అన్వేషించండి

Telangana TET : టెట్ రాసేందుకు బీఈడీ, డీఎల్ఈడీ చివరి ఏడాది విద్యార్థులూ అర్హులే : కన్వీనర్ రాధారెడ్డి

Telangana TET : డీఎస్సీకు అవసరమైన టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. బీఈడీ, డీఎల్ఈడీ చివరి సంవత్సరం విద్యార్థులు కూడా టెట్ రాసేందుకు అవకాశం కల్పించినట్లు కన్వీనర్ రాధారెడ్డి వెల్లడించారు.

Telangana TET : తెలంగాణ టెట్ నోటిఫికేషన్(TET Notification) గురువారం విడుదల అయింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) సిలబస్ ను, ఇతర వివరాలను కన్వీనర్ రాధారెడ్డి(Radhareddy) తెలిపారు. 2017 టెట్ సిలబస్(TET Syllabus) ప్రకారమే పరీక్షలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బీఈడీ(B.Ed), డీఎల్ఈడీ(D.L.Ed) చివరి సంవత్సరం విద్యార్థులు కూడా టెట్‌ రాసేందుకు అవకాశం కల్పించామని కన్వీనర్ పేర్కొన్నారు. పేపర్‌-1 లేదా పేపర్‌-2 లేదా రెండింటికీ కలిపి రూ.300 ఫీజు నిర్ణయించినట్లు తెలిపారు. మార్చి 26 నుంచి ఏప్రిల్‌ 16వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు(Online Applications) చేసుకోవచ్చని వెల్లడించారు. జూన్‌ 12న టెట్‌ పరీక్ష నిర్వహించనున్నారు. జూన్‌ 27న టెట్ ఫలితాలు విడుదల చేయనున్నారు. టెట్‌కు సంబంధించి మార్చి 26 నుంచి హెల్ప్ డెస్క్ సేవలు ప్రారంభిస్తున్నట్లు రాధారెడ్డి తెలిపారు.

పూర్తి వివరాలకు 

ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు బోధించేవారు టెట్ పేపర్ 1(TET Paper -1) రాయాల్సి ఉంటుంది. డీఎడ్, బీఎడ్ పాసైనవారు టెట్ పేపర్ -1 రాయడానికి అర్హులు. ఆరో నుంచి ఎనిమిదో తరగతి వరకు బోధించేవారు టెట్ పేపర్-2(TET Paper-2) రాయాలి. బీఎడ్ పాసైనవారు మాత్రమే టెట్ పేపర్-2 రాయడానికి అర్హులు. టెట్ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం https://tstet.cgg.gov.in/ వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు.  

టెట్ నోటిఫికేషన్ విడుదల 

డీఎస్సీ కోసం అవసరమయ్యే టెట్‌ నోటిఫికేషన్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. మార్చి 26 నుంచి ఏప్రిల్‌ 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు దాఖలు చేసుకోవచ్చు. జూన్‌ 12 టెట్‌ నిర్వహిస్తారు. టెట్‌ కు అవసరమైన ఏర్పాట్లు చకచకా పూర్తి చేస్తున్నట్టు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. 2015డిసెంబల్‌ 23న టెట్‌కు సంబంధించిన రెండు సవరణలు చేసింది ప్రభుత్వం. బీఈడీ పూర్తి చేసిన వాళ్లు కూడా ఎస్జీటీకి అర్హమైన పేపర్‌-1 కూడా రాసుకోవచ్చని తెలిపింది. ఉద్యోగం వచ్చిన తర్వాత బ్రిడ్జ్‌ కోర్సు పూర్తి చేయాలని చెప్పింది. అది ఆరునెలలు ఉంటుంది. ఒకసారి టెట్‌లో అర్హత మార్కులు సాధిస్తే అది జీవితాంతం వర్తిస్తుందని కూడా సవరించింది. ఈ మధ్య జరిగిన శాసన సభ సమావేశాల్లో తెలంగాణ వ్యాప్తంగా 13 వేలకు పైగా ఉపాధ్యాయ ఉద్యోగాలు ఖాళీలు గుర్తించామని వాటిని భర్తీ చేస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. అప్పటి నుంచి ఉద్యోగార్థుల్లో ఆశలు చిగురించాయి. కోచింగ్ సెంటర్‌లు కిటకిటలాడటం మొదలయ్యాయి. ఇప్పుడు టెట్ నోటిఫికేషన్ రావడంతో ప్రిపరేషన్ మరింత ఊపందుకోనుంది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత టెట్‌ నిర్వహించడం ఇది మూడోసారి. 

