అన్వేషించండి

Trinayani Serial Today April 2nd: 'త్రినయని' సీరియల్: గాయత్రీదేవి జాడ కోసం పిండి పూజ.. సుమన బిడ్డను నాగలోకం తీసుకెళ్లిపోతానన్న పెద్దబొట్టమ్మ!

Trinayani Serial Today Episode గాయత్రీ దేవి జాడ తెలుసుకునేందుకు నయని ఇంట్లో విశాలాక్షి బియ్యం పిండితో పూజ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Today Episode పెద్దబొట్టమ్మ, నయని, హాసిని, డమ్మక్కలు కిచెన్‌లో మాట్లాడుకుంటారు. సుమన ఉలూచి కన్న తల్లి అని పెద్దబొట్టమ్మ మీద ప్రమాణం వేయడంతో ప్రాణాల మీదకు తెచ్చుకున్న పెద్దబొట్టమ్మ దెయ్యంలా సుమనను భయపెడుతుంది. ఇక పెద్దబొట్టమ్మ నయని ఇంట్లోనే ఉలూచి కన్నతల్లిలా ఉండిపోతా అంటుంది. 

డమ్మక్క: అది జరిగే పనేనా.. 
హాసిని: మేమంతా ఇళ్లు ఖాళీ చేసి నువ్వు నాగయ్య ఉలూచి ఇక్కడే కాపురం చేయాలి. అప్పుడు దీన్ని విల్లా అనరు. పాముల పుట్ట అంటారు.
పెద్దబొట్టమ్మ: ఇక్కడ ఉండం హాసిని ఉలూచిని తీసుకొని నాగలోకం వెళ్లిపోతాం.
డమ్మక్క: ఒక్కసారి అక్కడికి వెళ్లారు అంటే తిరిగి రావడం చాలా కష్టం.
నయని: వద్దు పెద్దమ్మ పాపని సుమనకు దూరం చేయొద్దు.
పెద్దబొట్టమ్మ: నా భర్తను నన్ను వేరు దూరం చేయాలి అనుకున్న ఆ సుమనపై నేను ఎందుకు జాలి పడాలి. నిజానికి విరుచుకుపడి కాటేసి వెళ్లిపోవాలి. ఉలూచిని పెంచే తల్లి లేకుండా పోతుంది అని వదిలేశాను. సుమనకు భయపడి నా బిడ్డను ఆరు నెలలకు ఒకసారి వచ్చి చూడమంటారా. నయని నీ మంచితనం వల్లే సుమన ఇంకా బతికి ఉంది. లేదంటే ఎప్పుడో చంపేసేదాన్ని. ఈ సారి వదలను.
హాసిని: చెల్లి వెళ్లిపోయింది.
డమ్మక్క: మళ్లీ వస్తుంది. కానీ ఈ సారి జాగ్రత్తగా ఉండాలి.
 
వల్లభ ఒక్కడే అఖండ స్వామి దగ్గరకు వస్తాడు. తిలోత్తమ రాలేదు కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి అనకుంటాడు వల్లభ. ఇక అఖండ స్వామి తన దివ్య దృష్టితో చూసి మీ ఇంట్లో పూజ జరుగుతుందని వల్లభతో చెప్తాడు. ఇక వల్లభకు అఖండ స్వామి బియ్యం పిండి ఇచ్చి ఇంటికి తీసుకెళ్లమంటాడు. ఈ పిండి వల్ల గాయత్రీ దేవికి సంబంధించిన సమాధానం లభిస్తుందని చెప్తారు. 

ఇంట్లో అందరూ పూజకు ఏర్పాట్లు చేస్తుంటారు. ఈ పూజ వల్ల నీ తొలి బిడ్డ జాడ తెలుస్తుంది అని ఎద్దులయ్య నయనితో చెప్తాడు. దీంతో హాసిని విశాల్‌తో ఈ పూజ జరగకుండా ఆపేద్దామా అని అడుగుతుంది. నయనికి తెలిస్తే గోల అవుతుంది అని విశాల్ అంటాడు. ఇక హాసిని ఈ పూజ నేనే ఆపేస్తా అని రంగంలోకి దిగుతుంది. 

