అన్వేషించండి

Group 1 Exam: 'గ్రూప్–1' పరీక్షలో ఎలాంటి అవకతవకలు జరగలేదు, వారిపై చర్యలు తప్పవన్న హైదరాబాద్ కలెక్టర్!

తెలంగాణలో అక్టోబరు 16న నిర్వహించిన 'గ్రూప్–1' ప్రిలిమ్స్ పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ వస్తోన్న ఆరోపణలను హైదరాబాద్ కలెక్టర్ డి. అమోయ్ కుమార్ కొట్టిపారేశారు. ఆ ఆరోపణల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు..

తెలంగాణలో అక్టోబరు 16న నిర్వహించిన 'గ్రూప్–1' ప్రిలిమ్స్ పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ వస్తోన్న ఆరోపణలను హైదరాబాద్ కలెక్టర్ డి. అమోయ్ కుమార్ కొట్టిపారేశారు. ఆ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు  ఆయన  ప్రకటన విడుదల చేశారు. నగరంలోని మూడు సెంటర్లలో ఇన్విజిలేటర్ల తప్పిదం వల్ల గ్రూప్–1పరీక్షను ఆలస్యంగా నిర్వహించినట్లు ఆయన తెలిపారు.

సికింద్రాబాద్ మారేడ్ పల్లిలోని సెయింట్ ఫ్రాన్సిస్ హైస్కూల్‌లో మూడు గదుల్లో మొత్తం 47 మంది అభ్యర్థులకు ఇంగ్లిష్/తెలుగు క్వశ్చన్ పేపర్‌కు బదులుగా ఇంగ్లిష్/నాన్ తెలుగు లాంగ్వేజ్ క్వశ్చన్ పేపర్‌ ఇచ్చారని తెలిపారు. దీంతో అభ్యర్థులు అయోమయానికి గురయ్యారని, అయితే వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వారికి ఇంగ్లిష్/తెలుగు క్వశ్చన్ పేపర్‌, కొత్త ఓఎంఆర్ షీట్లను ఇచ్చారని స్పష్టం చేశారు.

అయితే కొత్త ఓఎంఆర్ షీట్లలో రాస్తే తమ ప్రశ్నపత్రాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మూల్యాంకనం చేయదనే అనుమానంతో అభ్యర్థులు నిరసనకు దిగారని, అయితే కలెక్టర్‌తో పాటు కమిషన్ అధికారులు వాళ్లకు సర్ది చెప్పడంతో మధ్యాహ్నం ఒంటి గంటకు వాళ్లు తిరిగి తమ పరీక్షను కొనసాగించారని తెలిపారు. మధ్యాహ్నం 3.30 గంటలకు వాళ్ల నుంచి ఓఎంఆర్ షీట్లను తీసుకున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. 


అబిడ్స్‌లోని మరో రెండు సెంటర్లలో కూడా...

అబిడ్స్‌లోని మరో రెండు సెంటర్లలో కూడా 'గ్రూప్–1' పరీక్షను అధికారులు ఆలస్యంగా నిర్వహించారు. అబిడ్స్‌లోని స్టాన్లీ ఇంజినీరింగ్ కాలేజీలోనూ ఇంగ్లిష్/తెలుగు క్వశ్చన్ పేపర్‌‌కు బదులు ఇంగ్లిష్/నాన్ తెలుగు లాంగ్వేజ్ క్వశ్చన్ పేపర్‌ ఇవ్వడంతో పరీక్ష కొంత ఆలస్యం అయ్యింది. దీంతో  ఇద్దరికి 15 నిమిషాలు, ఐదుగురికి 30 నిమిషాల అదనపు సమయాన్ని కేటాయించినట్లు అధికారులు చెప్పారు. అలాగే అబిడ్స్‌లోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్‌లో 15 మందికి 7 నిమిషాల అదనపు సమయాన్ని పరీక్ష కోసం ఇచ్చినట్లు స్పష్టం చేశారు. అభ్యర్థులు కోల్పోయిన సమయాన్ని వారికి కేటాయించామని, అంతే తప్ప 'గ్రూప్-1' పరీక్షలో ఎలాంటి తప్పులు జరగలేదని కలెక్టర్ తెలిపారు. ఆలస్యానికి కారణమైన ఇన్విజిలేటర్లపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్  స్పష్టం చెప్పారు.


పరీక్షకు 75 శాతం హాజరు..

తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు మొత్తం 75శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 503 గ్రూప్-1 పోస్టులకు గాను.. 3.80 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్‌-1 పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 1019 పరీక్ష కేంద్రాల్ని ఏర్పాటు చేయగా.. 2,86,051 అభ్యర్థులు హాజరయ్యారు. హైదరాబాద్‌లోనే 100 వరకు ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటుచేశారు. ఎనిమిది రోజుల్లో ఓఎంఆర్ షీట్ల స్కానింగ్ ప్రక్రియ పూర్తవుతుందని, ఆ తర్వాత ప్రాథమిక కీ విడుదల చేస్తామని టీఎస్‌పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. 


కటాఫ్ మార్కులు లేవు..

తెలంగాణలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి అక్టోబరు 16న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే 'గ్రూప్-1' ప్రిలిమినరీ పరీక్ష కటాఫ్ మార్కులపై సామాజిక మాధ్యమాల్లో వార్తలు చెక్కర్లు కొట్టాయి. ఈ ప్రచారంపై టీఎస్‌పీఎస్సీ అధికారులు అక్టోబరు 17న స్పష్టత ఇచ్చారు. 'గ్రూప్-1' ప్రిలిమినరీ పరీక్ష కేవలం  స్క్రీనింగ్ పరీక్ష మాత్రమేనని, ఇందులో ఎలాంటి కనీస అర్హత మార్కులు ఉండవని ప్రకటించింది. మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపిక విధానంలో మార్పులు జరిగాయని వివరించింది. గతంలో మార్కుల ప్రాతిపదికన ఒక్కో పోస్టుకు 50 మంది అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేసే విధానం ఉండేదని పేర్కొంది. అయితే, ఈ ఏడాది ఏప్రిల్ 25న ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం.. మల్టీ జోన్ వారీగా రిజర్వేషన్ ప్రకారం ఒక్కో పోస్టుకు 50 మందిని మెయిన్స్‌కు ఎంపిక చేస్తామని టీఎస్‌పీఎస్సీ తెలిపింది.


:: Also Read ::

TSLPRB SI, Constable Result: ఎస్ఐ, కానిస్టేబుళ్ల పరీక్ష ఫలితాలు వచ్చేస్తున్నాయ్, ఎప్పుడంటే?
తెలంగాణ ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు తెలంగాణ పోలీసు నియామక మండలి ఊరటనిచ్చే వార్త తెలిపింది. ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకపోతే ఈ వారంలోనే ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే ఎస్సై, కానిస్టేబుల్ ప్రాథమిక కీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆన్సర్ కీపై అభ్యంతరాలు స్వీకరించారు. ఫైనల్‌ కీతో పాటే ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను కూడా విడుదల చేయనున్నారు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి..

RMLIMS: రామ్ మనోహర్ లోహియా మెడికల్ ఇన్‌స్టిట్యూట్‌లో టీచింగ్ పోస్టులు
లక్నోలోని రామ్ మనోహర్ లోహియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులవారీగా అర్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

 

RMLIMS: రామ్ మనోహర్ లోహియా మెడికల్ ఇన్‌స్టిట్యూట్‌లో 534 నాన్-టీచింగ్ పోస్టులు
లక్నోలోని రామ్ మనోహర్ లోహియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులవారీగా అర్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
Telangana BJP :   తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ -  కొన్ని చోట్ల  తప్పదా ?
తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ - కొన్ని చోట్ల తప్పదా ?
Allu Arjun Wax Statue: 'మైల్‌ స్టోన్‌ మూమెంట్‌' - దుబాయ్‌లో అల్లు అర్జున్‌ వ్యాక్స్‌ స్టాట్చ్యూ ఆవిష్కరణ, బన్నీ ఇంట్రెస్టింగ్ పోస్ట్‌
'మైల్‌ స్టోన్‌ మూమెంట్‌' - దుబాయ్‌లో అల్లు అర్జున్‌ వ్యాక్స్‌ స్టాట్చ్యూ ఆవిష్కరణ, బన్నీ ఇంట్రెస్టింగ్ పోస్ట్‌
Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

TDP Sankar | Srikakulam | పదవి ఉంటే ఒకమాట.. లేదంటే మరో మాట... ధర్మాన ఎప్పుడూ అంతేElections 2024 Tirupati Public Talk: తిరుపతి ఓటర్ల మదిలో ఏముంది..? ఎవరికి ఓటేస్తారు..?KTR on Phone Tapping Case | దొంగలవి ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండొచ్చు..నీకేం భయం రేవంత్..? అంటూ కేటీఆర్ ప్రశ్నHardik Pandya vs Rohit Sharma: రాజకీయాల్లోనే కాదు ఇప్పుడు ఆటల్లోనూ క్యాంపులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
Telangana BJP :   తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ -  కొన్ని చోట్ల  తప్పదా ?
తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ - కొన్ని చోట్ల తప్పదా ?
Allu Arjun Wax Statue: 'మైల్‌ స్టోన్‌ మూమెంట్‌' - దుబాయ్‌లో అల్లు అర్జున్‌ వ్యాక్స్‌ స్టాట్చ్యూ ఆవిష్కరణ, బన్నీ ఇంట్రెస్టింగ్ పోస్ట్‌
'మైల్‌ స్టోన్‌ మూమెంట్‌' - దుబాయ్‌లో అల్లు అర్జున్‌ వ్యాక్స్‌ స్టాట్చ్యూ ఆవిష్కరణ, బన్నీ ఇంట్రెస్టింగ్ పోస్ట్‌
Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
CJI: సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
Citroen Basalt: బసాల్ట్ కారును పరిచయం చేసిన సిట్రోయెన్ - ఏం డిజైన్ భయ్యా!
బసాల్ట్ కారును పరిచయం చేసిన సిట్రోయెన్ - ఏం డిజైన్ భయ్యా!
Nandyala News: జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ - ఈడీ కస్టడీ పొడిగించిన న్యాయస్థానం
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ - ఈడీ కస్టడీ పొడిగించిన న్యాయస్థానం
Embed widget