అన్వేషించండి

TET Application: నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ, ఇప్పటికీ తేలని ఫీజుల వ్యవహారం - ఇక తగ్గనట్టేనా?

TS TET-2024 నోటిఫికేషన్ మార్చి 15న విడుదలైన సంగతి తెలిసిందే. మార్చి 27న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్నవారు ఏప్రిల్ 10 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.

TS TET APplication: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TS TET)-2024 నోటిఫికేషన్ మార్చి 15న విడుదలైన సంగతి తెలిసిందే. మార్చి 27న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్నవారు ఏప్రిల్ 10 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థుల సౌలభ్యం కోసం హెల్ప్‌లైన్లను సైతం విద్యాశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. అభ్యర్థులు మే 15 నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 20 నుంచి జూన్ 3 వరకు కంప్యూటర్ ఆధారిత విధానంలో టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు పేపర్-1, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష ఫలితాలను జూన్ 12న విడుదలచేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 11 జిల్లా కేంద్రాల్లో టెట్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది దాదాపు 3 లక్షల మంది బీఈడీ, డీఈడీ ఉత్తీర్ణులు టెట్‌ రాసేందుకు సన్నద్ధమవుతున్నారు.   దరఖాస్తు సమయంలో అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే 7075701768, 7075701784 నంబర్లలో సంప్రదించవచ్చు.

టీచర్లకు విద్యాశాఖ అనుమతి తప్పనిసరి.. 
టెట్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభంకానున్న నేపథ్యంలో.. పలువురు టీచర్లు టెట్‌ పరీక్షకు దరఖాస్తుచేయాలని భావిస్తున్నారు. ఇందుకు విద్యాశాఖ నుంచి అనుమతి తీసుకోవాలా? లేదా ? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే నిబంధనల ప్రకారం రాష్ట్రంలోని ప్రభుత్వ టీచర్లు టెట్‌ రాయాలంటే విద్యాశాఖ నుంచి ముందస్తు అనుమతి పొందాల్సిందే. ఇలా అనుమతి పొందితేనే సరి.. లేదంటే నిబంధనలు ఉల్లంఘించినట్టుగా పరిగణిస్తారు. ఈ విషయంపై టెట్‌ కన్వీనర్‌ను మీడియా ప్రతినిధులు సంప్రదించగా.. టెట్‌ పరీక్షనే కాకుండా.. ఏ పరీక్ష రాయాలన్నా టీచర్లు విద్యాశాఖ నుంచి అనుమతిపొందాలని సూచించారు. టీచర్ల పదోన్నతులు కల్పించేందుకు టెట్‌ తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. దీంతో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ) నుంచి స్కూల్‌ అసిస్టెంట్‌, స్కూల్‌ అసిస్టెంట్‌ నుంచి హెచ్‌ఎంగా పదోన్నతి పొందాలంటే టెట్‌లో క్వాలిఫై కావడం తప్పనిసరి అయ్యింది. దీంతో ఉపాధ్యాయ ఉద్యోగార్థులతో పాటు ఈ సారి సర్కారీ టీచర్లు సైతం పదోన్నతులు పొందేందుకు టెట్‌ రాయబోతున్నారు. గతంలో టీచర్లకు టెట్‌ నుంచి మినహాయింపునివ్వగా, దీనిని సవరించి ఇటీవలే ప్రభుత్వం టెట్‌ జీవోల్లో మార్పులు చేసింది.

వీరు అర్హులు..

➥ టెట్ పేపర్-1కి డీఈడీ అర్హత ఉండాలి. ఇంటర్‌లో జనరల్ అభ్యర్థులకు 50 శాతం, ఇతరులకు 45 శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలి.. ఒకవేళ అభ్యర్థులు 2015లోపు డీఈడీలో చేసిఉంటే జనరల్ అభ్యర్థులకుఇంటర్‌లో 45 శాతం, ఇతరులకు 40 శాతం మార్కులు ఉన్నా అర్హులే. 

➥ టెట్ పేపర్-2కి డిగ్రీ, బీఈడీ ఉండాలి. జనరల్ అభ్యర్థులకు డిగ్రీలో 50 శాతం, ఇతరులకు 45 శాతం మార్కులు ఉండాలి. 2015లోపు బీఈడీ అయితే జనరల్‌కి 50 శాతం, ఇతరులకు 40 శాతం మార్కులు ఉన్నా అర్హులే. సర్వీస్ టీచర్లు కూడా టెట్ రాయవచ్చు.

