అన్వేషించండి

Teachers Transfer: సెప్టెంబరు 28 నుంచి స్కూల్‌ అసిస్టెంట్ల బదిలీలకు వెబ్‌ ఆప్షన్లు, జోన్లవారీగా బదిలీలు ఇలా

రాష్ట్రంలోని మల్టీ జోన్-1 పరిధిలో 19 జిల్లాల్లోని అన్ని పాఠశాలల ఉపాధ్యాయులకు, అలాగే మల్టీ జోన్-2లో కేవలం ప్రభుత్వ పాఠశాలల్లోని వారికే బదిలీలు జరపాలని విద్యాశాఖ నిర్ణయించింది.

తెలంగాణలోని ఉన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ల బదిలీలకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని మల్టీ జోన్-1 పరిధిలో 19 జిల్లాల్లోని అన్ని పాఠశాలల ఉపాధ్యాయులకు, అలాగే మల్టీ జోన్-2లో కేవలం ప్రభుత్వ పాఠశాలల్లోని వారికే బదిలీలు జరపాలని విద్యాశాఖ నిర్ణయించింది. బదిలీలకు అర్హులైన స్కూల్ అసిస్టెంట్లు సెప్టెంబరు 28, 29 తేదీల్లో తమకు కావాల్సిన పాఠశాలలను ఎంచుకునేందుకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. 

ఆప్షన్లను మార్చుకోవాలనుకునేవారికి సెప్టెంబరు 30న వివరాలను మార్చుకోవడానికి అవకాశం కల్పించాలరు. స్పౌజ్ పాయింట్లు వినియోగించుకుంటున్న వారు తమ భార్య లేదా భర్త పనిచేస్తున్న ప్రాంతానికి దగ్గర్లోని పాఠశాలలను మాత్రమే ఎంచుకోవాలని, ఈ మేరకు డీఈఓలు పరిశీలించి బదిలీ ఉత్తర్వులు జారీ చేయాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన సెప్టెంబరు 26న ఆదేశించారు.

టెట్ ఫలితాలు విడుదల..
ఇదిలా ఉండగా.. తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌) 2023 ఫలితాలు సెప్టెంబర్‌ 27న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ టెట్ హాల్‌టికెట్ నెంబరు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. ఫలితాలతోపాటు సబ్జెక్టులవారీగా తుది ఆన్సర్ ‘కీ’ని కూడా అధికారులు విడుదల చేశారు. సెప్టెంబరు 15న నిర్వహించిన టెట్ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని సెప్టెంబరు 20న విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి సెప్టెంబరు 23 వరకు అభ్యంతరాలు స్వీకరించారు. ఇక సెప్టెంబరు 27న తుది ఆన్సర్‌ కీతోపాటు ఫలితాలను విడుదల చేశారు. 
ఫలితాల కోసం క్లిక్ చేయండి..

అక్టోబరు 20 వరకు డీఎస్సీ దరఖాస్తుకు అవకాశం..
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో 5089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి డీఎస్సీ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 20న ప్రారంభమైన సంగతి తెలిసిందే. సరైన అర్హతలున్న అభ్యర్థులు అక్టోబర్‌ 20లోగా నిర్ణీత ఫీజు చెల్లించి, అక్టోబరు 21లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం నవంబర్‌ 20 నుంచి 30 వరకు కంప్యూటర్‌ ఆధారిత విధానంలో డీఎస్సీ పరీక్షలు నిర్వహించునున్నారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితిని 44 సంవత్సరాలుగా నిర్ణయించారు. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది. ఇక దివ్యాంగులకు మాత్రం 10 సంవత్సరాలపాటు వయోసడలింపు ఉంటుంది. 
డీఎస్సీ దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..

ALSO READ:

సీడాక్ తిరువనంతపురంలో 54 ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులు, ఎంపికైతే రూ.1 లక్ష వరకు జీతం
తిరువనంతపురంలోని సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌(సీడ్యాక్‌) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు సెప్టెంబరు 29లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

ఎయిమ్స్‌-కళ్యాణిలో 120 గ్రూప్‌-బి, గ్రూప్‌-సి పోస్టులు - వివరాలు ఇలా
పశ్చిమబెంగాల్‌లోని కళ్యాణిలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌) గ్రూప్‌-బి, గ్రూప్‌-సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. స్కిల్‌టెస్ట్‌/ కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, మహిళా అభ్యర్థులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది. దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Azharuddin: జూబ్లిహిల్స్ ఉపఎన్నికల వేళ కాంగ్రెస్ సంచలన నిర్ణయం - మంత్రిగా అజహద్దీన్ - ప్రమాణం ఎప్పుడంటే ?
జూబ్లిహిల్స్ ఉపఎన్నికల వేళ కాంగ్రెస్ సంచలన నిర్ణయం - మంత్రిగా అజహద్దీన్ - ప్రమాణం ఎప్పుడంటే ?
Alert for train passengers: రైలు టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి అలర్ట్ -  తుఫాను ప్రభావంతో రైళ్ల షెడ్యూల్‌లో మార్పు, చేర్పుల పూర్తి వివరాలు ఇవిగో
టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి అలర్ట్ - తుఫాను ప్రభావంతో రైళ్ల షెడ్యూల్‌లో మార్పు, చేర్పుల పూర్తి వివరాలు ఇవిగో
New districts in AP: ఏపీలో కొత్త జిల్లాలు, పేర్లపై తుది  దశకు కసరత్తు - మరోసారి కెబినెట్ సబ్ కమిటీ భేటీ
ఏపీలో కొత్త జిల్లాలు, పేర్లపై తుది దశకు కసరత్తు - మరోసారి కెబినెట్ సబ్ కమిటీ భేటీ
Baahubali The Epic : 'బాహుబలి ది ఎపిక్' కోసం లేపేసిన సాంగ్స్, సీన్స్ ఇవే - ఆ సీన్ వెరీ డిఫికల్ట్ అన్న రాజమౌళి
'బాహుబలి ది ఎపిక్' కోసం లేపేసిన సాంగ్స్, సీన్స్ ఇవే - ఆ సీన్ వెరీ డిఫికల్ట్ అన్న రాజమౌళి
Advertisement

