అన్వేషించండి

ఈ ఫుడ్స్​ తీసుకుంటే డెంగ్యూ నుంచి త్వరగా బయటపడతారు

డెంగ్యూ నుంచి త్వరగా కోలుకునేందుకు మీరు మీ ఆహారంలో కొన్ని చేర్చుకోవచ్చు. అవి మీరు త్వరగా రికవరీ అయ్యేలా హెల్ప్ చేస్తాయి.

దేశంలో డెంగ్యూ కేసుల సంఖ్య పెరుగుతూ పోతుంది. ఇది సోకిందంటే మనలోని రోగనిరోధక శక్తి బలహీన పడిపోతుంది. రక్తనాళాలు దెబ్బతిని.. ప్లేట్​లెట్స్ సంఖ్య ఘోరంగా తగ్గిపోతుంది. ఈ జ్వరం వచ్చిన మూడు రోజుల తర్వాత దాని లక్షణాలు మనకి కనిపించడం ప్రారంభమవుతాయి. అవి వారం నుంచి పది రోజుల వరకు ఉంటాయి. అధిక జ్వరం.. భరించలేని తలనొప్పి, కళ్లు నొప్పి, బాడీ పెయిన్స్, అలసట, వికారం, వాంతులు, అతిసారం, స్కిన్ అలెర్జీ వంటి లక్షణాలు బాధితుల్లో కనిపిస్తాయి. కొందరికి అతి తక్కువ జ్వరం, ఫ్లూవంటి లక్షణాలు కనిపిస్తాయి.

మరికొందరికి స్ట్రోక్, ఇంటర్నల్ బ్లీడింగ్, కాలేయ సమస్యలు, అవయవ వైఫల్యం జరుగుతుంది. రక్తనాళాలు దెబ్బతిని భారీ రక్తస్రావమై.. వ్యక్తి మరిణించే అవకాశం కూడా ఉంది. దీనినే డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అంటారు. అయితే మీరు డెంగ్యూ వ్యాధి బారిన పడినా.. మీరు కొన్ని చిట్కాలు పాటించగలిగితే త్వరగా రికవరీ అవుతారు. ముందుగా వైద్యుని సంప్రదించాలి. వారు అందిచే కోర్సులు పాటించాలి. అంతేకాకుండా మీరు ఇంట్లో కూడా కొన్ని ఆహారాలు రెగ్యూలర్​గా తీసుకుంటే మీరు త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. 

కొబ్బరి నీళ్లు

కొబ్బరి నీళ్లు పూర్తిగా ఎలక్ట్రోలైట్​లతో నిండి ఉంటుంది. ఇది మిమ్మల్ని డీహైడ్రేషన్​ నుంచి కాపాడుతుంది. శరీరం కోల్పోయిన పోషకాలు, లవణాలను తిరిగి శరీరానికి అందిస్తుంది. కాబట్టి మీరు సిక్​ అయినా.. దీనిని తీసుకోవడం వల్ల త్వరగా కోలుకునే అవకాశముంది. ఇది మిమ్మల్ని రోజంతా శక్తివంతంగా ఉంచుతుంది. 

ఈ సమయంలో మీరు రోజుకు రెండు గ్లాసుల తాజా కొబ్బరి నీరు తాగితే ఆరోగ్యానికి మంచిది. ఇది మీ శరీరం నుంచి టాక్సిన్లను కూడా తొలగిస్తుంది. తద్వారా ఇన్​ఫెక్షన్​ త్వరగా బయటకు పోతుంది. 

బొప్పాయి ఆకులు..

డెంగ్యూతో బాధపడే వారు త్వరగా కోలుకోవడానికి బొప్పాయి ఆకులు తప్పనిసరిగా తమ డైట్​లో చేర్చుకోవాలి. సాధారణంగా బొప్పాయి జ్వర లక్షణాలు తగ్గిస్తుంది. అయితే డెంగ్యూలో మాత్రం పచ్చి బొప్పాయి, బొప్పాయి ఆకులు మరింత ముఖ్యపాత్ర పోషిస్తాయి. 

ఎందుకంటే ఇవి శరీరంలో ప్లేట్​లెట్ కౌంట్​ను పెంచడంలో సహాయపడతాయి. అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. కాబట్టి మీరు బొప్పాయిలను బాగా శుభ్రం చేసి.. తాజా రసాన్ని తయారు చేసి.. రోజుకు ఒకటి లేదా రెండు సార్లు తాగాలి. ఇది తాగేముందు మీరు వైద్యుని సలహా కచ్చితంగా తీసుకోండి. 

తిప్ప తీగ రసం

తిప్ప తీగరసం పూర్తిగా యాంటీపైరేటిక్ లక్షణాలతో నిండి ఉంటుంది. ఇది డెంగ్యూ జ్వరాన్ని తగ్గించడంలో సహాయం చేస్తుంది. ఆ వ్యాధి లక్షణాలు తగ్గించి.. రోగనిరోధశక్తిని పెంచుతుంది. ఈ గ్రీన్ హెర్బల్ ప్లేట్​లెట్​ కౌంట్ పెంచడంలో కూడా ముఖ్యపాత్ర పోషిస్తుంది. డెంగ్యూ నుంచి కోలుకునే సమయంలో మరింత ఉపయోగకరంగా ఉంటుంది. 

తిప్పతీగ రసం చేయడానికి.. రెండు తిప్పతీగలను తీసుకుని.. బాగా కడిగి నీళ్లలో ఉడకబెట్టాలి. ఆ రసాన్ని ప్రతి రెండు రెండుసార్లు తాగాలి. గోరువెచ్చగా ఈ రసం తాగితే మీకు చాలా రిలీఫ్ ఉంటుంది. 

