అన్వేషించండి

Trinayani Serial Today September 2nd: 'త్రినయని' సీరియల్: పేపర్ల కాఫీలు విసిరిన గాయత్రీ పాపని చూసేసిన నయని.. ఇప్పటికైనా తొలిబిడ్డ అని కనిపెడుతుందా!

Trinayani Today Episode పెట్టెలో ఉన్న పేపర్ల జిరాక్స్‌లు గాయత్రీ పాప మేడ మీద నుంచి విసరడం నయని వాటిని చూడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Serial Today Episode గాయత్రీ దేవి ఫోటో దగ్గరకు తిలోత్తమ వచ్చి నీ కొడుకుకు గాయం అవుతుందని అందుకు మందు కూడా నువ్వే దాచిపెట్టి అవి నీ కొడుకుకు చేరాలని అమ్మవారికి కోరుకున్నావ్ అలాగే అవి చేరుకున్నాయ్ కూడా అని అంటుంది. ఇప్పుడు అవి మాయం అయ్యాయని అంటుంది. కర్టెన్స్ ఊగుతున్నాయని వల్లభ భయపడతాడు. 

తిలోత్తమ: రేయ్ భయపడకు కన్నకొడుకు విశాల్‌కి నయం అయిన వరకు మనల్ని ఏం చేయదు. నీడను చూసి పెద్దమ్మ అని వల్లభ అరుస్తాడు. తీరా చూస్తే అది పెద్ద బొట్టమ్మ.
పెద్దబొట్టమ్మ: మీరు ఎవరితో మాట్లాడుతున్నారా అని చూడ్డానికి వచ్చానమ్మా.
హాసిని: ఇక్కడెవరూ లేరుగా 
వల్లభ: అమ్మ పెద్దమ్మతో మాట్లాడుతుంది.
నయని: అమ్మగారు వస్తే నాకు కనిపిస్తారు కదా.
తిలోత్తమ: గాయత్రీ అక్క ఫొటోతో మాట్లాడుతున్నా.
విశాల్: ఫొటోనా అమ్మ వచ్చిందేమో తనతో మాట్లాడుతున్నారేమో అని సంతోషపడ్డానమ్మా.
తిలోత్తమ: పెట్టెలో పేపర్లు గాయత్రీ అక్కయ్యే తీసిందని నా అనుమానం ఎక్కడ పెట్టిందో చెప్పమని అడగడానికి వచ్చాను.
సుమన: ఏమైంది అత్తయ్యా మీకు ఫొటోతో మాట్లాడితే పేపర్లు వస్తాయా
నయని: సరదాగా మాట్లాడుతున్నాం కానీ పేపర్లు తీసినోళ్లు మన మధ్యే ఉన్నారని అనుకుంటున్నాను. అందరి ఎదురుగా ఒప్పుకోవడానికి ఇబ్బందిగా ఉంటే ఉదయం సోఫాలో పేపర్లు పెట్టేయండి.
సుమన: అబ్బబ్బా ఇలా అయితే మీరు తీయలేదని మేం అనుకోవాలి అనే కదా.
హాసిని: మేమే తీసి మేమే ఎందుకు అడుగుతాం చిట్టీ.
సుమన: చెప్పలేం అక్క మమల్ని దారి మళ్లించడానికి ఇలా చేయొచ్చు.
విశాల్: సుమన పొరపడుతున్నారు ఆ పేపర్లు కోసం నయని ఎంత వెతికిందో మీకు తెలీదు.