ఫీజుల సంగతేంటి?
అతి తక్కువ ఫీజులతో పోటీ పరీక్షలు నిర్వహిస్తామని కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు చెప్పింది. అయితే దీనికి విరుద్ధంగా టెట్‌ ఫీజును భారీగా పెంచిందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. టెట్ పరీక్ష ఫీజులు భారీగా పెంచడంపై నిరుద్యోగులు, వివిధ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో దిద్దుబాటు చర్యలకు ప్రభుత్వం దిగినట్లు తెలుస్తోంది. గతంలో టెట్ ఒక పేపర్‌కు రూ.200 ఫీజు ఉండగా... దాన్ని రూ.1000కి పెంచింది. ఇక రెండు పేపర్లు రాసే అభ్యర్థులకు గూబ గుయ్యిమనిపించింది.. గతంలో రూ.300 గా ఉన్న ఫీజును ఏకంగా రూ.2,000కు పెంచేసింది. ఈ నేపథ్యంలో ఫీజులను ఈ స్థాయిలో పెంచడంపై అభ్యర్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కోచింగ్, శిక్షణ, హాస్టల్ ఫీజులకే వేల రూపాయలు ఖర్చుపెడుతున్న తమకు పెరిగిన పరీక్ష ఫీజలు చెల్లించడం మరింత భారంగా మారిందని, ఇలా చేయడం తగదని.. పెంచిన ఫీజులను వెంటనే తగ్గించాలని కోరుతున్నారు. 2023లో కూడా టెట్‌ ఫీజును రెండు పేపర్లకు కలిపి రూ.400 చేసినా పెద్దగా విమర్శలు రాలేదు. కానీ ఇప్పుడు ఏకంగా భారీగా ఫీజులు పెంచేశారు. 

అందుకే పెంచాల్సి వచ్చింది - అధికారులు
డీఎస్సీ పరీక్షకు నిర్ణయించిన ఫీజు విషయంలోనూ మొదట అభ్యర్థుల నుంచి వ్యతిరేకత వచ్చినప్పటికీ.. తర్వాత సద్దుమణిగిందని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. ఆన్‌లైన్‌లో టెట్‌ నిర్వహించడం వల్ల వ్యయం పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. సర్వర్ల నిర్వహణకు ఎక్కువ మొత్తం ఖర్చు చేయాలని అంటున్నారు. ఈ కారణంగానే టెట్‌ ఫీజు పెంచాల్సి వచ్చిందనేది అధికారుల వాదన. కాగా, దీనిపై పునరాలోచన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఫీజుల విషయంలో నిర్ణయం వెలువడినే తర్వాతే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

తెలంగాణ టెట్-2024 సమగ్ర నోటిఫికేషన్, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

240 crore scam network: ఈ తల్లీకొడుకులు 9 వేల బ్యాంక్ అకౌంట్లతో 240 కోట్ల స్కామ్ చేశారు - వీళ్ల మైండ్ మామూలుది కాదు!
ఈ తల్లీకొడుకులు 9 వేల బ్యాంక్ అకౌంట్లతో 240 కోట్ల స్కామ్ చేశారు - వీళ్ల మైండ్ మామూలుది కాదు!
Chandrababu: ప్రతి ఒక్కరూ స్వగ్రామాల అభివృద్ధికి తోడ్పడాలి - నారా వారి పల్లెలో చంద్రబాబు పిలుపు
ప్రతి ఒక్కరూ స్వగ్రామాల అభివృద్ధికి తోడ్పడాలి - నారా వారి పల్లెలో చంద్రబాబు పిలుపు
Dutch mayor search for birth mother in Nagpur: ఇది కలియుగ కుంతీకర్ణుల కథే - తల్లి కోసం నాగ్‌పూర్‌లో డచ్ మేయర్ వెదుకులాట!
ఇది కలియుగ కుంతీకర్ణుల కథే - తల్లి కోసం నాగ్‌పూర్‌లో డచ్ మేయర్ వెదుకులాట!
Adilabad Murder Case: ఒంటరి దగ్గర డబ్బులు అప్పు తీసుకుని చెల్లించాలసి వస్తుందని చంపేశారు - ఆదిలాబాద్‌లో దారుణం
ఒంటరి దగ్గర డబ్బులు అప్పు తీసుకుని చెల్లించాలసి వస్తుందని చంపేశారు - ఆదిలాబాద్‌లో దారుణం

