అన్వేషించండి

Visakha Job Mela : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - విశాఖ ఏయూలో రెండ్రోజుల పాటు జాబ్ మేళా

Visakha Job Mela : విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో రేపు, ఎల్లుండి జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఇందులో 206 కంపెనీలు పాల్గొంటున్నాయి. దాదాపు 25 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు.

Visakha Job Mela :  విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ ఏర్పాట్లను ఎంపీ విజయసాయి రెడ్డి శుక్రవారం పరిశీలించారు. విశాఖ జాబ్‌మేళాలో దాదాపు 25 వేల ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 77 వేల ఉద్యోగార్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారన్నారు. ఈ జాబ్ మేళాలో మొత్తం 206 కంపెనీల పాల్గొంటున్నాయన్నారు. శని, ఆదివారాలు ఏయూలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. అవసరం అయితే సోమవారం కూడా కార్యక్రమం పొడిగిస్తామన్నారు. 

ఆంధ్ర యూనివర్సిటీలో జాబ్ మేళాకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎంపీ విజయసాయి రెడ్డి ప్రకటించారు. 206 కంపెనీలకు మొత్తం 206 గదుల కేటాయించామన్నారు. ప్రతి కంపెనీ వద్ద నలుగురు వాలంటీర్లు ఉంటారని, మొత్తం 860 మంది బాధ్యతలు నిర్వహిస్తారని తెలిపారు. ప్రతి భవనం వద్ద ఐదుగురు టీచర్లకు బాధ్యతలు అప్పగించామని, 30 వేల మందికి ఉద్యోగాలు వచ్చేలా ప్రయత్నం చేస్తామని విజయసాయిరెడ్డి వెల్లడించారు. 

విజయసాయి రెడ్డి ఇంకా ఏమన్నారంటే? 

సీఎం వైయస్‌ జగన్‌ గత మూడేళ్లుగా రాష్ట్రంలో వినూత్న పథకాలు అమలు చేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలే కాకుండా, నూతన విద్యా విధానాన్ని కూడా అమలు చేస్తున్నారు. నాడు–నేడు కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలను పూర్తిగా మార్చేస్తున్నారు. ఆ విధంగా విద్యా ప్రమాణాలు పెంచుతున్నారు. విద్య అనేది విజ్ఞానాన్ని పెంచుతుంది. దాంతో ఉద్యోగ అవకాశాలు కూడా పెంచాలన్నది సీఎం  లక్ష్యం. అందుకే విద్యా సంస్థలను పారిశ్రామిక, సేవా రంగాలకు అనుసంధానం చేస్తున్నారు. గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో (జీఈఆర్‌)ను 36 శాతం నుంచి 50 శాతానికి పెంచే విధంగా కొత్త కోర్సులు, నూతన విద్యాలయాలు ప్రారంభించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 

25 వేల ఉద్యోగాలు 

మూడేళ్ల కాలంలో సీఎం వైయస్‌ జగన్‌ 4 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే కాకుండా, ప్రైవేటు రంగంలో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం జాబ్‌మేళాలు ప్రారంభించాం. తొలుత ఈ కార్యక్రమాన్ని తిరుపతిలో నిర్వహించాం. అక్కడ 5 వేల ఉద్యోగావకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంటే, 7 వేలకు పైగా ఉద్యోగాలు వచ్చాయి. ఒక సామాజిక బాధ్యతగా వైయస్సార్‌ కాంగ్రెస్‌ ఈ జాబ్‌మేళా నిర్వహిస్తోంది. విశాఖలో రేపు, ఎల్లుండి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ 206 కంపెనీలు రిజిస్టర్‌ చేసుకున్నాయి. అవసరం అయితే, సోమవారం కూడా నిర్వహిస్తాం. ఇక్కడ 77 వేల మంది ఉద్యోగార్థులు రిజిస్టర్‌ చేసుకున్నారు. 23,935 ఖాళీలు ఇక్కడ భర్తీ చేయబోతున్నాం. దాదాపు 25 వేల ఉద్యోగాలు. అంటే కుటుంబంలో నలుగురిని లెక్క వేసుకున్నా, దాదాపు లక్ష మంది ముఖాల్లో చిరునవ్వులు చూడబోతున్నాం.

