అన్వేషించండి

Myopia In Children: ప్రతి ముగ్గురు పిల్లల్లో ఒకరికి మయోపియా- 2050 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 74 కోట్ల మందిలో ఈ సమస్య

Short-Sightedness: ప్రపంచవ్యాప్తంగా చిన్నారుల్లో ప్రతి ముగ్గురిలో ఒకరికి షార్ట్ సైటెడ్‌నెస్ సమస్య ఉందని ఆప్థమాలజీ నివేదిక వెల్లడించింది. 2050 నాటికి ఈ సమస్యతో బాధపడే పిల్లల సంఖ్య 74 కోట్లకు చేరనుంది.

Eye Sight Increased in Children: షార్ట్ సైటెడ్‌ నెస్ అన్నది కాస్త దూరంగా ఉన్న వస్తువులను చూడడంలో ఎదురయ్యే ఇబ్బంది. దీనిని మయోపియా అని కూడా అంటారు.ఈ సమస్యతో నేడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పిల్లల్లో ప్రతి ముగ్గురులో ఒకరు ఇబ్బంది పడుతున్నారు. 1990ల నుంచి ఈ సమస్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. డిజిటల్ ఏజ్‌లో ఈ సమస్య ఎక్కువైందని చైనా పరిశోధకులు తెలిపారు. 2050 నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఈ మయోపియాతో 74 కోట్ల మంది చిన్నారులు బాధపడతారని  పరిశోధకులు హెచ్చరించారు.

1990ల తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎక్కువైన మయోపియా కేసులు:

            కంటి చూపు సమస్యల్లో చాలా కామన్ సమస్యల్లో ఒకటి షార్ట్ సైటెడ్‌ నెస్‌ లేదా మయోపియా. ఈ జబ్బుకు సంబంధించి 2023 జూన్ వరకు ప్రచురితమైన 276 సర్వేల్లోని వివిధ స్టాటిస్టిక్స్‌ను చైనాలోని సున్‌ యాట్‌-సెన్ యూనివర్శిటీ పరిశోధకులు పరిశీలించారు. వారి పరిశీలన ప్రకారం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పిల్లలు లేదా టీనేజీ వాళ్లలో ప్రతి ముగ్గురిలో ఒకరు ఈ మయోపియాతో బాధ పడుతున్నారని తెలిపారు. ఈ మేరకు బ్రిటీష్ జర్నల్‌ ఆఫ్ ఆప్థమాలజీలో వారి పరిశోధన పత్రాలు ప్రచురితం అయ్యాయి. బాల్యంలో మొదలయ్యే ఈ మయోపియా వ్యాధి క్రమంగా పెరిగి ఆ తర్వాత కంటిచూపు పూర్తిగా కోల్పోయే రిస్క్ కూడా ఉంది. చైనా పరిశోధకులు దాదాపు 54 లక్షల మందికి సంబంధించిన స్టాటిస్టిక్స్‌ను పరిగణనలోకి తీసుకొని ఈ పరిశోధన చేశారు. ఈ 54 లక్షల మందిలో ఆసియా, ఆఫ్రికా కాంటినెంట్స్ నుండి దాదాపు 50 దేశాలకు చెందిన వారు ఉన్నారు. వీరిలో 5 నుంచి 19 ఏళ్ల మధ్య షార్ట్ సైటెడ్‌ నెస్ ఎదుర్కొంటున్న వాళ్లు దాదాపు 19 లక్షల మంది ఉన్నారు.

డిజిటల్ యుగంలో స్క్రీన్‌టైం పెరిగి తగ్గిన ఆటపాటలు:

1990ల నుంచి 2000 సంవత్సరం వరకు ఈ మయోపియా కేసుల్లో 24 శాతం పెరుగుదల కనిపించగా.. 2001 నుంచి 2010 మధ్యలో 25 శాతం… ఆ తర్వాత పదేళ్లలో అంటే 2020 నాటికి 30 శాతం పెరుగుదల కనిపించింది. 2020 నుంచి 2023 నాటికి ప్రపంచ వ్యాప్తంగా చిన్నారుల్లో మయోపియా కేసులలో వృద్ధి 36 శాతం ఉన్నట్లు చైనా పరిశోధకులు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా పిల్లల్లో ఈ మయోపియో కేసుల వృద్ధి స్థిరంగా పెరుగుతుందే కానీ తగ్గుముఖం పట్టలేదని చెప్పారు. డిజిటల్ యుగంలో చిన్నారులు ఆటలపై కాకుండా స్క్రీన్ టైమ్ పెరగడమే ఈ సమస్యకు కారణమని వివరించారు. చిన్నారులను వీలైనంతగా ఫిజికల్‌ యాక్టివిటీస్‌పై దృష్టి పెట్టేలా చేయాలని సూచించారు.

