Nindu Noorella Saavasam Serial Today September 17th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: ఆరు అస్థికల కోసం గుప్త ప్లాన్ - అనుమానించిన అమర్
Nindu Noorella Saavasam serial Today Episode September 17th: ఆరు అస్థికలను ఎలాగైనా గంగలో కలిపేలా చేయాలని గుప్త వేషం మారుస్తాడు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది

Nindu Noorella Saavasam Serial Today Episode: గార్డెన్లో కూర్చున్న ఆరు, అమర్కు నిజం తెలియలేదని బాధపడుతుంది. ఇంకా ఈ సస్పెన్స్ ఎన్ని రోజులు భరించాలి అనుకుంటూ దేవుడిని తిడుతుంది.
గుప్త: బాలిక పని చేయడమే నీ వంతు ఫలితం ఆ పై వాడి వంతు.. అదియే విధి
ఆరు: ప్రతి సారి విధి.. విధి అంటూ నస పెట్టకండి గుప్త గారు.. ఆ మాట వింటేనే చిరాకు వస్తుంది.
గుప్త: ఏమిటి నీకు అనుకూలంగా ఉన్న విధిపైనే నీకు ఆగ్రహమా..?
ఆరు: విధి నాకు అనుకూలంగా ఉండటమా..? ఎప్పుడు గుప్త గారు.. మీరు చెప్తున్న విధి నాకు ఏం ఫేవర్ చేసింది. నన్ను చంపేసి నా భర్త పిల్లల నుంచి దూరం చేసింది
గుప్త: కానీ ఆ విధియే కదా నువ్వు మరణించినా కూడా నీ కుటుంబం చెంతనే ఉండేలా చేసింది.
ఆరు: ఏంటి ఆత్మలాగా.. ఇది కూడా ఒక జీవితమేనా..?
గుప్త: మరణానంతర జీవితం బహు కొద్ది మందికే దక్కింది బాలిక అంతటి అదృష్టం దక్కింది నీకు
ఆరు: నన్ను చంపేసి ఈ మాయ మాటలు చెప్పకండి ఫ్లీజ్..
గుప్త: అయినచో నీకు ఒక సత్యము చెప్పెదను.. నువ్వు మా లోకమునకు రావాలి. లేదంటే ఇక నువ్వు చాలా కష్టాలు పడతావు బాలిక
అని గుప్త వార్నింగ్ ఇస్తాడు. అయితే ఎలా రావాలి అంటూ ఆరు అడగ్గానే.. నాతో రా నేను తీసుకెళ్తాను కదా అంటాడు గుప్త. నా ఆస్తికలు గంగలో కలిపే వరకు నేను రాలేను కదా గుప్త గారు అంటుంది ఆరు. అయితే స్వయంగా నీ పతి దేవుడే నీ ఆస్థికలు గంగలో కలిపేలా చేస్తాను అంటూ స్వామిజీ వేషం వేసుకుని అమర్ దగ్గరకు వెళ్తాడు గుప్త. స్వామి వేషంలో వచ్చిన గుప్తను చూసి భాగీ హ్యాపీగా ఫీలవుతుంది.
అమర్: ఎవరు స్వామి మీరు
భాగీ: స్వామి మీ లాంటి వాళ్లు మా ఇంటికి రావడం మా అదృష్టం స్వామి. కూర్చోండి స్వామి
గుప్త: మీ ఇంట్లో చాలా రోజులుగా చాలా సమస్యలు వస్తున్నాయి కదా
అమర్: అవును కానీ ఎందుకు వస్తున్నాయో తెలియడం లేదు.. అయినా ఈ విషయాలు మీకెలా తెలుసండి
గుప్త: మేము త్రికాలజ్ఞులము నాయన మాకు అంతా అవగతం అవుతుంది. ఆ జగన్నాథుడి ఆదేశం మేరకే మేము ఇప్పుడు మీ ఇంటికి వచ్చాము.. మీ ఇంట్లో చనిపోయిన వారి ఆస్థికలు ఇంకా గంగలో కలపకుండా అలాగే పెట్టుకున్నారు కదా..?
అందరూ షాక్ అవుతారు..
అమర్: అవును స్వామి.. చనిపోయిన నా భార్య అస్థికలు ఇంట్లోనే ఉన్నాయి.. కానీ ఎన్ని సార్లు గంగలో కలపుదామని ప్రయత్నించినా కలపలేకపోయాము
గుప్త: అయితే ఈసారి ప్రయత్నం చేసి చూడండి నాయన. ఎందుకంటే తక్షణమే ఆ ఆస్తికలు మీరు గంగలో నిమజ్జనం చేయాల్సిన సమయం ఆసన్నమైంది.
మనోహరి హ్యాపీగా ఫీలవుతుంది.
అమర్: ఎందుకు స్వామి.. నిమజ్జనం చేయకపోతే.. చనిపోయిన నా భార్యకు ఏమౌతుంది.. మళ్లీ ఈ ఇంటికి ఏమైనా సమస్యలు వస్తాయా..? చెప్పండి స్వామి.
గుప్త: ఆస్థికలు నిమజ్జనం చేయడం వల్ల నీ ఇంటికి వచ్చే ప్రమాదం ఏమీ లేదు నాయన.. కానీ ఆ ఆత్మకు మళ్లీ పునర్జన్మ ఉండదు నాయన.. నీవు ఎంతగానో ప్రేమించిన నీ భార్య మళ్లీ జన్మించాలంటే వెంటనే తన ఆస్థికలను నిమజ్జనం చేయాలి. అలా చేస్తే ఆవిడ మళ్లీ నీ ఇంట్లోనే నీ కడుపులోనే పుట్టే అవకాశం కూడా ఉంటుంది నాయన.. గతించిన నీ భార్య నీ కూతురుగా పుట్టి నీ ఇంట్లోనే అడుగుపెడుతుంది నాయన
అని గుప్త చెప్తుండగానే మనోహరి భయపడుతుంది. అమర్, భాగీ, రాథోడ్ వింటుంటారు. అంతా చెప్పి స్వామిజీ వేషంలో ఉన్న గుప్త వెళ్లిపోతాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















