అన్వేషించండి

Fact Check: యోగి సర్కార్‌పై కోపంతో మహిళలు గుండు గీయించుకున్నారా? అసలు సంగతి ఇది

Fact Check: యోగి సర్కార్‌పై వ్యతిరేకతతో కొంత మంది మహిళలు గుండు గీయించుకున్నారంటూ ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది.

Fact Check: బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2024లో జరిగిన ఒక నిరసనలో కొంత మంది మహిళలు బీజేపీ ప్రభుత్వంపై తమ వ్యతిరేకతను వ్యక్తం చేయడానికి గుండు చేయించుకున్నారు అని చెప్తూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). అలాగే, ఇలాంటి నిరసన జరగడం దేశంలో ఇదే తొలిసారి అని కూడా క్లెయిమ్ చేస్తున్నారు. ఈ వీడియోలో కొందరు మహిళలు, పురుషులు రోడ్డుపై గుండు చేయించుకోవడం, ఒక మహిళ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గురించి మాట్లాడడం మనం చూడవచ్చు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

Fact Check: యోగి సర్కార్‌పై కోపంతో మహిళలు గుండు గీయించుకున్నారా? అసలు సంగతి ఇది

ఈ పోస్ట్‌ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2024లో జరిగిన ఒక నిరసనలో కొంత మంది మహిళలు బీజేపీ ప్రభుత్వంపై తమ వ్యతిరేకతను వ్యక్తం చేయడానికి గుండు చేయించుకుంటున్న దృశ్యాలు. దేశంలోనే ఇలాంటి నిరసన జరగడం ఇదే తొలిసారి.

ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలు 25 జూలై 2018న ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో తమ సేవలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది శిక్షా మిత్రలు (తాత్కాలిక టీచర్లు) పురుషులు, మహిళలతో సహా గుండు చేయించుకుని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించిన నిరసన ప్రదర్శనకి సంబంధించినవి. అలాగే, ఇలాంటి నిరసన ప్రదర్శన జరగడం దేశంలో ఇదే తొలిసారి కాదు. ఈ నిరసనకు ముందు కూడా జనవరి 2018లో మధ్యప్రదేశ్‌లో, 2017లో అస్సాంలో కూడా కొంత మంది మహిళలు గుండు చేయించుకుని నిరసన తెలిపారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఈ వీడియోలో మనం ఒక మహిళ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గురించి, శిక్షా మిత్ర(టీచర్ల) సమస్యల గురించి మాట్లాడడం మనం చూడవచ్చు. దీని ఆధారంగా ఈ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, వైరల్ వీడియోలోని గుండు చేయించుకుంటున్న మహిళ దృశ్యాలతో కూడిన పలు రిపోర్ట్స్ లభించాయి (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ రిపోర్ట్స్ ప్రకారం, 25 జూలై 2018న ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ఎకో గార్డెన్‌లో తమ సేవలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది శిక్షా మిత్రలు (తాత్కాలిక టీచర్లు) పురుషులు, మహిళలతో సహా గుండు చేయించుకుని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు.

Fact Check: యోగి సర్కార్‌పై కోపంతో మహిళలు గుండు గీయించుకున్నారా? అసలు సంగతి ఇది

‘ఇండియా టుడే’ (India Today) రిపోర్ట్ ప్రకారం, 25 జూలై 2018న లక్నోలో ఉత్తరప్రదేశ్‌లోని తాత్కాలిక ఉపాధ్యాయులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన గత నిరసనలలో ప్రాణాలు కోల్పోయిన ఉపాధ్యాయుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం తమ సర్వీసులను క్రమబద్ధీకరించాలని, ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో ఉత్తీర్ణులైన వారికి వెంటనే నియామక పత్రాలు జారీ చేయాలని, తమ సేవలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ శిక్షా మిత్రలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ నిరసనలో భాగంగా వందలాది మంది పురుషులు, మహిళ శిక్షా మిత్రలు గుండు చేయించుకుని తమ నిరసన వ్యక్తం చేశారు.

ఉత్తరప్రదేశ్  రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాలల్లో బోధించే 1.73 లక్షల మంది తాత్కాలిక ఉపాధ్యాయులును 2014లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది. 2015లో, అలహాబాద్ హైకోర్టు వీరి సర్వీసులను క్రమబద్ధీకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యను చట్టవిరుద్ధమని ప్రకటించింది. అలాగే 2017లో, సుప్రీంకోర్టు వీరి నియామకాన్ని రద్దు చేసింది, టెట్ క్లియర్ చేస్తే తప్ప వారి కాంట్రాక్టు ఉద్యోగాలను ప్రభుత్వ ఉద్యోగాలుగా మార్చబోమని ప్రకటించింది. సుప్రీంకోర్టు తీర్పుతో కాంట్రాక్టు ఉపాధ్యాయుల వేతనాన్ని రూ.38,848 నుంచి రూ.3,500కు తగ్గించారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం శిక్షా మిత్రలు(కాంట్రాక్టు ఉపాధ్యాయుల) వేతనాన్ని రూ.3,500 నుంచి రూ.10,000కు పెంచింది.

Fact Check: యోగి సర్కార్‌పై కోపంతో మహిళలు గుండు గీయించుకున్నారా? అసలు సంగతి ఇది

అలాగే, ఇలాంటి నిరసన ప్రదర్శన జరగడం దేశంలో ఇదే తొలిసారా? అని ఇంటర్నెట్‌లో వెతకగా, ఈ 2018 ఉత్తరప్రదేశ్ కాంట్రాక్టు ఉపాధ్యాయుల నిరసనలో మహిళలు గుండు చేయించుకుని నిరసన తెలపడం కన్నా ముందు కూడా ఇలాంటి పలు నిరసన ప్రదర్శనలు జరిగినట్లు తెలసింది. 2017లో అస్సాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలో ముగ్గురు మహిళలు గుండు చేయించుకుని నిరసన తెలిపారు. అలాగే జనవరి 2018లో మధ్యప్రదేశ్ కాంట్రాక్టు ఉపాధ్యాయులు, విద్యా శాఖ తమను రెగ్యులర్ ఉపాధ్యాయులగా గుర్తించాలని కోరతూ పలువురు ఉపాధ్యాయులతో పాటు నలుగురు మహిళ ఉపాధ్యాయులు కూడా గుండు చేయించుకుని నిరసన తెలిపారు.

చివరగా, 2018లో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలో కొందరు మహిళలు గుండు చేయించుకుంటున్న వీడియోను ఇటీవల జరిగిన సంఘటనగా షేర్ చేస్తున్నారు.

This story was originally published by factly.in, as part of the Shakti Collective. Except for the headline/excerpt/opening introduction para, this story has not been edited by ABP Desam staff.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
Kasthuri Shankar: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
Kasthuri Shankar: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Revanth Reddy: చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
KCR News: కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
Modi Speech: రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
Embed widget