అన్వేషించండి

ఏపీలో 'MSME పార్క్'లు, మార్చినాటికి 15 లక్షల మందికి ఉపాధి!

నియోజకవర్గానికి ఒక పార్కు చొప్పున రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో 175 పార్క్‌లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోంది. ఇందులో భాగంగా మొదటి దశలో 75 పార్క్‌ల ఏర్పాటుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

ఏపీలోని నిరుద్యోగ యువతకు ఉపాధే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఆర్ధికాభివృద్దితోపాటు యువతకు ఉపాధి కోసం పెద్ద ఎత్తున లఘు, చిన్న, మద్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) పార్క్‌లను ఏర్పాటు చేయబోతోంది. నియోజకవర్గానికి ఒక పార్కు చొప్పున రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో 175 పార్క్‌లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోంది. ఇందులో భాగంగా మొదటి దశలో 75 పార్క్‌ల ఏర్పాటుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అభివృద్ది చెందిన దేశాల్లో ఎంఎస్‌ఎంఈ పార్క్‌లను అధ్యయనం చేసేందుకు త్వరలోనే పరిశ్రమల శాఖకు చెందిన నిపుణుల బృందం విదేశీ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ ఎలాంటి విధానాలు అమలుపరుస్తున్నారో పరిశీలించి, వాటిని రాష్ట్రంలో అమలుపరచేయాలని భావిస్తున్నారు. ఈ పార్క్‌ల ఏర్పాటుకు కేంద్రం నుంచి నిధుల రాబట్టేందుకు క్లస్టర్‌ ఆధారిత పరిశ్రమల పార్క్‌లను ఏర్పాటు చేయబోతున్నారు.

15 లక్షల మందికి ఉపాధి.. 
వాస్తవానికి పెద్ద సంస్థల్లోకన్నా చిన్న తరహా పరిశ్రమల్లోనే ఎక్కువ ఉపాధి కల్పన ఉంటుంది. 8 వేల కోట్లతో ఒక ఆటోమొబైల్‌ పరిశ్రమ పెడితే, పది వేల మందికి ఉపాధి లభిస్తుంది. అయితే అంతే మొత్తం పెట్టుబడి ఒక చిన్న తరహా పరిశ్రమల్లో పెడితే లక్ష మందికి ఉపాధి కల్పిస్తారని పరిశ్రమల శాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న పార్క్‌ల ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి లభించనుందని పరిశ్రమల శాఖ భావిస్తోంది. ఇప్పటికే 25 పార్క్‌ల ఏర్పాటు పూర్తయిందని, వీటిల్లోకి దాదాపు 25 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయని తెలిపింది. మార్చి నాటికి మరో 50 పార్క్‌లు పూర్తవుతాయని, వీటన్నింటి ద్వారా 15 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని పరిశ్రమల శాఖ అంచనా వేస్తోంది. పెద్ద పెద్ద పరిశ్రమలు అధికంగా మూతపడుతుండడం, లేదా ఉద్యోగులను తొలగించే ప్రక్రియ ఇప్పుడు కొనసాగుతోంది, కోవిడ్‌ తర్వాత అభివృద్ది చెందిన దేశాలన్ని చిన్న తరహా పరిశ్రమలపై దృష్టి పెట్టాయి, ఈ నేపథ్యంలోనే సిఎం జగన్మోహన్‌రెడ్డి కూడా ఎంఎస్‌ఎంఈ పార్క్‌లపై దృష్టి పెట్టారు.

చిన్న తరహా పరిశ్రమలకు ప్రాధాన్యం.. 
చిన్న తరహా పరిశ్రమలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తోన్న వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొత్తం 175 పార్క్‌లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కో పార్క్‌కు 100 నుండి 200 వందల ఎకరాల స్థలాలను కేటాయించనున్నారు. ఇందుకు సంబంధించి స్థలాలను ఎంపిక చేయాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి. ఇప్పటికే 25 పార్క్‌ల ఏర్పాటు పూర్తికాగా.. మార్చి నాటికి మరో 50 కూడా అందుబాటులోకి రానున్నాయి. మిగిలిన 100 పార్క్‌లకు సంబంధించి మార్చిలోగా భూమిని ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి. ఆ పార్క్‌ల్లో పరిశ్రమలు పెట్టే వారికి భూమి రేటు, విద్యుత్‌తోపాటు అనేక రకాల సబ్సిడీలు ఇస్తారు. అదే విధంగా ఒక్కో పార్క్‌ ఒక్కో రకమైన ఉత్పత్తులను మాత్రమే ఉత్పత్తి చేసేలా డిజైన్‌ చేయనున్నారు. దీనివల్ల క్టస్టర్‌ బేస్డ్‌ పార్క్‌లు ఏర్పడతాయి. వీటికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులను కూడా సులభంగా తీసుకురావచ్చు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్నట్లు 175 పార్క్‌లు సాకారమైతే రాష్ట్ర పారిశ్రామిక ముఖచిత్రమే మారిపోనుంది.

