెలుసుకోవాల్సిన అంశాలు ఇవే.

Kedarnath Yatra 2025 Date : పన్నెండు జ్యోతిర్లింగాల్లో కేదార్​నాథ్ (Kedarnath Temple) ఒకటి. శివుని అత్యంత పవిత్రమైన జ్యోతిర్లింగాలలో ఇది కూడా ఒకటి కావడంతో భక్తులు దీనిని చూసేందుకు వెళ్తూ ఉంటారు. ఉత్తరాఖండ్​లోని రుద్రప్రయాగ జిల్లాలో ఈ జ్యోతిర్లింగం ఉంది. అయితే దీనిని రెగ్యులర్​గా వెళ్లేందుకు వీలు ఉండదు. శీతాకాలం ప్రారంభమైతే దీనిని ఆరు నెలల పాటు మూసి ఉంచుతారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్లే అధికారులు ఈ నిర్ణయాన్ని తీసుకుంటారు. అయితే కేదార్​నాథుడి విగ్రహాలను ఓంకారేశ్వర్ ఆలయానికి తరలించి.. అక్కడ పూజలు చేస్తారు. గుడి తెరిచిన తర్వాత మళ్లీ కేదార్​నాథ్​కి తీసుకువస్తారు. 

కేదార్​నాథ్ యాత్ర ప్రారంభ తేదీ

కేదార్​నాథ్​కు 2025లో వెళ్లాలనుకుంటే దీనిని మళ్లీ ఎప్పుడు ఓపెన్ చేస్తారో అని ఆలోచిస్తున్నారా? ఈ తేదీ ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది. పరిస్థితులకు, వాతావరణానికి అనుగుణంగా చార్​ధామ్ దేవస్థానం నిర్వహణ బోర్డు అధికారిక ప్రకటన చేస్తుంది. దీనిలో భాగంగా 2025లో ఫిబ్రవరి 26వ తేదీన మహా శివరాత్రి సందర్భంగా కేదార్​నాథ్​ యాత్ర ప్రారంభం కానున్నుట్లు తెలిపింది. 

కేదార్​నాథ్​ యాత్రకు వెళ్లాలనుకుంటే..

కేదార్​నాథ్​ ఆలయానికి వెళ్లడానికి రోడ్డు మార్గం లేదు. గౌరీకుండ్ నుంచి ట్రెక్కింగ్ ద్వారా ఆలయాన్ని చేరుకోవాల్సి ఉంటుంది. ట్రెక్ ద్వారా చేరుకోలేనివారికి డోలీ సేవలు అందుబాటులో ఉంటాయి. చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానికి తగిన లగేజ్ ప్యాక్ చేసుకోవాలి. అలాగే కాళ్ల నొప్పులు ఉన్నవారు దానికి తగిన మెడిసిన్, వైద్యుల సూచనలతో ఈ యాత్రను ప్రారంభించవచ్చు. యాత్ర ప్రారంభించాలనుకుంటే ముందుగానే రిజిస్ట్రేషన్ (Kedarnath Yatra Registration) చేసుకుంటే మంచిది. ఆన్​లైన్, ఆఫ్​లైన్​లో కూడా ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. 

అంతకష్టపడి అక్కడకు వెళ్లడం అవసరమా అనుకునేవారికి తెలియాల్సింది ఏంటంటే.. హిందూ మతంలోని నాలుగు ముఖ్యమైన తీర్థయాత్రలలో కేదార్​నాథ్ యాత్ర ఒకటి. ఈ ఆలయాన్ని సందర్శించడం వల్ల భక్తులకు ఆధ్యాత్మిక విముక్తి లభిస్తుందని భావిస్తారు. అందుకే ఇక్కడికి ప్రతి ఏడాది భక్తులు అధిక సంఖ్యలో వెళ్తూ ఉంటారు. 

చార్ ధామ్ యాత్ర.. 

కేదార్​నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి పవిత్ర గమ్యస్థానాలను సమిష్టిగా కలిపి చార్​ ధామ్ యాత్ర (Char Dham Yatra) అని కూడా పిలుస్తారు. కేదార్‌నాథ్‌లో శివుడు, బద్రీనాథ్‌లో విష్ణువు, గంగోత్రిలో గంగాదేవి, యమునోత్రిలో యమునాదేవి ఉంటారు. ఇవన్నీ పవిత్ర గంగా నది ఒడ్డున ఉన్నాయి. అందుకే ఈ యాత్రకు భక్తులు అంతగా ఆసక్తి చూపిస్తారు. ఎక్కువమంది భక్తులు హరిద్వార్ నుంచి చార్​ ధామ్ యాత్ర ప్రారంభించి.. ఈ నాలుగు ప్రదేశాలను కవర్ చేసి తర్వాత అదే ప్రదేశంలో ప్రయాణాన్ని ముగిస్తారు. వివిధ ప్రాంతాల నుంచి వెళ్లేవారు వారికి అనుగుణంగా.. ట్రిప్​ ప్లాన్ చేసుకుంటారు. 

కేదార్​నాథ్ ధామ్ వల్ల కలిగే ఆధ్యాత్మిక ప్రయోజనాలివే (Spiritual Benefits of Kedarnath Yatra)

భక్తుల విశ్వాసం ప్రకారం.. జీవితంలో ఒక్కసారైనా కేదార్​నాథ్ తీర్థయాత్ర చేస్తే.. ఆ వ్యక్తి జనన పునర్జన్మ చక్రం నుంచి విముక్తి పొందుతాడని భావిస్తారు. జ్యోతిర్లింగాన్ని పూజించి.. ఆలయంలోని పవిత్ర జలాన్ని తాగితే జీవితకాలానికి సరిపడా ఆశీర్వాదం శివుని నుంచి దక్కుతుందని భావిస్తారు. అలాగే చిన్నవయసులో ఈ యాత్రకు వెళ్తే.. ఎక్కువ జ్ఞానం, పరిపక్వతతో తిరిగి వస్తారని.. ఇది వారి జీవితాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్లడంలో హెల్ప్ చేస్తుందని చెప్తారు. 

