అన్వేషించండి

Must Visit Temples in Amarnath : అమరనాథ్ యాత్రకు వెళ్తే ఈ 5 ఆలయాలు అస్సలు మిస్ అవ్వకండి.. ప్రాముఖ్యతలు ఇవే

Amarnath Yatra 2025 : అమర్నాథ్ యాత్రకు అస్సలు మిస్ అవ్వకుండా.. కచ్చితంగా దర్శించుకోవాల్సిన 5 దేవాలయాలు ఉన్నాయి. అవేంటో.. వాటి ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Temples Near Amarnath : అమర్‌నాథ్ యాత్ర భారతదేశంలో అత్యంత ఆధ్యాత్మికంగా ముఖ్యమైన యాత్రలలో ఒకటి. ప్రతి సంవత్సరం పవిత్రమైన అమర్‌నాథ్ గుహకు లక్షలాది మంది భక్తులు వెళ్తుంటారు. గుహలోని ఉన్న దేవాలయంలో మంచు శివలింగంపైనే అందరి దృష్టి ఉంటుంది. అమర్​నాథ్​ యాత్రలో దీనినే ముఖ్యంగా భావిస్తారు. అయితే అక్కడికి వెళ్లే మార్గంలో లేదా సమీపంలో ఉన్న ఆలయాల గురించి ఎక్కువమందికి తెలియదు. అయితే ఇక్కడి దేవాలయాలు ఎంతో అందంగా, ప్రశాంతతను అందిస్తాయి. మీరు ఈ సీజన్‌లో యాత్రకు వెళ్తుంటే.. దైవంతో లోతైన సంబంధాన్ని పెంచుకోవడం కోసం ఈ 5 ఆలయాలను సందర్శించేయండి.

మమలేశ్వర్ దేవాలయం, పహల్గామ్

(Image Source: Twitter/@searchkashmir)

(Image Source: Twitter/@searchkashmir)

మమలేశ్వర్ దేవాలయం పురాతన శివాలయం. ఇది పహల్గామ్‌లో ఉంది. దీనిని అమర్‌నాథ్ యాత్రకు ఆధారం అని పిలుస్తారు. శివునికి అంకితం చేయబడిన ఈ ఆలయంలో పార్వతీ దేవి తపస్సు చేసినట్లు నమ్ముతారు. శివుడు నందిని ఇక్కడ వదిలి అమర్‌నాథ్ గుహ వైపు వెళ్లాడని చెబుతారు. ఈ ఆలయంలో పవిత్రమైన కొలను, ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. యాత్ర ప్రారంభించే ముందు దీనిని సందర్శించవచ్చు.

మమలేశ్వర్' అనే పేరు పహల్గామ్ అసలు పేరు 'మమల్' నుంచి వచ్చింది. అమర్‌నాథ్ యాత్ర సమయంలో రక్షణ కోసం ప్రార్థిస్తూ భక్తులు తరచుగా ఇక్కడ దీపాలు వెలిగిస్తారు.

మార్తాండ్ సూర్య దేవాలయం, అనంతనాగ్

(Image Source: Twitter/@ketanvikamsey)

(Image Source: Twitter/@ketanvikamsey)

పహల్గామ్ నుంచి కొద్ది దూరంలో ఉన్న మార్తాండ్ సూర్య దేవాలయం ఒక అద్భుతమైన శిథిలం. ఇది 8వ శతాబ్దంలో లలితాదిత్య ముక్తపీడ రాజు నిర్మించాడు. అప్పటి నుంచి ఇప్పటికీ దైవిక శక్తి ఇక్కడ ప్రసరిస్తుందని నమ్ముతారు. సూర్య భగవానుడికి అంకితం చేసిన ఈ ఆలయం ఒక పీఠభూమిపై ఉంది. భక్తులు ఇక్కడ కాశ్మీర్ లోయ, అందమైన దృశ్యాలను ఆకట్టుకుంటాయి. గాంధార, గుప్త, కాశ్మీరీ శైలుల నిర్మాణం ఆకట్టుకుంటుంది. చరిత్ర, ఆధ్యాత్మికతను కోరుకునేవారు తప్పక చూడవలసిన ప్రదేశం. ప్రస్తుతం ఇది శిథిలావస్థలో ఉన్నప్పటికీ.. మార్తాండ్ సూర్య దేవాలయం ఈ ప్రాంతంలోని అత్యంత అద్భుతమైన పురావస్తు ప్రదేశాలలో ఒకటిగా పరిగణిస్తారు. 