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి, సిబ్బంది నిర్లక్ష్యంపై భక్తుడి ఆవేదన
తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి, సిబ్బంది నిర్లక్ష్యంపై భక్తుడి ఆవేదన
PM Kisan Scheme: రైతుల ఖాతాల్లో నగదు జమ, రూ.20000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ - ఇలా చెక్ చేసుకోండి
రైతుల ఖాతాల్లో నగదు జమ, రూ.20000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ - ఇలా చెక్ చేసుకోండి
Revanth Reddy On Musi : మూసీ నిర్వాసితులకు రూ. 10 వేల కోట్లు అయినా ఇస్తాం - పేదలను అడ్డం పెట్టుకుంటున్న పెద్దలు - రేవంత్ విమర్శలు
మూసీ నిర్వాసితులకు రూ. 10 వేల కోట్లు అయినా ఇస్తాం - పేదలను అడ్డం పెట్టుకుంటున్న పెద్దలు - రేవంత్ విమర్శలు
WhatsApp New Features: ఇన్‌స్టాగ్రామ్‌ను చూసి వాట్సాప్ వాత పెట్టుకుంటుందా? - స్టేటస్‌లో రెండు కొత్త ఫీచర్లు!
ఇన్‌స్టాగ్రామ్‌ను చూసి వాట్సాప్ వాత పెట్టుకుంటుందా? - స్టేటస్‌లో రెండు కొత్త ఫీచర్లు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nirmal Man Returned from Kuwait: కువైట్‌లో గోట్‌లైఫ్ బతుకు! ఒక్క పోస్ట్‌తో సేఫ్‌గా సొంతూరికిRajendra Prasad: నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదంManchu Vishnu on Nagarjuna Issue | నాగార్జున, సమంత, నాగచైతన్య వెంటే ఉంటాం | ABP DesamUdhaynidhi Stalin on Pawan Kalyan Comments | పవన్ కళ్యాణ్ కామెంట్స్ కి ఉదయనిధి కౌంటర్లు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala News: తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి, సిబ్బంది నిర్లక్ష్యంపై భక్తుడి ఆవేదన
తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి, సిబ్బంది నిర్లక్ష్యంపై భక్తుడి ఆవేదన
PM Kisan Scheme: రైతుల ఖాతాల్లో నగదు జమ, రూ.20000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ - ఇలా చెక్ చేసుకోండి
రైతుల ఖాతాల్లో నగదు జమ, రూ.20000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ - ఇలా చెక్ చేసుకోండి
Revanth Reddy On Musi : మూసీ నిర్వాసితులకు రూ. 10 వేల కోట్లు అయినా ఇస్తాం - పేదలను అడ్డం పెట్టుకుంటున్న పెద్దలు - రేవంత్ విమర్శలు
మూసీ నిర్వాసితులకు రూ. 10 వేల కోట్లు అయినా ఇస్తాం - పేదలను అడ్డం పెట్టుకుంటున్న పెద్దలు - రేవంత్ విమర్శలు
WhatsApp New Features: ఇన్‌స్టాగ్రామ్‌ను చూసి వాట్సాప్ వాత పెట్టుకుంటుందా? - స్టేటస్‌లో రెండు కొత్త ఫీచర్లు!
ఇన్‌స్టాగ్రామ్‌ను చూసి వాట్సాప్ వాత పెట్టుకుంటుందా? - స్టేటస్‌లో రెండు కొత్త ఫీచర్లు!
OG Update: 'ఓజి' ఇండస్ట్రీ హిట్, రాసి పెట్టుకోండి... రిలీజ్‌కి ముందే హైప్ పెంచుతున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్
'ఓజి' ఇండస్ట్రీ హిట్, రాసి పెట్టుకోండి... రిలీజ్‌కి ముందే హైప్ పెంచుతున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్
World War III : మూడో ప్రపంచయుద్ధం వస్తే ఈ దేశాలు చాలా సేఫ్ - ముందే పాస్‌పోర్టులు, వీసాలు రెడీ చేసుకుంటే మంచిదేమో ?
మూడో ప్రపంచయుద్ధం వస్తే ఈ దేశాలు చాలా సేఫ్ - ముందే పాస్‌పోర్టులు, వీసాలు రెడీ చేసుకుంటే మంచిదేమో ?
Tirumala News: తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గించండి- ప్రతి భక్తుడి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి- టీటీడీకి చంద్రబాబు కీలక సూచన
తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గించండి- ప్రతి భక్తుడి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి- టీటీడీకి చంద్రబాబు కీలక సూచన
Best Budget Cars: రూ.7.5 లక్షల్లో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్ కార్లలో మామూలు పోటీ లేదుగా!
రూ.7.5 లక్షల్లో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్ కార్లలో మామూలు పోటీ లేదుగా!
Embed widget