Podharillu Serial Today March 20th:చక్రి, మహా విడాకులు తీసుకోవాలనుకుంటున్న విషయం ఇంట్లో తెలిసిపోయిందా...? చక్రిని కేశవ్ ఎందుకు నిలదీశాడు...?
Podharillu Serial Today Episode March 20th: ఫోన్ కొట్టేయాలని ప్రయత్నించిన శైలూకు కేశవ్ ఎలాంటి ఝలక్ ఇచ్చాడు..? మహాను కలిసి గాయత్రి ఏం చెప్పింది..?

Podharillu Serial Today Episode: మాధవ్ బాధగా ఉండటం చూసి మహాలక్ష్మీ అతన్ని ప్రస్నిస్తుంది. గాయత్రి పెళ్లి చేసుకుని వెళ్లిపోతుందని నువ్వు బాధపడుతున్నావా పెద్ది అని అంటుంది. జరగనిదాని గురించి నేను ఎప్పుడూ ఆలోచించనని...కాబట్టి నాకు ఎలాంటి బాధ లేదని అంటాడు.మరి ఎందుకు ఇలా ఉన్నావని మహా నిలదీస్తుంది. నీకు గాయత్రి అంటే ఇష్టం లేదా అని అడుగుతుంది. చిన్నప్పటి నుంచి గాయత్రిని చూస్తూ పెరిగానని....తనే భార్య అని అనుకున్నానని...అలాంటప్పుడు బాధ లేకుండా ఎలా ఉంటుందని మాధవ్ అంటాడు. కానీ విధి మమ్మల్ని విడదీసిందని అంటాడు.తను ఎక్కడ ఉన్నా సుఖంగా ఉండాలని కోరుకుంటాను తప్ప....మరి ఎలాంటి ఆలోచన లేదని చెప్పి వెళ్లిపోతాడు.
అటు కేశవ్ ఝలక్ ఇచ్చేసరికి శైలూ ఉసూరుమంటూ వస్తుంది. ఏం జరిగిందని కీర్తి ఆమెను అడుగుతుంది. ఆ ముంగిసగాడి చేతిలో మళ్లీ మోసపోయానని అంటుంది. పైగా నాతో వాడు 1200 బిల్లు కట్టించాడని చెబుతుంది. నా ఫోన్ నాచేతికి వచ్చినట్లే వచ్చి మళ్లీ చేజారిపోయిందని ఏడుస్తూ చెబుతుంది.అలా ఎలా జరిగిందని కీర్తి అడుగుతుంది. మనం వేసిన ప్లాన్ వాడికి ఎలా తెలిసిపోయిందని కీర్తి అనగా...ఇదిగో ఇలా తెలిసిపోయిందంటూ కేశవ్ స్కూటీ రిపేర్ చేస్తూ చెబుతాడు.అంటే మేం మాట్లాడుకున్న మాటలన్నీ విన్నావా అని కీర్తి అంటుంది. అన్నీ వినేశాని...అందుకే తగిన రీతిలో బుద్ధి చెప్పానని అంటాడు.
మహాకు ఫోన్ చేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చినందుకు సంతోషంగా చక్రి కానిస్టేబుల్కు సెల్ఫోన్ బహుమతిగా తీసుకొచ్చి ఇస్తాడు.మీ దయవల్ల ఇప్పట్లో నా భార్య విడాకుల ఊసు ఎత్తదని చెబుతాడు. నేను ఫోన్ చేసిన విషయం నీకు చెప్పిందా అని కానిస్టేబుల్ అడగ్గా....మీరు గట్టిగా వార్నింగ్ ఇచ్చారని కూడా చెబుతాడు.అసలు మీరు ఎందుకు నాకు హెల్ఫ్ చేస్తున్నారని చక్రి అడగ్గా....నేను కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నానని అందుకే ఇలాంటి హెల్ఫ్ చేస్తుంటానని చెబుతాడు. అతనికి థ్యాంక్స్ చెప్పి చక్రి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అయితే చక్రి కలిసి లాయర్ బైక్ రిపేర్ రావడంతో అతను కేశవ్ మెకానిక్ షాప్కు వస్తాడు.అక్కడ చక్రి మీ అన్నయ్యేనా అని అడుగుతాడు.అవునని కేశవ్ చెప్పడంతో....రెండు నెలలక్రితం పెళ్లి చేసుకుని అప్పుడే విడాకుల కోసం నా దగ్గరకు ఎందుకు వచ్చారని అడుగుతాడు. మీ అన్నయ్యకు విడాకులు ఇవ్వడం ఇష్టం లేనట్లు ఉందని...కానీ మీ వదిన మాత్రం విడాకులు కోసం పట్టుబడుతోందని చెబుతాడు. ఆ మాటలు విన్న చక్రి షాక్ తింటాడు. కోపంగా ఇంటికి వెళ్లిపోతాడు.
చక్రిని చేయిపట్టుకుని లాక్కొచ్చి.....మొన్న నువ్వు, వదిన ఎక్కడికి వెళ్లారని నిలదీస్తాడు. సరదాగా బయటకు వెళ్లామని చెప్పడంతో...అదంతా అబద్ధమని మీరు లాయర్ను కలిశారా లేదా అని నిలదీస్తాడు. ఆ మాటలకు మాధవ్, కన్నాకు ఏం అర్థం కాదు. వీళ్లిద్దరూ లాయర్ను కలిసి విడాకులు తీసుకోవాలనుకున్నట్లు చెప్పారని కేశవ్ చెబుతాడు. ఆ మాటలకు కన్నాకు ఏం అర్థంగాక ఏడుస్తాడు. ఇంతలో మహా కల్పించుకుని ఇందులో చక్రి తప్పేమీ లేదని...నేనే విడాకులు తీసుకోవాలని లాయర్ను కలిశానని చెబుతుంది. దీంతో కన్నా మహాను పట్టుకుని నిలదీస్తాడు.ఇక్కడ అంతా బాగానే ఉంది కదా వదిన....మరి ఎందుకు విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నావని అడుగుతాడు.
దీంతో కేశవ్ కోపంతో ఇలాంటి అబద్ధాలకోరును పెళ్లిచేసుకుని ఏ అమ్మాయి మాత్రం కాపురం చేస్తుందని అంటాడు. నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే చెబుతాడని...మన గురించి కూడా పచ్చి అబద్ధాలు చెప్పాడని ఇప్పుడు ఇవన్నీ తెలిసి వదినకు బాధ కలిగి వెళ్లిపోతుందని అంటాడు. చక్రిని ఇష్టం వచ్చినట్లు తిడతాడు. అయినా గానీ ఒక్క మాట కూడా మాట్లాడడు. మాధవ్ కూడా నోరు మెదపకపోవడంతో కేశవ్ వాళ్ల అన్నయ్యపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. ఇంత పెద్ద విషయం చెప్పినా నువ్వు మాట్లాడటం లేదంటే....ఈ విషయం నీకు ముందే తెలుసన్నమాట అని అంటాడు.అన్నీ తెలిసి వాళ్లకు ఏం చెప్పకుండా నోరు మూసుకుని చూస్తూ ఉన్నావని చక్రి మాధవ్పై మండిపడతాడు.
























