అన్వేషించండి

TSPSC: నేటితో ముగియనున్న టీఎస్‌పీఎస్సీ పదవుల దరఖాస్తు గడువు, ఈ సమయంలోపు అప్లయ్ చేసుకోవాలి

TSPSCలో ఛైర్మన్, సభ్యుల పదవుల భర్తీకి సంబంధించి దరఖాస్తు గడువు జనవరి 18న సాయంత్రం 5 గంటలతో ముగియనుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 316 ప్రకారం ఛైర్మన్, సభ్యులను గవర్నర్ నియమించనున్నారు.

TSPSC Recruitment: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC)లో ఛైర్మన్, సభ్యుల పదవుల భర్తీకి ప్రభుత్వం జనవరి 12న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పోస్టుల దరఖాస్తు గడువు నేటితో (జనవరి18) ముగియనుంది. కమిషన్ పదవులకు సంబంధించి దరఖాస్తు గడువు జనవరి 12న ప్రారంభంకాగా.. జనవరి 18న సాయంత్రం 5 గంటల్లోగా అభ్యర్థులు ఈమెయిల్ ద్వారా దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది. ఈ పదవులకు దరఖాస్తు చేసేందుకు వివిధ రంగాల్లో పనిచేస్తున్న పలువురు అర్హతలు, ఇతర వివరాల కోసం ఆరా తీస్తున్నారు. వచ్చిన దరఖాస్తులను ప్రభుత్వం నియమించిన సెర్చ్ కమిటీ పరిశీలించి, అర్హులైన వారి పేర్లను ప్రభుత్వానికి ప్రతిపాదించనుంది. కమిటీ సూచించిన పేర్లను ప్రభుత్వం పరిశీలించి నియామకం కోసం గవర్నర్‌కు ప్రతిపాదనలు పంపుతుంది. గవర్నర్ నిర్ణయం మేరకు కమిషన్‌కు కొత్త ఛైర్మన్, సభ్యులు ఎంపికవుతారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 316 ప్రకారం ఛైర్మన్, సభ్యులను గవర్నర్ నియమించనున్నారు. అభ్యర్థులు తెలంగాణ పబ్లిక్ సర్వీసెస్ నిబంధనలకు లోబడి దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తులు నింపి, స్కానింగ్ కాపీలను నిర్ణీత గడువులోగా సంబంధిత ఈమెయిల్: secy-ser-gad@telangana.gov.in ద్వారా పంపాల్సి ఉంటుంది. ఎస్‌పీఎస్సీ చైర్మన్‌, సభ్యుల పదవులకు కావాల్సిన అర్హతలు, ఇతర వివరాలను నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.

వివరాలు...

* టీఎస్‌పీఎస్సీ నియమాకాలు

1) ఛైర్మన్

2) కమిషన్ సభ్యులు

అర్హతలు..

➥  టీఎస్‌పీఎస్సీ నిబంధన 3 ప్రకారం.. కమిషన్‌లో ఛైర్మన్‌తో పాటు సభ్యులు 11 మందికి మించి ఉండటానికి వీల్లేదు. 

➥  కమిషన్‌లో సగంమంది సభ్యులు కేంద్ర, రాష్ట్రాల సర్వీసుల్లో పదేళ్ల సర్వీసు పూర్తిచేసిన వారై ఉండాలి. వీరిపై విజిలెన్స్ కేసులు ఉండకూడదు. మిగతా సభ్యులు అకడమిక్స్, మేనేజ్‌మెంట్, లా, సైన్స్ అండ్ టెక్నాలజీ, సోషల్ సైన్స్, హ్యుమానిటీస్ రంగాల్లో నిపుణులై ఉండాలి. 

➥ కేంద్ర, రాష్ట్ర పీఎస్సీల సభ్యుల పదవీకాలం 6 సంవత్సరాలు కాగా.. ఆలోపు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సభ్యుడి వయసు 65 సంవత్సరాలు, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌(TSPSC)లో సభ్యుడి వయసు 62 ఏళ్లు నిండితే వారి పదవీకాలం పూర్తవుతుంది. ఇలాంటివారు.. మరోసారి ఆ పోస్టులో తిరిగి నియామకం పొందేందుకు వీల్లేదు.

దరఖాస్తు విధానం: అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు నింపి, స్కానింగ్ కాపీలను నిర్ణీత గడువులోగా సంబంధిత ఈమెయిల్ చిరునామాకు పంపాలి.

ఎంపిక విధానం: ప్రభుత్వం నియమించిన సెర్చ్ కమిటీ ఈ దరఖాస్తులను పరిశీలించి అభ్యర్థులను ఎంపికచేస్తారు.

దరఖాస్తు వివరాలు ఇలా..

➥ దరఖాస్తులో అభ్యర్థి తన వ్యక్తిగత వివరాలతోపాటు.. వృత్తి, ప్రభుత్వ సర్వీసులో పనిచేసి ఉంటే.. ఎంతకాలం పనిచేశారు, పదవీ విరమణ ఎప్పుడు చేశారన్న వివరాలు పొందుపరచాల్సి ఉంటుంది.

➥ విద్యార్హతల్లో డిగ్రీ, ఇతర కోర్సులు పాసైన తేదీ, పరీక్షల్లో తెచ్చుకున్న మార్కులు, డిస్టింక్షన్ వివరాలు, స్పెషలైజేషన్ సబ్జెక్టు వివరాలు తెలియజేయాలి.

➥ అధికారుల కేటగిరీలో ప్రభుత్వ సర్వీసులో ఎప్పటి నుంచి ఎప్పటివరకు ఏయే హోదాల్లో పనిచేశారో చెప్పాలి.

➥ ప్రముఖుల కేటగిరీలో అకడమిక్స్, మేనేజ్‌మెంట్, లా, సైన్స్ అండ్ టెక్నాలజీ, సోషల్ సైన్స్, హ్యుమానిటీస్ రంగాల్లో వారి సేవలను చెప్పాలి. గతంలో సాధించిన 5 విజయాల గురించి 200 పదాలకు మించకుండా రాసి, ఆ వివరాలు అప్‌లోడ్ చేయాలి. ప్రొఫెషనల్ రంగాలు, విద్యాసంస్థలు, సొసైటీలు లేదా రాజకీయ పార్టీలు, సంఘాలతో అనుబంధం వివరాలను తెలపాలి.

దరఖాస్తులు పంపాల్సిన ఈమెయిల్: secy-ser-gad@telangana.gov.in

ముఖ్యమైన తేదీలు..

➥ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12.01.2024.

➥ దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 18.01.2024. (5 PM)

Notification

Application

Website

టాప్ హెడ్ లైన్స్

IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Embed widget