పెద్దబొట్టమ్మ, వల్లభలు కూడా మేం కూడా వెతికాం అని అంటారు. ఎందుకు మీరు వెతికారని అందరూ అడిగితే నయనికి సాయం చేయడానికి అని అంటారు. ఇంతలో గాయత్రీ పాప ఆ పేపర్లను ఓ బుట్టలో వేసుకొని లాక్కోని మేడ మీద నుంచి కిందకి విసురుతుంది. అందరూ షాక్ అవుతారు. విశాల్ గాయత్రీ పాపని చూసి కంగారు పడతాడు. చాలా పేపర్లు కింద పడటంతో అందరూ అక్కడున్నవి ఎన్ని ఎక్కడ ఉన్నవి ఎన్ని అని అనుకుంటారు. నయని కూడా చాటుగా వెళ్లి మీద ఎవరు ఉన్నారా అని చూస్తుంది. నయని కూడా గాయత్రీ పాపని చూస్తుంది. గాయత్రీ పాపా అని ఆశ్చర్యపడుతుంది. ఇక తిలోత్తమ మీద ఎవరు ఉన్నారా చూడమని వల్లభని పంపుతుంది. వల్లభ వెళ్లే సరికి గాయత్రీ పాప అక్కడి నుంచి వెళ్లిపోతుంది. వల్లభ కిందకి వచ్చి ఎవరూ లేరని చెప్తాడు. గాయత్రీ దేవి ఇలా చేసిందని తిలోత్తమ అంటుంది. గాయత్రీ దేవి కనిపించారా అని తిలోత్తమ అడుగుతుంది. లేదని నయని చెప్తుంది. 

పెద్దబొట్టమ్మ: ఇన్ని పేపర్లు కింద పడినా లాభం లేదు. ఇవన్నీ నకలు పత్రాలు అసలు పత్రాలు ఉంటేనే మానసాదేవి ఆలయం దగ్గరకు వెళ్లగలం. 

విశాల్ నడవడానికి ఇబ్బంది పడితే హాసిని తీసుకొచ్చి జాగ్రత్తగా చూసుకోమని నయనికి చెప్పి ఎక్కడికి వెళ్లినా నయని సాయం తీసుకోమని అంటుంది. పేపర్లు గురించి మాట్లాడుకుంటారు. పేపర్లను గాయత్రీ పాప పడేయడం తాను చూశానని నయని చెప్తుంది. విశాల్, హాసిని షాక్ అవుతారు. గాయత్రీ పాప పేపర్లు ఎలా తీసుంటుందని నయని అనుమానం వ్యక్తం చేస్తుంది. ఇంతలో విశాల్ చేయి నొప్పి అని నయనిని డైవర్ట్ చేస్తాడు. ఇక గదిలో సుమన తనని తాను అందంగా పొగుడు కొని భర్తని వలలో వేయడానికి ప్రయత్నిస్తుంది . విక్రాంత్ సుమనను కోప్పడతాడు దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.  

Also Read: 'త్రినయని' సీరియల్: పేపర్లు మాయం.. విశాల్‌కి మరణం తప్పదా.. ఆ మాటల అర్థం ఏంటి?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telugu TV Movies Today: ఈ ఆదివారం (మార్చి 22) టీవీలలో అదిరిపోయే సినిమాలున్నాయ్... లిస్ట్ ఇదే, డోంట్ మిస్
ఈ ఆదివారం (మార్చి 22) టీవీలలో అదిరిపోయే సినిమాలున్నాయ్... లిస్ట్ ఇదే, డోంట్ మిస్
Kalavari kodalu kanaka mahalakshmi serial March 21st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: యమునని చంపడానికి స్వామీజీలా వచ్చిన భుజంగం! విషం తినిపించేశాడుగా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: యమునని చంపడానికి స్వామీజీలా వచ్చిన భుజంగం! విషం తినిపించేశాడుగా!
Nindu Noorella Saavasam Serial Today march 21st:‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమ్మును ఇంట్లోంచి పంపిచేస్తున్న అమర్‌ - బాధలో ముగ్గురు పిల్లలు
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమ్మును ఇంట్లోంచి పంపిచేస్తున్న అమర్‌ - బాధలో ముగ్గురు పిల్లలు
Brahmamudi Serial Today march 21st: ‘బ్రహ్మముడి’ సీరియల్: రేఖను మెచ్చుకున్న భ్రమరాంబ – సుభాష్‌ను కాపాడుకున్న ఇందు
‘బ్రహ్మముడి’ సీరియల్: రేఖను మెచ్చుకున్న భ్రమరాంబ – సుభాష్‌ను కాపాడుకున్న ఇందు

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Dhurandhar 2 : ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
Embed widget