అవంతిపుర శిథిలాలు, అవంతిపుర

(Image Source: Twitter/@bharatkemandir)
(Image Source: Twitter/@bharatkemandir)

అవంతిపుర దేవాలయాలను 9వ శతాబ్దంలో అవంతివర్మన్ రాజు నిర్మించాడు. శ్రీనగర్-పహల్గామ్ మార్గంలో ఉన్న ఈ పవిత్ర స్థలంలో రెండు దేవాలయాలు ఉన్నాయి. దేవాలయాలలో ఒకటి విష్ణువుకు అంకితం చేయగా.. దీనిని అవంతిస్వామి దేవాలయం అని పిలుస్తారు. మరొకటి శివునికి అంకితం చేశారు. దీనిని అవంతీశ్వర్ దేవాలయం అని పిలుస్తారు. ఈ ప్రదేశం పాక్షికంగా శిథిలావస్థలో ఉంది. కాని దాని రాతి శిల్పాలు, గొప్పతనం బాగా ఆకట్టుకుంటాయి. యాత్రికులు తరచుగా ఇక్కడ ఆగి ఆలయ ఆధ్యాత్మిక వాతావరణం, పురాతన నిర్మాణాన్ని చూసి ఆనందిస్తారు. అమర్‌నాథ్ గుహకు మీరు చేసే యాత్రలో శైవం, వైష్ణవం సమతుల్యతను అందిస్తాయి.

శంకరాచార్య దేవాలయం, శ్రీనగర్

(Image Source: Twitter/@imhrithiksharma)

(Image Source: Twitter/@imhrithiksharma)

శ్రీనగర్‌లోని కొండపై ఉన్న శంకరాచార్య దేవాలయం నగరం, దాల్ సరస్సు మంచి వ్యూ అందిస్తుంది. శ్రీనగర్‌లోని ఈ ఆలయం శివునికి అంకితం చేశారు. ఆధ్యాత్మిక యాత్రలో ఆది శంకరాచార్యులు స్వయంగా సందర్శించారని చెబుతారు. ఆలయం ఒక రక్షిత ప్రదేశం. కానీ ఇక్కడకు చేరుకోవడానికి కొంచెం ఎక్కాల్సి ఉంటుంది. యాత్రికులు తరచుగా యాత్రకు ముందు లేదా తరువాత శివుని ఆశీస్సులు పొందడానికి ఇక్కడకు వస్తారు.

పాండ్రేథన్ శివాలయం, శ్రీనగర్

(Image Source: Twitter/@Shailja325_67)
(Image Source: Twitter/@Shailja325_67)

శ్రీనగర్ నుంచి ఆగ్నేయంగా 6 కి.మీ దూరంలో అనంతనాగ్ కార్ట్-రోడ్‌లో ఉన్న ఈ 8వ-10వ శతాబ్దపు ఈ శివాలయం ఉంది. నీటిలో మునిగిఉండే ఈ ఆలయాన్ని "పానీ దేవాలయం" అంటారు. పాండ్రేథన్ శివాలయం ఒక చదరపు ఆలయం. దీనిని మడప్ శైలిలో నిర్మించారు. పిరమిడ్ రూఫ్ చెక్కుచెదరకుండా ఉన్న కొన్ని పురాతన కాశ్మీరీ రాతి దేవాలయాలలో ఇది ఒకటి. ఈ ఆలయం అమర్‌నాథ్ అనుభవాన్ని మరింత పెంచుతుందని భావిస్తారు.

 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆమె, డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ (Dr. BRAOU) నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2018లో హైదరాబాద్‌లో ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ ఆమె మూడేళ్లు పనిచేశారు.

తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో ఒక సంవత్సరం పాటు పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశం లో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ అందిస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy On Temples: దేవుళ్లపైనే ఏకాభిప్రాయం లేనప్పుడు..రాజకీయ నాయకులపై ఏముంటుంది? - రేవంత్ వ్యాఖ్యలతో దుమారం
దేవుళ్లపైనే ఏకాభిప్రాయం లేనప్పుడు..రాజకీయ నాయకులపై ఏముంటుంది? - రేవంత్ వ్యాఖ్యలతో దుమారం
Akhanda 2 Tickets Rates Hike: ఏపీలో 'అఖండ 2' బెనిఫిట్ షోలకు అనుమతి... టికెట్ రేట్స్ ఎంత పెరిగాయంటే?
ఏపీలో 'అఖండ 2' బెనిఫిట్ షోలకు అనుమతి... టికెట్ రేట్స్ ఎంత పెరిగాయంటే?
Janasena Clarity:  దిష్టి వివాదంపై స్పందించిన జనసేన - పవన్ వ్యాఖ్యల్ని వక్రీకరించవద్దని విజ్ఞప్తి
దిష్టి వివాదంపై స్పందించిన జనసేన - పవన్ వ్యాఖ్యల్ని వక్రీకరించవద్దని విజ్ఞప్తి
Telangana DCC Presidents: కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులకు 6 నెలలే పదవి కాలం - పని చేయకపోతే ఊస్టింగ్ - రేవంత్ రెడ్డి వ్యూహం
కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులకు 6 నెలలే పదవి కాలం - పని చేయకపోతే ఊస్టింగ్ - రేవంత్ రెడ్డి వ్యూహం
Advertisement