206 కంపెనీలు రాక 
 
206 కంపెనీలకు 206 రూమ్‌లు కేటాయించాం. ప్రతి రూమ్‌ వద్ద ఆ కంపెనీకి సంబంధించి పూర్తి వివరాలు ప్రదర్శిస్తారు. ఏయే ఉద్యోగాలు, ఏయే అర్హతలు కావాలన్నది రూమ్‌ దగ్గర స్పష్టంగా ప్రదర్శించడం జరుగుతుంది. ప్రతి బ్లాక్‌లో వేర్వేరుగా ఫార్మా, ఐటీ, బీపీఓ, బ్యాంకింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, టెక్స్‌టైల్స్, ఇన్సూరెన్స్, మార్కెటింగ్‌ వంటి తొమ్మిది విభాగాలుగా విభజించి, ఆ రూమ్‌లు కేటాయించాం. ఇందుకోసం 13 భవనాల్లో 206 గదులు సిద్దం చేయడం జరిగింది. క్యూఆర్‌సీ (క్విక్‌ రెస్పాన్ప్‌ కోడ్‌) ద్వారా విద్యార్థులు తమ అర్హతలకు తగిన భవనాన్ని ఎంపిక చేసుకుని అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. ప్రతి భవనం దగ్గర హెల్ప్‌ డెస్క్‌లు ఉంటాయి. అక్కడ మీకు కావాల్సిన పూర్తి సమాచారం ఇస్తారు. కియోస్క్‌లు కూడా ఉంటాయి. వాటి ద్వారా కూడా విద్యార్థుల పని సులభం అవుతుంది. ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి, ముందు జాగ్రత్తగా మూడు వైద్య బృందాలు ఏర్పాటు చేస్తున్నాం. విద్యార్థులకు మంచినీళ్లు, నిమ్మరసం అందుబాటులో ఉంచుతున్నాం. మహిళలు, గర్భిణిలు వస్తే వారికి ఇబ్బంది కలగకుండా చూస్తాం. ఒక భవనం నుంచి మరో భవనం వద్దకు వెళ్లడం కోసం ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ ఏర్పాటు చేశాం. ఇక్కడకు వచ్చిన 206 కంపెనీలకు ఒకొక్కరికి 4గురు వలంటీర్లు, ప్రతి భవనానికి 5గురు టీచర్లను నియమించాం. ఆ మేరకు 860 మంది వలంటీర్లు ఇక్కడ సేవలందించనున్నారు. అవసరం అయితే సోమవారం కూడా కార్యక్రమం నిర్వహించి 30 వేల మందికి ఉద్యోగాలు వచ్చేలా ప్రయత్నిస్తాం.

50 వేల మంది హాజరయ్యే అవకాశం 

జాబ్‌మేళా కార్యక్రమాన్ని లాంఛనంగా శనివారం ఉదయం 9 గంటలకు ప్రారంభిస్తాం. 15 నిమిషాల్లోనే దాన్ని పూర్తి చేస్తాం. అయితే అప్పటికే ఉదయం 8.30 గంటలకే ఇంటర్వ్యూలు మొదలై సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయి. ఉద్యోగాలకు ఎంపికైన వారికి ప్రతి రోజూ సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు స్నాతకోత్సవ మందిరంలో నియామక పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూలకు దాదాపు 50 వేల మంది హాజరు కావొచ్చు. దాదాపు 25 వేల మందిని నియమించవచ్చు. అంటే ప్రతి ఇద్దరిలో ఒకరు ఎంపిక అవుతారు. ఎక్కడైనా ఆయా సంస్థల ఉన్నతాధికారుల అనుమతి కావాల్సి వస్తే, ఆ విద్యార్థులకు మాత్రం ఒక వారం రోజుల్లో నియామక పత్రాలు పంపడం జరుగుతుంది.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024: ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
Telangana News: ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
AP News: ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
IPL 2024: మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Delhi Capitals vs Gujarat Titans Highlights | రషీద్ ఖాన్ ట్రై చేసినా.. విజయం దిల్లీదే | ABP DesamPawan Kalyan From Pithapuram | Public Opinion | పిఠాపురంలో ప్రజలు ఎటు వైపు..? | ABP DesamCM Revanth Reddy vs Harish Rao | రేవంత్ రెడ్డి సవాల్ స్వీకరించిన హరీశ్ రావు | ABP DesamPawan Kalyan Dance in Nomination Ryally | కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి నామినేషన్ లో పవన్ చిందులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024: ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
Telangana News: ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
AP News: ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
IPL 2024: మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
KCR News: ఈ దద్దమ్మలకు దమ్ములేదు, వాళ్ల మెడలు వంచి హామీలు అమలు చేయిస్త - కేసీఆర్
ఈ దద్దమ్మలకు దమ్ములేదు, వాళ్ల మెడలు వంచి హామీలు అమలు చేయిస్త - కేసీఆర్
Medak BRS Candidate :  రూ. వంద కోట్లిస్తా -  మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వినూత్న హామీ !
రూ. వంద కోట్లిస్తా - మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వినూత్న హామీ !
Yadadri Power Plant: యాదాద్రి పవర్ ప్లాంట్‌కి లైన్ క్లియర్ - విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్
యాదాద్రి పవర్ ప్లాంట్‌కి లైన్ క్లియర్ - విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్
Actor Naresh On Pawan Kalyan :  సూపర్ స్టార్ కృష్ణను రాజకీయాల్లోకి లాగవద్దు - పవన్ కు నరేష్ విజ్ఞప్తి
సూపర్ స్టార్ కృష్ణను రాజకీయాల్లోకి లాగవద్దు - పవన్ కు నరేష్ విజ్ఞప్తి
Embed widget