అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today October 17th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరును బంధించిన ఘోర – మనోహరికి లాస్ట్‌ చాన్స్‌ ఇచ్చిన రణవీర్‌

Nindu Noorella Saavasam Today Episode: మనోహరి ప్లాన్‌ ప్రకారం అమర్‌ ఫోటోను ఆరుకు కనిపించేటట్టు పెట్టడంతో ఆరు  ఆ ఫోటోను పట్టుకోవడంతో ఘోరకు బందీ అవుతుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode:  భాగీ అనుమానంగా మనోహరి రూం సైడు చూస్తూ.. రాథోడ్‌ ను పిలిచి మనోహరి ఉదయం నుంచి తేడాగా ఉందని కొత్తగా రూం లాక్‌ చేస్తుందని ఏంటో తెలుసుకోవాలని చెప్తుంది. అయితే ఇప్పుడే తెలుసుకుంటానని రాథోడ్‌ రూం దగ్గరకు వెళ్లి తెరవడానికి ప్రయత్నిస్తాడు. లోపల లాక్‌ చేసినట్టు ఉందని ఆగిపోతాడు. లోపల ఘోరతో ఉన్న మనోహరి.. ఆరును ఎలా పొడి ముట్టుకునేలా చేయాలని ఆలోచిస్తుంది. వెంటనే లేచి వెళ్లి అల్మారాలో ఉన్న అమర్‌ ఫోటో తీసుకొచ్చి ఘోరకు ఇస్తుంది.

మనోహరి: ఇదిగో ఈ అమర్‌ ఫోటోను ఎలాగైనా ఆరు చూస్తుండగా కింద పడేయాలి. అప్పుడు అది ఫోటోను పైన పెట్టడానికి తీసుకుంటుంది. ఆ పౌడర్‌ ను ఈ ఫోటో మీద చల్లాలి.  

ఘోర: ఆ ఆత్మ పట్టుకునే లోపు ఎవరైనా తీసేస్తే..

మనోహరి: తీయకుండా నేను చూస్తాను.

ఘోర, అమర్‌ ఫోటో మీద పొడి చల్లి మంత్రిస్తాడు. ఫోటో తీసుకుని మనోహరి బయటకు వెళ్లుంది. డోర్‌ దగ్గర ఉన్న రాథోడ్‌ ను చూసి షాక్ అవుతుంది.

రాథోడ్‌: దుమ్ము చాలా ఉంది. రోజు  తుడవడం లేదనుకుంటా?

మనోహరి: ఓవర్‌ గా ఉంది.

రాథోడ్‌: ఏంటి మేడం ఇప్పుడు మీరు నాతో ఏదైనా అన్నారా?

మనోహరి: చాలా ఓవర్‌ అయింది అన్నాను.

అని మనోహరి అనగానే ఏదో చెప్తూనే రాథోడ్‌ డోర్‌ ఓపెన్‌ చేయడానికి ప్రయత్నిస్తుంటే రాథోడ్‌ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. లోపలి నుంచి మాటలు వినిపించాయి. లోపల ఎవరైనా ఉన్నారా? మేడం అని అడగ్గానే లేరని చెప్తుంది మనోహరి. మరోవైపు గుప్త తల కిటికీలో ఇరుక్కుపోయి ఉంటుంది. ఆరును పిలిచి నువ్వు త్వరగా వచ్చేయ్‌ అని చెప్తాడు. సరే అని వెళ్లిపోతుంది ఆరు. మనోహరికి రణవీర్‌ ఎదురుపడతాడు.

రణవీర్‌: ఏంటి మనోహరి ఏదో కంగారులో ఉన్నట్టున్నావు. ఏదో పనిలో ఉన్నావని నాకు అనిపిస్తుంది. అది నేను చెప్పిన పనే అనుకుంటున్నాను.

మనోహరి: ప్లీజ్‌ రణవీర్‌ ఇక్కడ మనం ఇలా ఎవరైనా చూస్తే చాలా ప్రాబ్లమ్‌ అవుతుంది.

రణవీర్‌: ప్రాబ్లమ్‌ చేయడానికే కదా నేను వచ్చింది. ఇవాళ సాయంత్రం లోపు దుర్గ నా కళ్లముందుకు రాకపోతే ఈ ఇంట్లో నీ నిజస్వరూపం మొత్తం బయటపెట్టేస్తాను. నువ్వు నీ స్నేహితురాలిని చంపి మొదలు పెట్టిన ఆట. నువ్వు నీ ప్రాణాలు కాపాడుకుంటూ వచ్చిన అన్ని నిజాలను ఆ అమర్‌ ముందు బయటపెడతాను. నువ్వు కోరుకున్న జీవితం నీకు కావాలంటే నా కూతురును నాకివ్వు..

మనోహరి: నాకు కొంచెం టైం కావాలి రణవీర్‌.

రణవీర్‌: టైం కావాలా? నీకు అయితే సరే నేను అమర్‌ కు నిజం చెప్తాను.