1990 నుంచి 2023 మధ్య స్టాటిస్టిక్స్‌ను పరిశీలించినప్పుడు అభివృద్ధి చెందిన దేశాల్లో పిల్లల కంటే.. అప్పుడే అభివృద్ధి చెందుతున్న లేదా పేద దేశాల్లోనే ఈ సమస్య ఎక్కువగా కనిపించిందన్నారు. తూర్పు ఆసియా దేశాల్లో పట్టణాలు నగరాల్లో ఉన్న వారి కంటే గ్రామాల్లో ఉన్న వారికే మయోపియా సమస్య ఎక్కువగా ఉందని తేలింది. హైస్కూల్‌ విద్యార్థుల్లో ఎక్కువ శాతం ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపింది. తూర్పు ఆసియా దేశాల్లో డిజిటల్ మాధ్యమాల ద్వారా జరుగుతున్న విద్యా బోధన కూడా ఓ సమస్యగా పేర్కొన్నారు. తూర్పు ఆసియా దేశాలతో పోల్చితే ఆఫ్రికా దేశాల్లో ఈ సమస్య కాస్త తక్కువగా ఉన్నట్లు చైనా పరిశోధకులు స్పష్టం చేశారు. ఇంకా చెప్పాలంటే అబ్బాయిల కంటే అమ్మాయిల్లోనే ఎక్కువగా ఈ సమస్య ఉందని చెప్పారు. మగ పిల్లలు బయటకు వెళ్లి ఆటలు ఆడతారని, అమ్మాయిలు ఇంట్లోనే ఉండిపోవడం వల్ల స్క్రీన్‌ టైం పెరిగి ఈ సమస్య వస్తున్నట్లు తెలిపారు.

2023 నుంచి 2050 మధ్య కాలంలో మయోపియా పెరుగుదల శాతం 9 గా అంచనా వేసినప్పటికీ 74 కోట్లా 59 లక్షలా 2 వేల మంది ఈ సమస్యతో బాధపడే చిన్నారులు ప్రపంచ వ్యాప్తంగా ఉంటారని పేర్కొన్నారు. తల్లిదండ్రులు, ప్రభుత్వ వ్యవస్థలు చిన్నారుల్లో ఫిజికల్ యాక్టివిటీస్ పెంచడంపై దృష్టి సారించాలని స్పష్టం చేశారు.

Also Read: Sadistic Personality Disorder : ఆ జబ్బు ఉన్నవాళ్లకి మనిషిని చంపి ముక్కలుగా కోస్తుంటే చాలా ఆనందంగా ఉంటుందట.. షాకింగ్ విషయాలు ఇవే 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

