అన్వేషించండి

నెలసరి సమయంలో పొట్ట, నడుము నొప్పి ఇబ్బంది పెడుతున్నాయా? ఈ ఆయుర్వేద చిట్కాలను పాటించండి

నెలసరి సమయంలో కొంతమంది స్త్రీలు తీవ్రమైన పొట్టనొప్పికి, నడుము నొప్పికి గురవుతారు. అలాంటి వారి కోసం ఆయుర్వేదం కొన్ని సహజ చిట్కాలు చెబుతోంది.

మహిళ జీవితంలో కీలకమైన దశ నెలసరి మొదలవడం. నెలసరి మొదలైందంటే వారి పునరుత్పత్తి వ్యవస్థ బిడ్డను కనేందుకు సిద్ధపడిందని అర్థం.సంపూర్ణ మహిళగా మారే క్రమంలో ఈ నెలసరి మొదలవడం అనేది మొదటి దశ. 11 నుంచి 15 ఏళ్ల లోపు అమ్మాయిల్లో ఎక్కువగా ఈ నెలసరి మొదలవుతుంది. కొంతమంది అమ్మాయిల్లో నెలసరి చాలా బాధాకరంగా ఉంటుంది. నడుము నొప్పి, కాళ్ళ నొప్పి, తలనొప్పి, పొట్టనొప్పి విపరీతంగా బాధిస్తాయి. అసౌకర్యంగా ఉంటుంది. అయితే అందరికీ ఇలా ఉండాలని లేదు, కొంతమందిలోనే ఈ లక్షణాలు కనిపిస్తాయి. అలాంటి వారికి సహజంగా ఆ నొప్పులను తగ్గించుకునే చిట్కాలను ఆయుర్వేదం వివరిస్తోంది. 

ఆయుర్వేదం ప్రకారం కొందరి శరీరాలు వాత తత్వాన్ని కలిగి ఉంటాయి. అలాంటి వారిలోనే అధికంగా నొప్పులు వస్తాయి. ఇక పిత్త దోషం కలిగిన వారిలో నెలసరి ముందు తర్వాత కూడా నొప్పులు వచ్చే అవకాశం ఉంది. రాత్రివేళ అధికంగా రక్తస్రావం కూడా కావచ్చు. కఫదోషము ఉంటే నొప్పి తక్కువగా ఉన్నా, తలనొప్పి, భావోద్వేగాలు అదుపు తప్పడం, గందరగోళంగా అనిపించడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవన్నీ కూడా నెలసరి సమయంలో వచ్చే ఇబ్బందులే. 

ఇలా చేయండి 
ఇలాంటి నొప్పులు బాధిస్తున్నప్పుడు ఆయుర్వేదం కొన్ని చిట్కాలు చెబుతోంది. అవేంటంటే...

1. నువ్వుల నూనెతో పొత్తికడుపు మీద సున్నితంగా మర్దన చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నెలసరి సమయంలో వచ్చే కడుపునొప్పి తగ్గే అవకాశం ఉంది. నువ్వుల నూనెలో లినోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది శరీరంలో వాపు గుణాన్ని తగ్గిస్తుంది. నొప్పిని అరికడుతుంది.

2. ప్రతి ఇంట్లో మెంతులు ఉంటాయి. రెండు స్పూన్ల మెంతులను 12 గంటల పాటు నీళ్లలో నానబెట్టి, ఆ తర్వాత ఆ నీటిని తాగేయాలి. ఇలా చేయడం వల్ల నెలసరి నొప్పులు తగ్గే  అవకాశం ఎక్కువ.

3. పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్నప్పుడు వేడి నీళ్ల కాపడాన్ని చేసుకోవడం మంచిది. వేడి నీళ్లలో శుభ్రమైన వస్త్రాన్ని ముంచి, పిండి పొత్తి కడుపు మీద పెట్టడం వల్ల గర్భాశయ కండరాలు వ్యాకోచిస్తాయి. దీనివల్ల నొప్పి తగ్గుతుంది. 

