అన్వేషించండి

Trinayani August 8th: త్రినయని సీరియల్: గాయత్రి కి ఏం జరుగుతుందోనన్న భయంలో విశాల్, కాళ్లు జారి కింద పడ్డ తిలోత్తమా?

తిలోత్తమా గాయత్రి వల్ల కాళ్లు జారి కింద పడటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

Trinayani August 8th: విశాల్ జాతకంలో ఏదో సమస్య ఉందని నయని ఆ సమస్య గురించి తెలుసుకోవటానికి గురువు చెప్పినట్లు కొన్ని పనులు చేస్తుంది. ఇక విశాల్ చాట పట్టుకొని నిలబడి ఉండగా  గురువు దీపం పట్టుకొని నిలబడతాడు. ఇక సుమన ను  వచ్చి అందులో ఏం రాసి ఉందో చదవమని అంటారు.  దాంతో సుమనకు అందులో విశాల్ రక్తం త్యాగం చేయవలసి వస్తుందని అంతేకాకుండా రూపం మారాల్సి వస్తుందని ఉండటంతో అది పైకి చదవడం వల్ల అందరూ షాక్ అవుతారు.

వెంటనే హాసిని అక్కడ ఏమీ లేదు అలా ఎలా చదివావు అని ఆశ్చర్యపడటంతో.. అప్పుడే దీపం పోవడం వల్ల అక్షరాలు కూడా కనిపించకుండా పోతాయి. దీంతో సుమన అక్కడ ఏం రాసిందో నేను అదే చదివాను మీరు కూడా చూడండి అనడంతో అక్కడ సుమనకు కూడా అక్షరాలు కనిపించవు. ఇక దీపం పోయినందుకు అక్షరాలు కనిపించవు అని గురువు అంటాడు. ఇక విశాల్  కు ఏం జరుగుతుందో అని నయని టెన్షన్ పడుతూ ఉంటుంది.

ఆయనకు ఏమైనా అవుతే పిల్లలు ఏమవుతారు అని బాధపడుతుంది. దానితో గురువు.. పిల్లల వల్ల ఆయనకు ఏమైనా జరగవచ్చు అని అనడంతో అందరూ మరింత షాక్ అవుతారు. ఇక గురువు నయనికి ధైర్యం చెబుతాడు. ఆ తర్వాత నయని విశాల్ దగ్గరికి వెళ్ళగా ఏం జరుగుతుందో అని నయని అక్కడికి వచ్చి బాధపడుతూ ఉంటుంది. దాంతో ఆయన ఏమి కాదని  పిల్లల కోసం తను ప్రాణాలు కూడా త్యాగం చేస్తానని అంటాడు.

ఇక నయని గాయత్రి జోగయ్య శాస్త్రి మనవరాలు.. తను నీ కన్న కూతురు కాదు కాబట్టి తనకి ఏమి జరగదు. అయితే గానవికి ఏదైనా జరుగుతుందేమో అని టెన్షన్ పడుతుంది. ఇక విశాల్ మాత్రం తన మనసులో గాయత్రి కి ఏమైనా జరుగుతుందేమో అని భయపడుతూ ఉంటాడు. అలా ఇద్దరు కాసేపు ఈ విషయం గురించి మాట్లాడుకుంటూ బాధపడుతూ ఉంటారు.

ఇక పావనమూర్తి పిల్లలను ఆడిపిస్తూ ఉండగా అప్పుడే అక్కడికి తిలోత్తమా, వల్లభ వస్తారు. ఇక పావన మూర్తి వాష్ రూమ్ కి వెళ్తున్నాను అని పిల్లల్ని చూసుకోమని చెబుతాడు. తిలోత్తమా వెంటనే పిల్లలను జాలిగా చూడాలి అని వల్లభతో అంటుంది. ఇక వల్లభ దేని గురించి మాట్లాడుతున్నావ్ అనటంతో.. గాయత్రికి అమ్మానాన్నలు లేరు కాబట్టి ఇక్కడికి వచ్చి వారిని కుబేర్లుగా చేసిందని.. ఈ తల్లిదండ్రులను కూడా చంపేయాలి అని అనటంతో వల్లభ షాక్ అవుతాడు.

ఇక గాయత్రి వారి మాటలు వింటూ అక్కడున్న కొబ్బరి నూనె మూత తీసి నూనె మొత్తం నేలమీద పారేస్తుంది. ఈ తల్లి కొడుకులిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటుండగా విశాల్ రావడానికి గమనించి పిల్లలతో సరదాగా ఆడుకోవాలి అని ప్లాన్ చేస్తారు. దీంతో తిలోత్తమా గాయత్రి దగ్గరికి వెళ్తుండగా వెంటనే విశాల్.. చూసి అమ్మ గాయత్రిని పట్టుకుంటే షాక్ వస్తుంది అని.. ఆపడానికి వెళ్తుండగా అదే సమయంలో నూనె మీద కాలు వేసి తిలోత్తమా, వల్లభ కాలు జారి కింద పడతారు.

వెంటనే ఇంట్లో వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తారు. ఇక వారికి దెబ్బ గట్టిగా తగలడంతో బాగా నొప్పితో ఇబ్బంది పడుతూ ఉంటారు. తిలోత్తమా కు మాత్రం చాలా గట్టిగా దెబ్బ తగులుతుంది. ఇక గాయత్రి చేతిలో నూనె ఉండటంతో గాయత్రి పని అని అందరు తనపై విరుచుకుపడుతుంటారు. వెంటనే నయని దంపతులు, విక్రాంత్ పిల్లలకు ఏమీ తెలియదు అంటూ వాళ్ళని వెనకేసుకొస్తూ ఉంటారు.

ఇక తిలోత్తమా నొప్పితో చాలా బాధపడుతూ గాయత్రి వైపు చూసి బాగా తిట్టుకుంటుంది. ఆ తర్వాత తనను హాస్పిటల్ కు తీసుకొని వెళ్తారు. ఇక ఆ తర్వాత సుమన తను డెలివరీ అయ్యేది మరో 10 రోజులు మాత్రమే అని అద్దంపై రాసుకుంటూ ఉండగా విక్రాంత్ అక్కడికి వచ్చి వెటకారం చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు. సుమన మాత్రం ఆస్తి కోసమే బిడ్డను కంటున్నట్లుగా తెగ ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక ఈ పది రోజులు తనకు మంచిగా రెస్ట్ ఇవ్వమని.. ఆ తర్వాత పురిటి నొప్పులతో బాధపడాలి అని అంటుంది.

also read it : Guppedantha Manasu August 7th: 'గుప్పెడంత మనసు' సీరియల్ - రిషిని చంపటానికి ప్రయత్నించిన రౌడీలు.. కోపంతో రగిలిపోతున్న శైలేంద్ర?

 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Tata tiago On EMI Finance Plan: మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Embed widget