వీడియోలు

Tension Errupt at Puranapul | మైసమ్మ ఆలయంపై ఆగంతుకుడి దాడి, ఉద్రిక్తత | ABP Desam
Virat Kohli No 1 ODI Rank | కష్టం అనుకున్న లక్ష్యాన్ని మళ్లీ సాధించిన కోహ్లీ | ABP Desam
Mohammed Siraj Hyderabad Captain | హైదరాబాద్ రంజీ కెప్టెన్ గా మహ్మద్ సిరాజ్ | ABP Desam
Ind U19 vs USA U19 Match | U19 ODI World Cup 2026 నేటితో ప్రారంభం | ABP Desam
Ind vs Nz Second ODI Highlights | రెండో వన్డేలో భారత్ పై 7వికెట్ల తేడాతో కివీస్ ఘన విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
240 crore scam network: ఈ తల్లీకొడుకులు 9 వేల బ్యాంక్ అకౌంట్లతో 240 కోట్ల స్కామ్ చేశారు - వీళ్ల మైండ్ మామూలుది కాదు!
ఈ తల్లీకొడుకులు 9 వేల బ్యాంక్ అకౌంట్లతో 240 కోట్ల స్కామ్ చేశారు - వీళ్ల మైండ్ మామూలుది కాదు!
Chandrababu: ప్రతి ఒక్కరూ స్వగ్రామాల అభివృద్ధికి తోడ్పడాలి - నారా వారి పల్లెలో చంద్రబాబు పిలుపు
ప్రతి ఒక్కరూ స్వగ్రామాల అభివృద్ధికి తోడ్పడాలి - నారా వారి పల్లెలో చంద్రబాబు పిలుపు
Dutch mayor search for birth mother in Nagpur: ఇది కలియుగ కుంతీకర్ణుల కథే - తల్లి కోసం నాగ్‌పూర్‌లో డచ్ మేయర్ వెదుకులాట!
ఇది కలియుగ కుంతీకర్ణుల కథే - తల్లి కోసం నాగ్‌పూర్‌లో డచ్ మేయర్ వెదుకులాట!
Adilabad Murder Case: ఒంటరి దగ్గర డబ్బులు అప్పు తీసుకుని చెల్లించాలసి వస్తుందని చంపేశారు - ఆదిలాబాద్‌లో దారుణం
ఒంటరి దగ్గర డబ్బులు అప్పు తీసుకుని చెల్లించాలసి వస్తుందని చంపేశారు - ఆదిలాబాద్‌లో దారుణం
Tesla Full Self Driving Software :టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ సిస్టమ్‌పై ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం! సభ్యత్వం తీసుకుంటేనే సర్వీస్‌!
టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ సిస్టమ్‌పై ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం! సభ్యత్వం తీసుకుంటేనే సర్వీస్‌!
Cyber ​​Truck in Amalapuram: అమలాపురంలో టెస్లా సైబర్ ట్రక్ - గోదావరి జిల్లాల వాళ్లతో మామూలుగా ఉండదు మరి !
అమలాపురంలో టెస్లా సైబర్ ట్రక్ - గోదావరి జిల్లాల వాళ్లతో మామూలుగా ఉండదు మరి !
ED vs I-PAC: మమతా బెనర్జీది దొంగతనమే - ఈడీ వాదనలు - సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
మమతా బెనర్జీది దొంగతనమే - ఈడీ వాదనలు - సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
Iran America Conflict: ఇరాన్‌పై అమెరికా దాడి చేస్తే ప్రపంచానికి ఇబ్బందులే - ఏం జరుగుతుందో తెలుసా?
ఇరాన్‌పై అమెరికా దాడి చేస్తే ప్రపంచానికి ఇబ్బందులే - ఏం జరుగుతుందో తెలుసా?
Embed widget