వీడియోలు

Hurricane Melissa batters Jamaica | జ‌మైకాను నాశనం చేసిన మెలిసా హరికేన్ | ABP Desam
US Airforce Records Inside Hurricane Melissa | హరికేన్ మెలిస్సా ఎంత ఉద్ధృతంగా ఉందో చూడండి | ABP Desam
Cyclone Montha Landfall | తీరం దాటిన మొంథా తుఫాన్
What is Digital Arrest | డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటీ ? | ABP Desam
India vs Australia Playing 11 | టీ20 మ్యాచ్ కు భారత్ ప్లేయింగ్ 11 ఇదే
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Azharuddin: జూబ్లిహిల్స్ ఉపఎన్నికల వేళ కాంగ్రెస్ సంచలన నిర్ణయం - మంత్రిగా అజహద్దీన్ - ప్రమాణం ఎప్పుడంటే ?
జూబ్లిహిల్స్ ఉపఎన్నికల వేళ కాంగ్రెస్ సంచలన నిర్ణయం - మంత్రిగా అజహద్దీన్ - ప్రమాణం ఎప్పుడంటే ?
Alert for train passengers: రైలు టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి అలర్ట్ -  తుఫాను ప్రభావంతో రైళ్ల షెడ్యూల్‌లో మార్పు, చేర్పుల పూర్తి వివరాలు ఇవిగో
టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి అలర్ట్ - తుఫాను ప్రభావంతో రైళ్ల షెడ్యూల్‌లో మార్పు, చేర్పుల పూర్తి వివరాలు ఇవిగో
New districts in AP: ఏపీలో కొత్త జిల్లాలు, పేర్లపై తుది  దశకు కసరత్తు - మరోసారి కెబినెట్ సబ్ కమిటీ భేటీ
ఏపీలో కొత్త జిల్లాలు, పేర్లపై తుది దశకు కసరత్తు - మరోసారి కెబినెట్ సబ్ కమిటీ భేటీ
Baahubali The Epic : 'బాహుబలి ది ఎపిక్' కోసం లేపేసిన సాంగ్స్, సీన్స్ ఇవే - ఆ సీన్ వెరీ డిఫికల్ట్ అన్న రాజమౌళి
'బాహుబలి ది ఎపిక్' కోసం లేపేసిన సాంగ్స్, సీన్స్ ఇవే - ఆ సీన్ వెరీ డిఫికల్ట్ అన్న రాజమౌళి
Komatireddy Venkata Reddy: సినిమాటోగ్రఫీ మంత్రి లేకుండానే సినీ కార్మికుల అభినందన సభ - సీఎం రేవంత్ పై కోమటిరెడ్డి అసంతృప్తి ?
సినిమాటోగ్రఫీ మంత్రి లేకుండానే సినీ కార్మికుల అభినందన సభ - సీఎం రేవంత్ పై కోమటిరెడ్డి అసంతృప్తి ?
Kotha Lokah OTT: ఓటీటీలోకి కల్యాణీ ప్రియదర్శన్ 'కొత్త లోక'... టోటల్ థియేట్రికల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?
ఓటీటీలోకి కల్యాణీ ప్రియదర్శన్ 'కొత్త లోక'... టోటల్ థియేట్రికల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?
Mass Jathara : చిరు, విజయశాంతి కాంబో గుర్తొస్తుంది - ఫ్యాన్స్‌కు 'మాస్ జాతర' ఓ సెలబ్రేషన్... డైరెక్టర్ భాను లేటెస్ట్ ఇంటర్వ్యూ
చిరు, విజయశాంతి కాంబో గుర్తొస్తుంది - ఫ్యాన్స్‌కు 'మాస్ జాతర' ఓ సెలబ్రేషన్... డైరెక్టర్ భాను లేటెస్ట్ ఇంటర్వ్యూ
IND vs AUS 1st T20 Highlights:వర్షం కారణంగా ఇండియా ఆస్ట్రేలియా మొదటి టీ20 మ్యాచ్‌ రద్దు - ఈ మ్యాచ్‌తో మరో ఫీట్ అందుకున్న సూర్యాభాయ్
వర్షం కారణంగా ఇండియా ఆస్ట్రేలియా మొదటి టీ20 మ్యాచ్‌ రద్దు - ఈ మ్యాచ్‌తో మరో ఫీట్ అందుకున్న సూర్యాభాయ్
Embed widget