వీడియోలు

Alphonso Davies | శరణార్థి శిబిరం నుంచి లెజెండరీ ఫుట్‌బాలర్‌ వరకూ.. అల్ఫాన్జో స్టోరీ తెలుసా? | ABP
Virendra Sehwag Comments on Virat Kohli | వైరల్ అవుతున్న సెహ్వాగ్ కామెంట్స్
Hardik Pandya in Ind vs SA T20 | టీ20 సిరీస్‌ లో హార్దిక్ పాండ్య ?
Gambhir vs Seniors in Team India | టీమ్‌ఇండియాలో ఏం జరుగుతోంది?
Ashwin Comments on Team India Selection | మేనేజ్‌మెంట్ పై అశ్విన్ ఫైర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy On Temples: దేవుళ్లపైనే ఏకాభిప్రాయం లేనప్పుడు..రాజకీయ నాయకులపై ఏముంటుంది? - రేవంత్ వ్యాఖ్యలతో దుమారం
దేవుళ్లపైనే ఏకాభిప్రాయం లేనప్పుడు..రాజకీయ నాయకులపై ఏముంటుంది? - రేవంత్ వ్యాఖ్యలతో దుమారం
Akhanda 2 Tickets Rates Hike: ఏపీలో 'అఖండ 2' బెనిఫిట్ షోలకు అనుమతి... టికెట్ రేట్స్ ఎంత పెరిగాయంటే?
ఏపీలో 'అఖండ 2' బెనిఫిట్ షోలకు అనుమతి... టికెట్ రేట్స్ ఎంత పెరిగాయంటే?
Janasena Clarity:  దిష్టి వివాదంపై స్పందించిన జనసేన - పవన్ వ్యాఖ్యల్ని వక్రీకరించవద్దని విజ్ఞప్తి
దిష్టి వివాదంపై స్పందించిన జనసేన - పవన్ వ్యాఖ్యల్ని వక్రీకరించవద్దని విజ్ఞప్తి
Telangana DCC Presidents: కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులకు 6 నెలలే పదవి కాలం - పని చేయకపోతే ఊస్టింగ్ - రేవంత్ రెడ్డి వ్యూహం
కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులకు 6 నెలలే పదవి కాలం - పని చేయకపోతే ఊస్టింగ్ - రేవంత్ రెడ్డి వ్యూహం
Lok Bhavan: రాజ్ భవన్ కాదు లోక్ భవన్.. పీఎంవో కాదు ఇక సేవా తీర్థ్ - పేర్లు మార్చిన కేంద్రం
రాజ్ భవన్ కాదు లోక్ భవన్.. పీఎంవో కాదు ఇక సేవా తీర్థ్ - పేర్లు మార్చిన కేంద్రం
Pakistan:శ్రీలంకకు సాయంగా గడువు తీరిన ఆహారపు పొట్లాలు - పాకిస్తాన్ కక్కుర్తి - పరువు తీస్తున్న నెటిజన్లు
శ్రీలంకకు సాయంగా గడువు తీరిన ఆహారపు పొట్లాలు - పాకిస్తాన్ కక్కుర్తి - పరువు తీస్తున్న నెటిజన్లు
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ డబ్బింగ్ లేకుండా టీజర్ రిలీజ్... నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌
సుడిగాలి సుధీర్ డబ్బింగ్ లేకుండా టీజర్ రిలీజ్... నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌
HILTP Land Scam: హిల్ట్‌ భూములపై బీఆర్ఎస్ పోరాటం.. 2 రోజులపాటు క్షేత్రస్థాయి పరిశీలనకు నేతలు
హిల్ట్‌ భూములపై బీఆర్ఎస్ పోరాటం.. 2 రోజులపాటు క్షేత్రస్థాయి పరిశీలనకు నేతలు
Embed widget