![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Madhuranagarilo June 26th: రౌడీలను చితక్కొట్టిన కాలనీ వాసులు, రాధ గురించి షాకింగ్ నిజం తెలుసుకున్న శ్యామ్?
సంయుక్త రాధ దగ్గరికి రౌడీలను పంపించి తనను కాలనీ నుండి గెంటెయ్యమని చెప్పటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
![Madhuranagarilo June 26th: రౌడీలను చితక్కొట్టిన కాలనీ వాసులు, రాధ గురించి షాకింగ్ నిజం తెలుసుకున్న శ్యామ్? Shyam Learns shocking truth about radha in Madhuranagarilo June 26th serial episode Madhuranagarilo June 26th: రౌడీలను చితక్కొట్టిన కాలనీ వాసులు, రాధ గురించి షాకింగ్ నిజం తెలుసుకున్న శ్యామ్?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/26/e63d81536b01c9ba7516f54be5861b4f1687761658897768_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Madhuranagarilo June 26th: శ్యామ్ అందులో ఒక చీటీ తీయమని రాధకు చెప్పటంతో రాధ ఆ చీటీ తీస్తుంది. అందులో పెళ్ళికొడుకుతో డాన్స్ చేయాలి అని ఉండటంతో అందరూ డాన్స్ చేయాలి అని అంటారు. అది చూసి సంయుక్త వాళ్లు కోపంతో రగిలిపోతారు. ఇక శ్యామ్ తన మనసులో రాదుతో డాన్స్ చేయాలన్న కోరిక తీరబోతుందని.. కావాలనే అన్ని చీటీలలో అలా రాసాను అని అనుకుంటాడు.
ఆ తర్వాత వారిద్దరూ డాన్స్ చేస్తుండగా అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ సంయుక్త వాళ్లకు బాగా మండుతుంది. సీన్ కట్ చేస్తే గన్నవరం తాగి రావటంతో వాసంతి బాగా కొడుతుంది. ఇక ఆ దృశ్యాన్ని గోపాల్ వాళ్ళు చూసి వీడియో తీస్తుంటారు. ఇక మరోవైపు సంయుక్త తన తల్లితో కలిసి ఇద్దరు రౌడీలను రాధ ఇంటికి పంపిస్తారు.
ఇక రాధ తెల్లారేసరికి ఇంటి నుండి పారిపోవాలి అని అనుకుంటారు. ఇక ఇద్దరు రౌడీలు రాధ ఇంట్లోకి వెళ్ళగా.. నిద్రలో ఉన్న రాధ సౌండ్ రావడంతో బయటికి వస్తుంది. వెంటనే ఆ రౌడీలు రాధను పట్టుకొని మాకు లొంగిపోతేనే మంచిది లేదంటే చంపేస్తాము అంటూ బెదిరిస్తారు. ఇక వెంటనే పండు పరిగెత్తుకొని వచ్చి మమ్మీ అని అరుస్తూ భయపడతాడు.
ఇక వాళ్లను వదలమని అంటున్న కూడా వాళ్ళు వినిపించుకోరు. వెంటనే పండు శ్యామ్ ఇంటికి బయలుదేరగా.. అక్కడ మధుర దంపతులు డోర్ తీసి ఏమైంది అని కంగారుగా అడిగినా కూడా పండు వినిపించుకోకుండా శ్యామ్ శ్యామ్ అని అరుస్తూ ఇంట్లోకి వెళ్తాడు. ఇక శ్యామ్ ని ఎంత లేపిన కూడా మత్తు వల్ల శ్యామ్ తొందరగా లేవలేక పోతాడు.
ఆ తర్వాత శ్యామ్ ని లేపి అమ్మని రౌడీలు కొడుతున్నారని చెప్పటంతో వెంటనే శ్యామ్ రాధ ఇంటికి బయలుదేరి రౌడీలను చితక్కొడతాడు. అప్పుడే మధుర దంపతులు వచ్చి రాధని దగ్గరకు తీసుకుంటారు. ఇక మధుర భర్త కానీ అంత వినిపించేలా అలారం కొట్టడంతో అందరు రాధా ఇంటికి వచ్చి ఆ రౌడీలను చితక్కొట్టారు.
ఆ తర్వాత రాధను తమ ఇంటికి తీసుకెళ్లి అక్కడే పడుకోమని చెబుతారు. ఏం టెన్షన్ పడకు అని ధైర్యం ఇస్తుంటారు. శ్యామ్ వారిని తన గదిలో పడుకోమని చెప్పి వాళ్లని తీసుకెళ్లి అక్కడ ధైర్యం చెప్పి కిందికి వెళ్తాడు. ఇక రాధ నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాయి భాగంలో రాధ, మధురవాళ్ళు కలిసి గుడికి వెళ్తారు. అక్కడ స్వామీజీ రాధను కల్యాణ ప్రాప్తిరస్తు అని దీవించడంతో వెంటనే రాధ శ్యామ్ ను చూసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇక శ్యామ్ వచ్చి ఆ స్వామీజీతో.. ఆవిడకు పెళ్ళై ఒక బాబు ఉన్నాడు అలా ఎలా దీవించారు అని అడగటంతో తనకు పెళ్లి కాలేదు అని నిజం చెబుతాడు. దాంతో శ్యామ్ షాక్ అవుతాడు.
Also Read: Prema Entha Madhuram June 26th: కోర్టు మెట్లెక్కిన వర్ధన్ ఫ్యామిలీ.. అందరికీ పెద్ద షాకిచ్చిన మాన్సీ?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)