4. నెలసరి నొప్పులు వచ్చినప్పుడు ఎక్కువ మంది చేసే పని కదలకుండా ఒకే చోటుకు పరిమితమవడం. మంచం మీదే పడుకోవడం లేదా కూర్చోవడం చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల నొప్పులు పెరుగుతాయి కాని తగ్గవు. నెలసరి నొప్పులు రాకుండా ఉండాలంటే చిన్న చిన్న వ్యాయామాలు చేయాలి. కటి ప్రదేశానికి రక్తప్రసరణ పెంచే వ్యాయామాలు చేస్తే నొప్పులు తగ్గుతాయి. తేలికపాటి వ్యాయామాలు చేయడం అలవాటు చేసుకోవాలి.

5. జీలకర్రను నీళ్లలో వేసి మరిగించి వడకట్టుకొని ఆ నీళ్లు తాగినా కూడా నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.

6. శొంఠి, మిరియాల పొడి తో హెర్బల్ టీ తయారు చేసుకొని తాగినా మంచిదే. శొంఠి, మిర్యాల పొడిని నీళ్లలో వేసి మరగ కాచి వడకట్టుకొని ఆ నీళ్లను తాగేయాలి. ఇలా చేయడం వల్ల అలసట కూడా తగ్గుతుంది.

ఈ జాగ్రత్తలు తప్పవు
నెలసరి సమయంలో విపరీతమైన నొప్పులతో బాధపడేవారు తమ ఆహారంలో పంచదార, మైదా, ప్రాసెస్ చేసిన ఆహారాలను తగ్గించుకోవాలి. అలాగే బ్రెడ్డు, పాస్తా వంటివి కూడా మానేయాలి. ఉప్పు వాడకం తగ్గించాలి. కెఫిన్ ఉండే కాఫీలను తాగడం తగ్గించాలి. ప్రతి రోజూ పరగడుపున నీళ్లలో నిమ్మరసం పిండుకొని తాగడం మంచిది. నిద్ర కూడా నొప్పులను తగ్గించడానికి సహకరిస్తుంది. కాబట్టి రోజూ రాత్రి సమయంలో ఎనిమిది గంటలకు తగ్గకుండా నిద్రపోవాలి. 

Also read: చిన్న వయసులోనే గుండెపోటుతో కుప్పకూలిపోతున్న యువత - వారిలో గుండెపోటుకు కారణాలు ఇవే

టాప్ హెడ్ లైన్స్

Junk Food Ban in Schools: స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ బ్యాన్- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR విప్లవాత్మక ప్రతిపాదనలు 
స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ బ్యాన్- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR విప్లవాత్మక ప్రతిపాదనలు 
Testosterone Screening After 30: టెస్టోస్టెరాన్‌ ప్రభావం 30 ఏళ్ల తర్వాత తగ్గుతుందా? అమెరికా ఆర్మీ సైనికులకు ఎందుకు స్క్రీనింగ్ పరీక్షలు చేస్తోంది?
టెస్టోస్టెరాన్‌ ప్రభావం 30 ఏళ్ల తర్వాత తగ్గుతుందా? అమెరికా ఆర్మీ సైనికులకు ఎందుకు స్క్రీనింగ్ పరీక్షలు చేస్తోంది?
Benefits Of Walk After Dinner: రాత్రి తిన్న తర్వాత 10 నిమిషాలు నడిస్తే జరిగే మేలేంటి? ఎలా వాక్ చేస్తే మంచిది?
రాత్రి తిన్న తర్వాత 10 నిమిషాలు నడిస్తే జరిగే మేలేంటి? ఎలా వాక్ చేస్తే మంచిది?
WHO Global Cancer Report 2026:ప్రతి ఐదుగురిలో ఒకరికి క్యాన్సర్‌ ముప్పు! ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన రిపోర్ట్‌!
ప్రతి ఐదుగురిలో ఒకరికి క్యాన్సర్‌ ముప్పు! ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన రిపోర్ట్‌!

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Direct Elections: ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Rahul Gandhi Delhi NEET Protest: ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
IND vs ZIM 1st T20 Result Update: శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
Minster Lokesh: అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Land Dispute Selfie Suicide Attempt: కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
Embed widget