అన్వేషించండి

Orange: ఒత్తిడిగా, ఆందోళనగా ఉంటే నాలుగు నారింజ తొనలు నోట్లో వేసుకోండి

ఒత్తిడిగా ఆందోళనగా అనిపిస్తున్నప్పుడు స్థిరంగా ఉండడం కష్టం. అప్పుడు ఆందోళన తగ్గించే ఆహారంపై దృష్టి పెట్టాలి.

ఆధునిక కాలంలో మానసిక ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితం అవుతుంది. ఎంతో మందిలో ఒత్తిడి, ఆందోళన పెరిగిపోతున్నాయి. వీటిని తగ్గించే ఆహారాలను, వ్యాయామాలను చేయడం ద్వారా మానసిక స్థితిని మెరుగుపరచుకోవచ్చు. నారింజ పండ్లు మానసిక ఆరోగ్యం పై చాలా ప్రభావాన్ని చూపిస్తాయి అని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. తియ్యగా, పుల్ల పుల్లగా ఉండే నారింజను తినడం వల్ల వెంటనే మానసిక స్థితి మారుతుందని, ఆందోళన తగ్గుతుందని చెబుతున్నారు. 

నారింజ పండ్లను తినడం వల్ల సహజంగానే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీనిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు వంటి ముఖ్యమైన పోషకాలు నిండుగా ఉంటాయి. ఇవి కణాల పునరుత్పత్తిని మెరుగుపరుస్తాయి. అలాగే జలుబు, ఫ్లూ వంటి రోగాలకు వ్యతిరేకంగా పనిచేస్తాయి. ఈ పండులో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది పొట్ట ఆరోగ్యాన్ని కాపాడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అందుకే నారింజను రోజూ తినమని సిఫారసు చేస్తారు వైద్యులు.

నారింజ పండులోని పోషకాలు మెదడు ఆరోగ్యాన్ని కాపాడతాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఒత్తిడి స్థిరంగా కలగడం వల్ల, ఆందోళన రావడం వల్ల శరీరంలో కార్టిసాల్ స్థాయిలు పెరుగుతాయి. ఇది శరీరంలోని ముఖ్యమైన జీవక్రియల పనితీరును మారుస్తాయి. దీనివల్ల బరువు పెరగడం, తలనొప్పి రావడం, హై బీపీ, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వంటివి జరుగుతాయి. కాబట్టి ఒత్తిడి, ఆందోళన తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. రోజూ నారింజ పండ్లను తీసుకోవడం వల్ల శారీరకంగానే కాదు మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. 

నారింజ ఎలా సహాయపడుతుంది?
నారింజ తొక్కను చిదిమి వాసన చూడండి, దాన్నుంచి సిట్రస్ ఫ్లేవర్ వస్తుంది. ఆ వాసన  పీల్చుతుంటేనే ఏదో తెలియని అనుభూతి. ఈ సిట్రస్ ఫ్లేవర్ స్వచ్ఛమైన గాలిలో కలిసి తక్షణమే మానసిక స్థితిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అలాగే సెరోటోనిన్ స్థాయిలను పెంచడం ద్వారా సహజంగా ఒత్తిడి, ఆందోళన తగ్గించడానికి ప్రయత్నిస్తుంది.  తాజా నారింజపండును రోజూ తినడం వల్ల మెదడు కణాలు పునరుత్పత్తి మెరుగ్గా జరుగుతుంది. ఇది జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంతో పాటు అల్జీమర్స్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది. కాబట్టి మీకు తీవ్రమైన ఒత్తిడి లేదా ఆందోళన అనిపిస్తున్నప్పుడు నారింజపండును తినడం లేదా నారింజపండు రసాన్ని తాగడం ద్వారా కార్టిసాల్ స్థాయిలను తగ్గించుకోవచ్చు. ఆనంద హార్మోనైన సెరిటోనిన్ స్ఠాయిలను పెంచుకోవచ్చు.  నారింజ తినడం వల్ల చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. చర్మం కాంతివంతంగా మారి అందాన్ని పెంచుతుంది. రోజుకో నారింజ పండు తింటే చాలు చర్మ సౌందర్యం రెట్టింపు అవుతుంది.

Also read: జుట్టు అధికంగా రాలిపోతుందా? దానికి కారణాలు ఇవే, ఈ నూనెలు వాడితే బెటర్

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

టాప్ హెడ్ లైన్స్

Managing Diabetes : డయాబెటిస్ మందులతో మాత్రమే కాదు.. ఈ అలవాట్లు కూడా పాటిస్తేనే షుగర్ అదుపులో ఉంటుందట, డాక్టర్ల సూచనలు ఇవే
డయాబెటిస్ మందులతో మాత్రమే కాదు.. ఈ అలవాట్లు కూడా పాటిస్తేనే షుగర్ అదుపులో ఉంటుందట, డాక్టర్ల సూచనలు ఇవే
Dog Cancer Detection: క్యాన్సర్‌ను గుర్తించే ఒక కొత్త పద్ధతి! కుక్కలు వాసన పసిగట్టి నిర్దారించే విధానంపై క్లినికల్ ట్రయల్స్‌ 
క్యాన్సర్‌ను గుర్తించే ఒక కొత్త పద్ధతి! కుక్కలు వాసన పసిగట్టి నిర్దారించే విధానంపై క్లినికల్ ట్రయల్స్‌ 
Kidney Health : కిడ్నీలను డీటాక్స్ చేసి ఆరోగ్యంగా ఉంచే డ్రింక్స్.. నీటి తర్వాత ఇవే బెస్ట్
కిడ్నీలను డీటాక్స్ చేసి ఆరోగ్యంగా ఉంచే డ్రింక్స్.. నీటి తర్వాత ఇవే బెస్ట్
Diabetes and Dengue : మధుమేహం(Type 2 Diabetes) ఉన్నవారికి డెంగ్యూ వస్తే ప్రమాదమా? ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి
మధుమేహం(Type 2 Diabetes) ఉన్నవారికి డెంగ్యూ వస్తే ప్రమాదమా? ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget