Meghasandesham Serial Today September 5th: ‘మేఘసందేశం’ సీరియల్: రోడ్డు మీద డాన్స్ చేసిన భూమి – చెర్రీ చేతికి గాయం చూసి ఎమోషన్ అయిన గగన్
Meghasandesham Today Episode: తన తల్లి శోభాచంద్రే అని తెలుసుకున్న భూమి ఆనందంలో రోడ్డు మీద ఉన్న శోభ ఫ్లెక్సీ దగ్గర డాన్స్ చేస్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesham Serial Today Episode: శోభాచంద్రే తన తల్లి అని తెలిసి ఎమోషన్ అవుతుంది భూమి. పరుగెత్తుకెళ్లి శోభాచంద్ర ఫ్లెక్సీ దగ్గర నిలబడి ఏడుస్తూ.. నా గురువే నా తల్లి అంటే నమ్మలేకపోతున్నాను అంటూ రోడ్డు మీదే డాన్స్ చేస్తుంది భూమి. ఇంతలో నాట్యం చేసే అమ్మాయిల బృందం కూడా వచ్చి భూమితో కలిసి నాట్యం చేస్తుంటారు. డాన్స్ చేస్తున్నవాళ్ల ముందు జనం డబ్బులు వేస్తుంటారు. ఇంతలో కారులో వెళ్తున్న గగన్, భూమిని చూసి జనం డబ్బులు వేయడం చూసి షాక్ అవుతాడు. భూమి దగ్గరకు వెళ్లి ఇంటికి వెళ్దాం పద అంటాడు.
భూమి: నేను ఎవరి కోసం వచ్చానో.. నేను ఎవరి గురించి తెలుసుకోవాలనుకున్నానో వాళ్ల గురించి తెలిసింది.
గగన్: నువ్వు ముందు ఇంటికి పద..
భూమి: నా పుట్టుక గురించి తెలిసింది. మా అమ్మ ఎవరో తెలుసా? అదిగో ఆ శోభాచంద్ర గారే..
గగన్: ఇన్ని రోజులు గురువు అన్నావు. ఇప్పుడేమో అమ్మా అంటున్నావా?
భూమి: నిజంగా ఆమే మా అమ్మ..
గగన్: మాట్లాడింది చాలు పద వెళ్దాం..
అని గగన్, భూమిని తీసుకుని ఇంటికి వెళ్తాడు. ఇంట్లో శారదమ్మా ఎదురుగా వచ్చి భూమిని ఎక్కడికి వెళ్లావు అని అడుగుతుంది. లోపలికి వచ్చిన గగన్ శారదకు చెప్పి ఇంట్లో డబ్బులు తెప్పించి భూమి ముందు పెట్టించి ఇవి సరిపోకపోతే చెప్పు రేపు బ్యాంకు నుంచి తెప్పిస్తానని లేదంటే నీ జీతం డబుల్ చేస్తాను అంటాడు. ఎందుకు ఏమైందని శారద అడగ్గానే రోడ్డు మీద భూమి డాన్స్ చేస్తుంటే జనాలు డబ్బులు వేస్తున్నారు అని చెప్తాడు.
భూమి: శోభాచంద్రగారి పోస్టర్ చూసి డాన్స్ చేస్తుంటే వాళ్లెవరో డబ్బులు వేశారు. దానికి మీరు ఫీలయితే ఎలా?
శారద: అవునా.. ఓరేయ్ గగన్ ఆ శోభాచంద్ర వీళ్ల గురువు గారిలా ఫీలవుతుంది కదరా? అందుకు డాన్స్ చేసిందట.
గగన్: నిన్నటి దాకా గురువు అంది. ఇప్పుడు అమ్మ అంటుంది.
భూమి: అవును ఆంటీ మా అమ్మే.. నాకు ఈరోజే తెలిసింది.
శారద: భూమి కిందేమైన పడ్డావా?
భూమి: లేదు ఆంటీ..
శారద: పోనీ పైనుంచి ఏదైనా మీద పడటం.. తల మీద
భూమి: అలాంటి ఏం లేదు ఆంటీ.. ఎందుకు?
శారద: బాగానే ఉంది కదరా? ఎందుకైనా మంచిది ఒకసారి హాస్పిటల్ కు తీసుకెళ్లు.
అనగానే భూమి నేను చెప్పేది నమ్మరా అంటూ అమాయకంగా మాట్లాడుతుంది. త్వరలోనే నిజం తెలిసినప్పుడు మీరే నమ్ముతారు అని చెప్పి వెళ్లిపోతుంది. తర్వాత నేను శోభాచంద్ర గారి కూతురిని అంటే ఆంటీవాళ్లే నమ్మటం లేదు. ఇక మా నాన్న ఎలా నమ్ముతారు అని నేను ఎవరో చెప్పగలిగేది ఆయనొక్కరే అని తనకు నిజం చెప్పిన వ్యక్తిని గుర్తు చేసుకుంటుంది. వెంటనే హాస్పిటల్ కు వెళ్తుంది. అక్కడ ఐసీయూలో ఉన్న వ్యక్తి గురించి ఆరా తీస్తుంది.
అతనికి ఎవరూ లేరని తెలిసి ఆయన్ని తన ఇంటికి తీసుకెళ్తానని డాక్టర్ ను అడుగుతుంది. దీంతో అతను కోమాలో ఉన్నాడని డాక్టర్ చెప్పడంతో భూమి షాక్ అవుతుంది. దీంతో ట్రీట్మెంట్కు రెండు లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్ చెప్పగానే నేను ఎవరో నిరూపించుకోవడానికి కూడా ఖర్చు అవుతుందన్నమాట అనుకుని భూమి సరే అంటుంది. మరోవైపు గగన్ తింటుంటే చెర్రీ వస్తాడు. చేతికి కట్టు ఉండటం చూసి గగన్, శారద, పూరి కంగారు పడతారు. ఏమైందని అడిగితే ఇంట్లో జరిగిన విషయం చెప్తాడు చెర్రీ. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
Before You Go
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
ట్రెండింగ్ వార్తలు






