GV Reddy Effect: జీవీ రెడ్డి రాజీనామా ఎఫెక్ట్‌- ఏపీ ఫైబర్‌ నెట్‌ ఎండీ దినేష్‌ బదిలీ
జీవీ రెడ్డి రాజీనామా ఎఫెక్ట్‌- ఏపీ ఫైబర్‌ నెట్‌ ఎండీ దినేష్‌ బదిలీ
SLBC Tunnel : SLBC నిర్మాణంలో ఆది నుంచి నిర్లక్ష్యమే, పాలకుల తప్పునకు కార్మికులకు శిక్ష!
SLBC నిర్మాణంలో ఆది నుంచి నిర్లక్ష్యమే, పాలకుల తప్పునకు కార్మికులకు శిక్ష!
GV Reddy Resign: టీడీపీకి షాకిచ్చిన జీవీ రెడ్డి - పార్టీకి, పదవికి రాజీనామా - ఫైబర్ నెట్ వివాదంలో ఏం జరిగింది
టీడీపీకి షాకిచ్చిన జీవీ రెడ్డి - పార్టీకి, పదవికి రాజీనామా - ఫైబర్ నెట్ వివాదంలో ఏం జరిగింది
Good news for AP Mirchi farmers: మిర్చి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ - కనీస ధర రూ. 11,781కి కొనుగోలు చేయాలని నిర్ణయం
మిర్చి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ - కనీస ధర రూ. 11,781కి కొనుగోలు చేయాలని నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Minister Narayana Team in Maha Kumbh 2025 | పుష్కరాల కోసం మహాకుంభమేళాలో అధ్యయనం | ABP DesamGV Reddy Resign AP Fibernet Chairman | ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవికి జీవీరెడ్డి రాజీనామా | ABP DesamBJP MLC Candidate Anji Reddy Interview | కిషన్ రెడ్డి ప్రచారం చేసేంత ప్రాధాన్యత అంజిరెడ్డికి ఎందుకు?Tesla Company for Andhra Pradesh | ఎలన్ మస్క్ కార్ల కంపెనీ ఆంధ్ర ప్రదేశ్ కు వస్తోందా.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GV Reddy Effect: జీవీ రెడ్డి రాజీనామా ఎఫెక్ట్‌- ఏపీ ఫైబర్‌ నెట్‌ ఎండీ దినేష్‌ బదిలీ
జీవీ రెడ్డి రాజీనామా ఎఫెక్ట్‌- ఏపీ ఫైబర్‌ నెట్‌ ఎండీ దినేష్‌ బదిలీ
SLBC Tunnel : SLBC నిర్మాణంలో ఆది నుంచి నిర్లక్ష్యమే, పాలకుల తప్పునకు కార్మికులకు శిక్ష!
SLBC నిర్మాణంలో ఆది నుంచి నిర్లక్ష్యమే, పాలకుల తప్పునకు కార్మికులకు శిక్ష!
GV Reddy Resign: టీడీపీకి షాకిచ్చిన జీవీ రెడ్డి - పార్టీకి, పదవికి రాజీనామా - ఫైబర్ నెట్ వివాదంలో ఏం జరిగింది
టీడీపీకి షాకిచ్చిన జీవీ రెడ్డి - పార్టీకి, పదవికి రాజీనామా - ఫైబర్ నెట్ వివాదంలో ఏం జరిగింది
Good news for AP Mirchi farmers: మిర్చి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ - కనీస ధర రూ. 11,781కి కొనుగోలు చేయాలని నిర్ణయం
మిర్చి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ - కనీస ధర రూ. 11,781కి కొనుగోలు చేయాలని నిర్ణయం
India In Semi Final: సెమీస్ లో ఇండియా, న్యూజిలాండ్.. బంగ్లా ప‌రాజ‌యంతో ఇరుజ ట్లు నాకౌట్ కు.. టోర్నీ నుంచి పాక్, బంగ్లా ఔట్
సెమీస్ లో ఇండియా, న్యూజిలాండ్.. బంగ్లా ప‌రాజ‌యంతో ఇరు జట్లు నాకౌట్ కు.. టోర్నీ నుంచి పాక్, బంగ్లా ఔట్
Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి మరిన్ని చిక్కులు - గన్నవరంలో చేసిన అక్రమాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం నియామకం
వల్లభనేని వంశీకి మరిన్ని చిక్కులు - గన్నవరంలో చేసిన అక్రమాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం నియామకం
Revanth Reddy Hot Comments: మెట్రో విస్తరణ, మూసి అభివృద్ధి అడ్డుకుంది కిషన్‌రెడ్డేనని కేంద్రమంత్రులే చెప్పారు: రేవంత్ సంచలన ఆరోపణలు
మెట్రో విస్తరణ, మూసి అభివృద్ధి అడ్డుకుంది కిషన్‌రెడ్డేనని కేంద్రమంత్రులే చెప్పారు: రేవంత్ సంచలన ఆరోపణలు
YS Jagan: మరో 30 ఏళ్లు రాజకీయాలు చేస్తా - పార్టీ నేతలకు జగన్  భరోసా
మరో 30 ఏళ్లు రాజకీయాలు చేస్తా - పార్టీ నేతలకు జగన్ భరోసా
Embed widget