Also Read : జ్యోతిర్లింగాలను ఒకే ట్రిప్​లో ఎలా కవర్​ చేయొచ్చో తెలుసా? హైదరాబాద్​ నుంచి ఇలా స్టార్ట్ అయిపోండి

 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆమె, డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ (Dr. BRAOU) నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2018లో హైదరాబాద్‌లో ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ ఆమె మూడేళ్లు పనిచేశారు.

తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో ఒక సంవత్సరం పాటు పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశం లో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ అందిస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kokapet Lands Auction: మూడో వేలంలో రికార్డులు దాటని కోకాపేట ధరలు - కానీ తక్కువేం కాదు - ఇవిగో డీటైల్స్
మూడో వేలంలో రికార్డులు దాటని కోకాపేట ధరలు - కానీ తక్కువేం కాదు - ఇవిగో డీటైల్స్
Telangana Ponguleti: వట్టినాగులపల్లిలో పొంగులేటి కుమారుడి భూకబ్జా దౌర్జన్యం - బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు
వట్టినాగులపల్లిలో పొంగులేటి కుమారుడి భూకబ్జా దౌర్జన్యం - బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు
Sharmila criticized Pawan Kalyan: పవన్ కల్యాణ్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు -  ఆ మాటలు వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్
పవన్ కల్యాణ్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు - ఆ మాటలు వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్
India vs South Africa 2nd ODI: రాయ్‌పూర్‌లో శతక్కొట్టిన కోహ్లీ,రుతురాజ్- ఫస్ట్‌ ODI సెంచరీ చేసిన గైక్వాడ్
రాయ్‌పూర్‌లో శతక్కొట్టిన కోహ్లీ,రుతురాజ్- ఫస్ట్‌ ODI సెంచరీ చేసిన గైక్వాడ్
Advertisement

వీడియోలు

Pawan Kalyan Konaseema Controversy | కోనసీమ..కొబ్బరిచెట్టు...ఓ దిష్టి కథ | ABP Desam
SP Balasubrahmanyam Statue Controversy | బాలు విగ్రహం చుట్టూ పెద్ద వివాదం | ABP Desam
విరాట్ కోహ్లీ రాణిస్తే సిరీస్ మనదే..!
వద్దనుకున్నోళ్లే దిక్కయ్యారు.. రోహిత్, విరాట్ లేకపోతే సఫారీలతో ఓడిపోయేవాళ్లం: కైఫ్
2027 వన్డే వరల్డ్ కప్ టార్గెట్‌గా కంబ్యాక్‌కి కోహ్లీ రెడీ!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kokapet Lands Auction: మూడో వేలంలో రికార్డులు దాటని కోకాపేట ధరలు - కానీ తక్కువేం కాదు - ఇవిగో డీటైల్స్
మూడో వేలంలో రికార్డులు దాటని కోకాపేట ధరలు - కానీ తక్కువేం కాదు - ఇవిగో డీటైల్స్
Telangana Ponguleti: వట్టినాగులపల్లిలో పొంగులేటి కుమారుడి భూకబ్జా దౌర్జన్యం - బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు
వట్టినాగులపల్లిలో పొంగులేటి కుమారుడి భూకబ్జా దౌర్జన్యం - బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు
Sharmila criticized Pawan Kalyan: పవన్ కల్యాణ్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు -  ఆ మాటలు వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్
పవన్ కల్యాణ్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు - ఆ మాటలు వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్
India vs South Africa 2nd ODI: రాయ్‌పూర్‌లో శతక్కొట్టిన కోహ్లీ,రుతురాజ్- ఫస్ట్‌ ODI సెంచరీ చేసిన గైక్వాడ్
రాయ్‌పూర్‌లో శతక్కొట్టిన కోహ్లీ,రుతురాజ్- ఫస్ట్‌ ODI సెంచరీ చేసిన గైక్వాడ్
Prabhas Spirit Update: ఛాయ్ బిస్కెట్‌తో హీరోయిన్ తృప్తి హింట్... కోఠిలో ప్రభాస్ 'స్పిరిట్' షూటింగ్!
ఛాయ్ బిస్కెట్‌తో హీరోయిన్ తృప్తి హింట్... కోఠిలో ప్రభాస్ 'స్పిరిట్' షూటింగ్!
Amaravati Land Pooling: త్వరలో అమరావతిలో మూడో విడత భూ సమీకరణ - ఏపీ మంత్రి నారాయణ 
అమరావతిలో మూడో విడత భూ సమీకరణ - మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు
SP Balu Statue Controversy: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుపై వివాదమేంటి? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు
రవీంద్రభారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుపై వివాదమేంటి? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు
Modi AI video controversy:  మోదీ టీ అమ్ముతున్నట్లుగా కాంగ్రెస్ ఏఐ వీడియో -బీజేపీ తీవ్ర ఆగ్రహం
మోదీ టీ అమ్ముతున్నట్లుగా కాంగ్రెస్ ఏఐ వీడియో -బీజేపీ తీవ్ర ఆగ్రహం
Embed widget