సిట్రస్ పండ్లు..

నారింజ, దానిమ్మ పండ్లు రెండూ పూర్తిగా అనేక విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉంటాయి. కాబట్టి ఇవి మీరు డెంగ్యూ నుంచి కోలుకోవడానికి సహాయం చేస్తాయి. వీటిలో నీటి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది మిమ్మల్ని హైడ్రేట్​గా ఉంచడంలో సహాయం చేస్తుంది. 
ఈ పండ్లలోని విటమిన్ సి కంటెంట్.. మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా దానిమ్మ మీ ప్లేట్​ లెట్​ కౌంట్​ను మెరుగుపరుస్తుంది. ఈ రెండూ అలసటను తగ్గించి.. శరీరంలో ఆక్సీకరణను తగ్గిస్తాయి. 

హెర్బల్ టీ

హెర్బల్ టీ కూడా డెంగ్యూ వ్యాధి తగ్గించడంలో సహాయం చేస్తుంది. ఇది మీ శరీరాన్ని హైడ్రేట్ చేస్తూ.. పోషణ అందిస్తుంది. దీనికోసం మీరు పుదీనా ఆకులు, ఏలకులు, అల్లం, దాల్చిన చెక్క వేసి ఈ టీని తయారు చేసుకోవచ్చు. ఇవి గొంతునొప్పి, జలుబు, ముక్కు కారటం, జ్వరం లక్షణాలనుంచి ఉపశమనం అందిస్తాయి. అంతేకాకుండా మీరు బాగా నిద్రపోవడానికి సహాయం చేస్తాయి. 

ఇవన్నీ డెంగ్యూ నుంచి మీరు త్వరగా కోలుకునేలా చేస్తాయి. అయితే మీరు వీటిని వినియోగించే ముందు కచ్చితంగా వైద్యుని సలహా తీసుకోండి. 

Also Read : సీజనల్ వ్యాధులు దరిచేరకూడదంటే ఇవి తినాలి.. ఎందుకంటే?

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. బరిలో 10 జట్లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. బరిలో 10 జట్లు
Stampedes in Railway Stations: రైల్వేస్టేషన్​లో తొక్కిసలాట ఇదే మొదటిసారి కాదు.. గతంలో ఎన్నో విషాదాలు!
రైల్వేస్టేషన్​లో తొక్కిసలాట ఇదే మొదటిసారి కాదు.. గతంలో ఎన్నో విషాదాలు!
Sai Pallavi: 'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
Jayalalitha Assets: 1.2 కిలోల వడ్డానం, 1.5 కిలోల ఖడ్గం.. చెన్నైకి చేరిన జయలలిత 27 కిలోల బంగారం
1.2 కిలోల వడ్డానం, 1.5 కిలోల ఖడ్గం.. చెన్నైకి చేరిన జయలలిత 27 కిలోల బంగారం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MLC Elections ఏపి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెడుతున్న ఆధారాలు చూపిన శ్రీరాజ్Deputy CM Pawan Kalyan South India Temples Full Video | పవన్ తిరిగిన దక్షిణాది ఆలయాలు ఇవే | ABPDy CM Pawan Kalyan మురుగన్ ఆలయంలో ప్రత్యేక పూజలు | Tamil Nadu | ABP DesamKiran Royal Laxmi Comments On Pawan Kalyan | కిరణ్ రాయల్ వెనుక పవన్ ! | ABP DESAM

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. బరిలో 10 జట్లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. బరిలో 10 జట్లు
Stampedes in Railway Stations: రైల్వేస్టేషన్​లో తొక్కిసలాట ఇదే మొదటిసారి కాదు.. గతంలో ఎన్నో విషాదాలు!
రైల్వేస్టేషన్​లో తొక్కిసలాట ఇదే మొదటిసారి కాదు.. గతంలో ఎన్నో విషాదాలు!
Sai Pallavi: 'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
Jayalalitha Assets: 1.2 కిలోల వడ్డానం, 1.5 కిలోల ఖడ్గం.. చెన్నైకి చేరిన జయలలిత 27 కిలోల బంగారం
1.2 కిలోల వడ్డానం, 1.5 కిలోల ఖడ్గం.. చెన్నైకి చేరిన జయలలిత 27 కిలోల బంగారం
Yashasvi Jaiswal:  ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా ప్లేయర్ దూరం.. గాయం కారణంగా స్వదేశంలో..
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా ప్లేయర్ దూరం.. గాయం కారణంగా స్వదేశంలో..
New Delhi Railway Station Stampede: ఢిల్లీలో తొక్కిసలాటపై రైల్వే శాఖ కీలక నిర్ణయం, విచారణ కమిటీ ఏర్పాటు
ఢిల్లీ రైల్వేస్టేషన్లో తొక్కిసలాటపై రైల్వే శాఖ కీలక నిర్ణయం, విచారణ కమిటీ ఏర్పాటు
Satya Kumar: ‘ఇలాంటి సినిమాలు సమాజానికి మంచివి కాదు’.. మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యలు
‘ఇలాంటి సినిమాలు సమాజానికి మంచివి కాదు’.. మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యలు
Sirpur Politics: తగ్గేదేలే- సిర్పూర్ లో ఆసక్తికరంగా మారుతున్న కోనప్ప రాజకీయం..!
తగ్గేదేలే- సిర్పూర్ లో ఆసక్తికరంగా మారుతున్న కోనప్ప రాజకీయం..!
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.