అన్వేషించండి

TS Group-I : గ్రూప్-1 అభ్యర్థులకు అలెర్ట్, దరఖాస్తుల్లో సవరణలకు ఛాన్స్

TS Group-I : గ్రూప్-1 అభ్యర్థులు టీఎస్పీఎస్సీ మరో అవకాశం ఇచ్చింది. అప్లికేషన్లను ఎడిట్ చేసుకునేందుకు మూడు రోజుల పాటు అవకాశం కల్పించింది.

TS Group-I : అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. ఇటీవల రాష్ట్రంలో గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తుల గడువు కూడా ముగిసింది. టీఎస్పీఎస్సీ 503 పోస్టులకు దరఖాస్తులకు ఆహ్వానించింది. ఈ పోస్టులకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. అయితే అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో తప్పులు సరి చేసుకునేందుకు టీఎస్‌పీఎస్సీ మరో అవకాశం కల్పించింది. ఈ నెల 19 నుంచి 21 వరకు అభ్యర్థులు తమ అప్లికేషన్లను ఎడిట్ చేసుకునేందుకు ఛాన్స్ ఇచ్చింది. గ్రూప్-1 అభ్యర్థులు www.tspsc.gov.in వెబ్‌సైట్‌ ద్వారా అప్లికేషన్లను ఎడిట్‌ చేసుకోవచ్చని టీఎస్పీఎస్సీ తెలిపింది. అయితే ఎడిట్ చేసుకునేందుకు తగిన సర్టిఫికేట్లు అప్‌లోడ్‌ చేయాలని సూచించింది. గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి అక్టోబర్‌ 16న ప్రిలిమ్స్ నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్పీ ఇప్పటికే ప్రకటించింది. మెయిన్స్‌ పరీక్షలను జనవరి లేదా ఫిబ్రవరిలో నిర్వహించనున్నట్టు వెల్లడించింది.  

అక్టోబర్ 16న ప్రిలిమ్స్ 

తెలంగాణలో గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష తేదీ ఖరారు చేసింది టీఎస్పీఎస్సీ. అక్టోబరు 16వ తేదీన గ్రూప్-1 ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తర్వాత నిర్వహిస్తున్న తొలి గ్రూప్‌-1 పరీక్ష కావడంతో ప్రాధాన్యత ఏర్పడింది. సాధారణంగా గ్రూప్ -1 పరీక్షలు కాంపిటీషన్ అధికంగా ఉంటుంది. డిప్యూటీ కలెక్టర్‌, డీఎస్పీ పోస్టులు సాధిస్తే భవిష్యత్తులో ఐఏఎస్‌, ఐపీఎస్‌ అయ్యే అవకాశం ఉండటంతో అభ్యర్థులు పెద్ద ఎత్తున పోటీపడుతున్నారు. రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. జూన్‌ 4 నాటికి మొత్తం 503 పోస్టులకు 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. ఒక్కోపోస్టుకు సరాసరి 756 మంది చొప్పున పోటీపడుతున్నారు. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష నిర్వహించే అవకాశముందని టీఎస్‌పీఎస్సీ పేర్కొంది.

503 పోస్టులు 

తెలంగాణ గ్రూప్‌-1 నోటిఫికేషన్ లో మొత్తం 503 పోస్టులు ఉన్నాయి. ఇందులో 225 మహిళలకు రిజర్వ్ చేశారు. ఈ పోస్టులకు 1,51,192 మంది దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్కో పోస్టుకు సగటున 672 మంది పోటీపడుతున్నారు. దివ్యాంగుల కేటగిరీలో 24 పోస్టులకు 6,105 అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు 254 మంది చొప్పున పోటీపడనున్నారు. ఈసారి గ్రూప్ -1 పోస్టులుకు 51,553 మంది ప్రభుత్వ ఉద్యోగులు సైతం దరఖాస్తు చేసుకున్నారు. 

Also Read : Agnipath scheme: 'అగ్నిపథ్‌'కు రికార్డ్ స్థాయిలో దరఖాస్తులు- ఒక్క వాయుసేనలోనే 7.5 లక్షలు!

Also Read : APPSC Group 1- 2018: గ్రూప్-1 పరీక్షా ఫలితాలు విడుదల- నాలుగేళ్ల నిరీక్షణకు తెర

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం

వీడియోలు

India vs Sri Lanka 3rd T20 Highlights | మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం
Rohit Sharma Golden Duck | రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్
Virat Kohli Half Century in Vijay Hazare Trophy | 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన కింగ్
Rinku Singh Century in Vijay Hazare Trophy | విజయ్ హజారే ట్రోఫీలీ రింకూ సింగ్ సెంచరీ
Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
YSRCP Politics: ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
Year Ender 2025: ఈ ఏడాది NPS లో 5 భారీ మార్పులు.. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రూల్స్ ఇవే
ఈ ఏడాది NPS లో 5 భారీ మార్పులు.. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రూల్స్ ఇవే
Hyderabad Crime Report: హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
Kerala Gen Z political Leader: జెన్‌జీ తరం మున్సిపల్ చైర్మన్ దియా బిను - వారసురాలు కాదు.. నాయకత్వంతో ఎదిగిన లీడర్ -మనకూ స్ఫూర్తే !
జెన్‌జీ తరం మున్సిపల్ చైర్మన్ దియా బిను - వారసురాలు కాదు.. నాయకత్వంతో ఎదిగిన లీడర్ -మనకూ స్ఫూర్తే !
Embed widget