మనోహరి: నిజం చెప్తావా? రణవీర్‌ వెళ్లి చెప్పు. ఈసారి నేను ఆపను. నిజం చెప్తే నీ కూతురు నీ దగ్గరకు వస్తుందా? ఇప్పుడేంటి.. అమర్‌ నీ కూతురు ఎక్కడుందో కనిపెడతాడనుకున్నావా? నువ్వు జీవితం అంతా వెతికినా దుర్గ నీకు దొరకదు.

రణవీర్‌: సరే మనోహరి ఇదే నేను నీకు ఇస్తున్న ఆఖరి అవకాశం. ఈసారి దుర్గను నాకు అప్పగించకుంటే నా ఆస్తి మొత్తం పోతుంది. ఆస్థి పోయాక నేను దేన్ని లెక్క చేయనని నీకు బాగా తెలుసు.

మనోహరి: ఈసారి మిస్‌ అవ్వదు రణవీర్‌

 అని చెప్పగానే రణవీర్‌ వెళ్లిపోతాడు. తర్వాత అంజు కేక్‌ కటింగ్‌ జరుగుతుంది. అక్కడ అందరూ ఉంటారు. ఆరు వెనక నిలబడి ఉంటే ముందుకు రమ్మని భాగీ పిలుస్తుంది. వద్దులే అని అక్కడే ఉంటుంది ఆరు.   ఇంతలో మనోహరి, అమర్‌ ఫోటో ఒక మూలగా పెట్టడాన్ని గమనిస్తుంది ఆరు. ఇంతలో భాగీ వస్తుంది. తను తీసుకొచ్చిన గిఫ్ట్‌ అంజుకు ఇవ్వమని భాగికి ఇచ్చి వెళ్లి అమర్‌ ఫోటో చేతిలోకి తీసుకుంటుంది. వెంటనే ఘోర దగ్గరకు బంధీగా వెళ్తుంది ఆరు ఆత్మ. ఘోర ఆత్మను చూసి గట్టిగా నవ్వుతుంటాడు. గుప్త కంగారుగా ఆరు ఎక్కడ ఉందని వెతుకుతుంటాడు. ఇంతలో అక్షింతలు తీసుకుని వచ్చిన భాగీ.. ఆరు ఇచ్చిన గిప్ట్‌ చూపించగానే అందరూ షాక్ అవుతారు. అంజు.. ఆరును గుర్తు చేసుకుంటుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

ALSO READ: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌: శంకర్‌ ను చంపేయమన్న స్వామీజీ 

 

టాప్ హెడ్ లైన్స్

Lakshimi Raave Maa Intiki Serial Today June3rd: సింధూను కాపాడేందుకు తాను నపుంసకుడినని అందరికీ చెప్పిన గోపీ..ఇంట్లో వాళ్లకు నిజం చెప్పిన సింధూజాక్షి
లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్‌: సింధూను కాపాడేందుకు తాను నపుంసకుడినని అందరికీ చెప్పిన గోపీ..ఇంట్లో వాళ్లకు నిజం చెప్పిన సింధూజాక్షి
Jagadhatri Serial Today June 3rd: చిలకమ్మపై బలపడిన నిషిక అనుమానం....జగధాత్రిని ఇంట్లో నుంచి తరిమివేయడానికి ఎత్తులు
జగద్ధాత్రి సీరియల్:చిలకమ్మపై బలపడిన నిషిక అనుమానం....జగధాత్రిని ఇంట్లో నుంచి తరిమివేయడానికి ఎత్తులు
Nindu Manasulu Serial Today June 3rd: జ్యూస్‌లో మందు కలిపింది ఎవరో నిరూపించిన సిద్ధూ....విజయానంద్‌ను అసహ్యించుకున్న మంజుల
నిండుమనసులు: జ్యూస్‌లో మందు కలిపింది ఎవరో నిరూపించిన సిద్ధూ....విజయానంద్‌ను అసహ్యించుకున్న మంజుల
Illu Illalu Pillalu Serial Today June 3rd:వల్లి ఎత్తులను చిత్తుచేసిన ధీరజ్‌...వేరుపడిన అన్నకు బుద్ధి చెప్పేలా ఝలక్‌ ఇచ్చిన ధీరజ్‌
ఇల్లు ఇల్లాలు పిల్లలు: వల్లి ఎత్తులను చిత్తుచేసిన ధీరజ్‌...వేరుపడిన అన్నకు బుద్ధి చెప్పేలా ఝలక్‌ ఇచ్చిన ధీరజ్‌

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Press Meet: తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
KTR vs Pawan Kalyan:
"పవన్‌ కల్యాణ్‌ను గౌరవిస్తా, అభిమానిస్తా, బిర్యానీ పెడతా కానీ..." కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్‌
Imtiaz Ali : లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
Telangana AP Weather Alert June 2026: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
TTD Ghee Scam: టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!
టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!
Karnataka Chief Minister DK Shivakumar : కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
Delhi Fire Accident: ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
Congress Internal Rifts: ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
Embed widget