కొత్త విధానం అమల్లోకి 

ఇప్పటి వరకు బీఈడీ చేసిన వాళ్లు ఆరు నుంచి పది తరగతుల వరకు బోధించేందుకు అర్హులగా ఉండే వాళ్లు 2008 నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చింది. అందుకే వాళ్లు రెండో పేపర్‌ మాత్రమే రాసేవాళ్లు. కానీ ఈ మధ్య కాలంలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు కూడా బీఈడీ చేసిన వాళ్లు బోధించవచ్చని నిర్ణయించింది. అంటే ఎస్జీటీ పోస్టులకు కూడా వీళ్లు అర్హులని తేల్చింది ప్రభుత్వం. దీనికి ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ అభ్యర్థులు ఆరునెలల బ్రిడ్జి కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంది. అందుకే ఇకపై మొదటి పేపర్‌ కూడా రాసేందుకు బీఈడీ చేసే వాళ్లు అర్హులు అవుతారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ippala Ravindra Reddy: లోకేష్‌ను కలిసిన సిస్కో టీమ్‌లో ఇప్పాల రవీంద్రారెడ్డి - ఉలిక్కిపడిన టీడీపీ - ఎవరీ వ్యక్తి ?
లోకేష్‌ను కలిసిన సిస్కో టీమ్‌లో ఇప్పాల రవీంద్రారెడ్డి - ఉలిక్కిపడిన టీడీపీ - ఎవరీ వ్యక్తి ?
SLBC Tunnel Rescue Updates: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ నుంచి మరో మృతదేహం వెలికితీత, నాగర్‌కర్నూల్ ఆస్పత్రికి తరలింపు
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ నుంచి మరో మృతదేహం వెలికితీత, నాగర్‌కర్నూల్ ఆస్పత్రికి తరలింపు
Telangana MLAs Case: ఎమ్మెల్యేల ఫిరాయింపులకు వార్షికోత్సవం పూర్తయిందా ? వాటిని దాటి ముందుకెళ్లలేం: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఎమ్మెల్యేల ఫిరాయింపులకు వార్షికోత్సవం పూర్తయిందా ? వాటిని దాటి ముందుకెళ్లలేం: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
AP DSC Notification: నిరుద్యోగులకు శుభవార్త, మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌‌పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
నిరుద్యోగులకు శుభవార్త, మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌‌పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KL Rahul Athiya shetty Baby Girl | పాపకు జన్మనిచ్చిన రాహుల్, అతియా శెట్టి | ABP DesamGoenka Pant KL Rahul | IPL 2025 లోనూ కొనసాగుతున్న గోయెంకా తిట్ల పురాణం | ABP DesamSanjiv Goenka Scolding Rishabh Pant | DC vs LSG మ్యాచ్ ఓడిపోగానే పంత్ కు తిట్లు | ABP DesamAshutosh Sharma 66 Runs DC vs LSG Match Highlights | అశుతోష్ శర్మ మాస్ బ్యాటింగ్ చూశారా.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ippala Ravindra Reddy: లోకేష్‌ను కలిసిన సిస్కో టీమ్‌లో ఇప్పాల రవీంద్రారెడ్డి - ఉలిక్కిపడిన టీడీపీ - ఎవరీ వ్యక్తి ?
లోకేష్‌ను కలిసిన సిస్కో టీమ్‌లో ఇప్పాల రవీంద్రారెడ్డి - ఉలిక్కిపడిన టీడీపీ - ఎవరీ వ్యక్తి ?
SLBC Tunnel Rescue Updates: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ నుంచి మరో మృతదేహం వెలికితీత, నాగర్‌కర్నూల్ ఆస్పత్రికి తరలింపు
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ నుంచి మరో మృతదేహం వెలికితీత, నాగర్‌కర్నూల్ ఆస్పత్రికి తరలింపు
Telangana MLAs Case: ఎమ్మెల్యేల ఫిరాయింపులకు వార్షికోత్సవం పూర్తయిందా ? వాటిని దాటి ముందుకెళ్లలేం: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఎమ్మెల్యేల ఫిరాయింపులకు వార్షికోత్సవం పూర్తయిందా ? వాటిని దాటి ముందుకెళ్లలేం: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
AP DSC Notification: నిరుద్యోగులకు శుభవార్త, మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌‌పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
నిరుద్యోగులకు శుభవార్త, మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌‌పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
Robinhood First Review: 'రాబిన్‌హుడ్' ఫస్ట్ రివ్యూ... ఫస్టాఫ్ కామెడీ, సెకండాఫ్ ఎమోషనల్... టాక్ ఎలా ఉందంటే?
'రాబిన్‌హుడ్' ఫస్ట్ రివ్యూ... ఫస్టాఫ్ కామెడీ, సెకండాఫ్ ఎమోషనల్... టాక్ ఎలా ఉందంటే?
Robinhood Movie: నితిన్ 'రాబిన్ హుడ్' టికెట్ ధరల పెంపు - ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన మూవీ టీం.. అసలు నిజం ఏంటో తెలుసా?
నితిన్ 'రాబిన్ హుడ్' టికెట్ ధరల పెంపు - ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన మూవీ టీం.. అసలు నిజం ఏంటో తెలుసా?
Telugu Travellar: ప్రపంచంలో ఈ 280 మంది ప్రత్యేకం  - వీరిలో మన రవి ఒకరు - ఇంతకీ ఏం చేశాడో తెలాసా ?
ప్రపంచంలో ఈ 280 మంది ప్రత్యేకం - వీరిలో మన రవి ఒకరు - ఇంతకీ ఏం చేశాడో తెలాసా ?
Rajendra Prasad: డేవిడ్ వార్నర్‌కు నటుడు రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు - ఐలవ్‌యూ డేవిడ్ వార్నర్ అంటూ..
డేవిడ్ వార్నర్‌కు నటుడు రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు - ఐలవ్‌యూ డేవిడ్ వార్నర్ అంటూ..
Embed widget