Nindu Noorella Saavasam Serial Today October 3rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: ఘోర పూజను చెడగొట్టిన అమర్ – నిజం ఎవ్వరికీ తెలియనివ్వనన్న ఆరు
Nindu Noorella Saavasam Today Episode: మనోహరి శరీరంలో ఉన్న ఆరు తాయోత్తు వల్ల మత్తుగా ఉంటూ ఘోర దగ్గరకు వెళ్లడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: మనోహరి అలా వెళ్లిందేంటి అని శివరాం అడుగుతాడు. దీంతో ఏంటేనండి ప్రతి పౌర్ణమికి ఏదో జరుగుతుంది అంటుంది. దీంతో భాగీకి తన పెళ్లి జరిగిన విషయం. అమ్ము మాట్లాడిన విషయం గుర్తుకు వస్తుంది. టెన్షన్ పడుతుంది. మరోవైపు మనోహరి కారులో వెళ్తుంటే అమర్ చూసి మనోహరి ఏంటి అంత స్పీడ్ వెళ్తుంది అని మనోహరిని ఫాలో అవుతాడు. మనోహరి కారు దిగి ఘోర దగ్గరకు వెళ్తుంది.
ఘోర ఆత్మ వచ్చింది అని దేవకు చెప్పి.. ఆత్మ కూర్చో అనగానే కూర్చుంటుంది. మరోవైపు అమర్ కూడా ఘోర ఉన్న దగ్గరకు వస్తాడు. మనోహరిని చూసి కోపంగా ఘోరను కొడతాడు. ఇంతలో ఘోర తప్పించుకుని పారిపోతాడు. అమర్ మనోహరిని తడుతుంటే చేతికి ఉన్న తాయోత్తు ఊడిపోతుంది. తర్వాత ఆరు గార్డె్న్ లో కూర్చుని రణవీర్ మాటలు గుర్తు చేసుకుంటుంది. మరోవైపు మనోహరి తన రూంలో పడుకుని ఉంటుంది. చుట్టు అందరూ ఉంటారు.
గుప్త: బహు చక్కగా మా నరక నగర సొగసుల మధ్య జలపాతముల వద్దకు వెళ్లి జలకాళాటలలో అంటూ పాటలు పాడుకుంటూ ఉండాల్సిన నేను నా కెందుకు ఈ గోల. అసలు ఈ పరిస్థితి ఆ శత్రువుకు కూడా రాకూడదు. ఈ సైనిక దళం మొత్తం ఆ బాలిక మేల్కోనుటకు నా వలే వేచి చూస్తున్నారు.
నిర్మల: అసలు మన చుట్టు ఏం జరుగుతుంది అమర్. నాకేమీ అర్థం కావడం లేదు.
శివరాం: అవును అమర్. ఆరును చంపిన వాడు మళ్లీ మన చుట్టు ఎందుకు తిరుగుతున్నాడు. ఈ మంత్రాలు తంత్రాలు చేసుకునే వాడు మన కుటుంబంలోని మనుషులనే ఎందుకు తీసుకెళ్తున్నాడు.
నిర్మల: మొన్నేమో అమ్మును ఇలానే ఎత్తుకెళ్లి ఏదో పూజ చేయబోయాడు. ఇవాళేమో మనోహరితో ఏదో పూజ చేస్తున్నాడని చెప్పావు. ఇవన్నీ చూస్తుంటే నాకెందుకో భయంగా ఉంది నాన్నా.
శివరాం: పోనీ డబ్బుల కొరకు చేస్తున్నాడు అనుకుంటే ఇలాంటి వాళ్లకు డబ్బుల మీద ఆశ ఉండదు అమర్.
భాగీ: మామయ్యగారు అంటే వాడు దేనికోసమో మన ఇంటికి వస్తున్నాడు అంటున్నారా? అతనికి కావాల్సింది ఈ ఇంట్లో ఏదైనా ఉండి ఉంటుందా? అందుకోసమే ఇన్నిసార్లు ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాడా?
గుప్త: ఈ బాలిక ఆత్మ గురించి పసిగట్టేలా ఉంది.
భాగీ: వాడికి ఈ ఇంటి నుంచి ఏం కావాలి. ఎందుకు మళ్లీ మళ్లీ వస్తున్నాడు.
అమర్: చావు చూసి కన్నీళ్లు మిగిలిన ఇల్లు మిస్సమ్మ వాడికి ఇక్కడేం ఉంటుంది.
అనగానే ఇంతలో మనోహరి ఉలిక్కిపడి నిద్ర లేస్తుంది. గుప్త బాలిక నేను ఇచట ఉన్నాను అంటాడు. మనోహరి పలకదు. దీంతో ఆరు ఇక్కడ లేదని గుప్త వెళ్లిపోతాడు. ఏం జరిగింది మీరంతా ఇక్కడ ఎందుకు ఉన్నారు? అని అడుగుతుంది. దీంతో జరిగిందంతా అమర్ చెప్తాడు. దీంతో మనోహరి సంతోషంగా ఘోర, ఆరును బంధించాడనుకుంటా అని మనసులో అనుకుంటుంది. గార్డెన్ లో ఏడుస్తూ కూర్చున్న ఆరును చూసి తాను తెలుసుకున్న నిజమే తనను బాధిస్తుంది అనుకుంటాడు. దగ్గరకు వెళ్లిన గుప్తకు అంజు, మనోహరి కూతురు అంటే నమ్మలేకపోతున్నాను అంటుంది. అంజలి వాళ్ల కూతురు అన్న నిజం ఎవ్వరికీ తెలియకుండా చేయాలని డిసైడ్ అవుతుంది. దీంతో మళ్లీ విధికి ఎదురు వెళ్తున్నావు అని హెచ్చరిస్తాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఈ రాశిలో జన్మించినవారు ఆత్మలతో మాట్లాడతారా! వీరికి అతీంద్రీయ శక్తులు సైతం
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
ట్రెండింగ్ వార్తలు





