సుమన: మొత్తానికి గాయత్రీ అత్తయ్య జాడ తెలుస్తుంది అన్న ఆనందం మా అక్క ముఖంలో తెలుస్తుంది కానీ మా బావగారే కిమ్మనకుండా ఉన్నారు. 
విక్రాంత్: బ్రో తన ఆనందాన్ని ఎలా చెప్పాలో తెలీక లోపలే ఉబ్బితబ్బిబైపోతున్నారు అనుకుంటా.
విశాల్: అవును..
 
మరోవైపు విశాలాక్షి చేస్తున్న ఈ పూజను ఆపేయాలి అనుకున్న హాసిని బియ్యం పిండిని పారబోసేస్తుంది. ఖాళీ డబ్బా తీసుకొని వచ్చి హాసిని బియ్యం పిండి ఖాళీ అయిపోయింది అంటుంది. ఇంతలో అఖండ స్వామి ఇచ్చిన పిండిని వల్లభ తీసుకొని వస్తాడు. పిండి ఎవరు తీసుకురమ్మన్నారు అని వల్లభని అందరూ ప్రశ్నిస్తారు. దీంతో సుమన నేనే చెప్పాను అని తన మీద వేసుకొని కవర్ చేస్తుంది.  

ఇక విశాలాక్షి బియ్యం పిండితో మూడు ముద్దలు చేయమని నయనికి చెప్తుంది. చేశాక ఒకటి తులసి దగ్గర పెడతారు. మరొకటి సుమన పట్టుకుంటుంది. మూడో ముద్ద రోటిలో వేసి అందులో పాలు పోసి చెరకు గడలతో దంచితే పాలతో తడిసిన పిండి గాయత్రీ దేవి జాడ తెలిసిన వారిమీద పడుతుంది అని విశాలాక్షి చెప్తుంది. విశాల్, హాసిని, పావనా మూర్తిలు కంగారు పడతారు. 

విక్రాంత్: అంటే దీని అర్థం ఏంటి.
ఎద్దులయ్య: తేలిక బాబు. ఆ గాయత్రీ తల్లి గురించి తెలిసిన వారు ఇక్కడే ఉన్నారు అని.

ఇక మూడో బియ్యం పిండి ముద్దను రోటిలో వేయగానే పాలు పోసి చెరకుతో విశాలాక్షి దంచుతుంది. ఇక పాల చుక్కలు పడాలి కాబట్టి కొంచెం దగ్గరగా రండి అని సుమన పిలుస్తుంది. దీంతో పావనా మూర్తి ఇప్పుడు ఎంత దూరం ఉంటే అంత మంచిది అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: సుమ కనకాల: యాంకర్ సుమ మంచి మనసు - 100 పడకల వృద్ధాశ్రమం నిర్మాణం, అండగా ఉంటానంటూ హామీ!

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 11th: పోలీసుస్టేషన్‌లో గణపతిపై ఎటాక్‌ చేయించిన మీనన్....అడ్డుకుని కాపాడిన జేడీ, కేడీ
జగద్ధాత్రి సీరియల్: పోలీసుస్టేషన్‌లో గణపతిపై ఎటాక్‌ చేయించిన మీనన్....అడ్డుకుని కాపాడిన జేడీ, కేడీ
Godavari Serial Today August 11th: 'గోదావరి' సీరియల్: సింహాద్రికి ఎదురు తిరిగి వార్నింగ్ ఇచ్చిన సూర్య! మేనమామకి మూడినట్లేనా!
'గోదావరి' సీరియల్: సింహాద్రికి ఎదురు తిరిగి వార్నింగ్ ఇచ్చిన సూర్య! మేనమామకి మూడినట్లేనా!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 11th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్రను లాగిపెట్టి కొట్టిన విహారి.. మెడపట్టి గెంటేస్తా అనడానికి కారణమేంటి? కళ్లు తెరిచిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్రను లాగిపెట్టి కొట్టిన విహారి.. మెడపట్టి గెంటేస్తా అనడానికి కారణమేంటి? కళ్లు తెరిచిన లక్ష్మీ!
Nindu Manasulu Serial Today August 11th: నిండు మనసులు: గణ, ప్రేరణలే సిద్ధూకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ట్విస్ట్ ఇచ్చిన విజయానంద్! ప్రేరణకు అత్త సపోర్ట్!
నిండు మనసులు: గణ, ప్రేరణలే సిద్ధూకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ట్విస్ట్ ఇచ్చిన విజయానంద్! ప్రేరణకు అత్త సపోర్ట్!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget