TSPSC AEE Hall Tickets: ఏఈఈ పరీక్ష హాల్టికెట్లు వచ్చేశాయ్, డైరెక్ట్ లింక్ ఇదే! వెంటనే డౌన్లోడ్ చేసుకోండి - పరీక్ష ఎప్పుడంటే?
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జనవరి 22న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మొదటి సెషన్లో పేపర్-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సా. 5 గంటల వరకు రెండో సెషన్లో పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు.

తెలంగాణలోని పలు ప్రభుత్వ విభాగాల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి సంబంధించి జనవరి 22న నిర్వహించనున్న రాతపరీక్షకు సంబంధించిన హాల్టికెట్లను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. అధికారిక వెబ్సైట్లో హాల్టికెట్లను అందుబాటులో ఉంచింది. ఏఈఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ టీఎస్పీఎస్సీ ఐడీ, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జనవరి 22న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మొదటి సెషన్లో పేపర్-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్లో పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులు పరీక్ష సమయానికి కనీసం 45 నిమిషాల ముందుగా వారికి నిర్దేశించిన పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని టీఎస్పీఎస్సీ సూచించింది.
TSPSC AEE పరీక్ష హాల్టికెట్ల కోసం క్లిక్ చేయండి..
రాతపరీక్ష విధానం: మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో పేపర్-1 (జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్)కు 150 మార్కులు, పేపర్-2(అభ్యర్థి సబ్జెక్టు)కు 300 మార్కులు కేటాయించారు. పేపర్-1లో 150 ప్రశ్నలు-150 మార్కులు, పేపర్-2లో 150 ప్రశ్నలు 300 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం ఒక్కో పేపరుకు 150 నిమిషాలుగా కేటాయించారు.
ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఏఈఈ) పోస్టులను భర్తీకి సెప్టెంబరు 3న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మిషన్ భగీరథ, ఇరిగేషన్, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ట్రైబల్ వెల్ఫేర్, అర్అండ్బీ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. వీటిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానం ద్వారా భర్తీ చేయనున్నారు.
ఏఈఈ పోస్టుల భర్తీకి సెప్టెంబరు 22 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు అక్టోబర్ 20 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించవచ్చు. వాస్తవానికి అక్టోబరు 15 దరఖాస్తుకు చివరితేది కాగా.. గడువు పొడిగించాలంటూ అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు రావటంతో మరో 5 రోజులు అవకాశం కల్పిస్తూ కమిషన్ నిర్ణయం తీసుకుంది.
పోస్టుల వివరాలు..
* అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఏఈఈ) పోస్టులు
మొత్తం ఖాళీల సంఖ్య: 1540
1) ఏఈఈ(సివిల్)- పీఆర్ఆర్డీ డిపార్ట్మెంట్ (మిషన్ భగీరథ): 302 పోస్టులు
2) ఏఈఈ(సివిల్)- పీఆర్ఆర్డీ డిపార్ట్మెంట్: 211 పోస్టులు
3) ఏఈఈ (సివిల్) ఎంఏ యూడీ- పీహెచ్: 147 పోస్టులు
4) ఏఈఈ(సివిల్) టీడబ్ల్యూ డిపార్ట్ మెంట్: 15 పోస్టులు
5) ఏఈఈ ఐసీఏడీ డిపార్ట్ మెంట్: 704 పోస్టులు
6) ఏఈఈ (మెకానికల్) ఐసీఏడీ(జీడబ్ల్యూడీ): 03 పోస్టులు
7) ఏఈఈ (సివిల్) టీఆర్బీ: 145 పోస్టులు
8) ఏఈఈ (ఎలక్ట్రికల్) టీఆర్బీ: 13 పోస్టులు
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 22-09-2022.
➥ ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15-10-2022. (20.10.2022 వరకు పొడిగించారు)
➥ పరీక్ష తేదీ: 22.01.2023.
పోస్టుల వివరాలు, నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
పరీక్ష విధానం, సిలబస్ వివరాలు..
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...
Before You Go
PBKS vs GT Highlights : వరుసగా ఐదో మ్యాచ్ లోనూ ఆఖరి ఓవర్ లోనే ఫలితం | IPL 2023 | ABP Desam
ట్రెండింగ్ వార్తలు






















