అన్వేషించండి

Lakshmi Nivasam Serial Today: 'లక్ష్మి నివాసం' సీరియల్: జానుతో పెళ్లికి రెడీ అయిన జై ఆటిట్యూడ్ వేరే లెవల్ - సిద్ధుకు వేరే అమ్మాయితో పెళ్లి ఫిక్స్

Lakshmi Nivasam Today Episode: జానుతో తన పెళ్లి విషయం మరోసారి శ్రీనివాస్ వద్ద ప్రస్తావిస్తాడు జై. ఇదే సమయంలో తులసిని ఇంప్రెస్ చేసే పనిలో పడతాడు సిద్ధు. ఇక ఈ రోజు ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

Lakshmi Nivasam Serial April 18th Today Episode: జానుతో పెళ్లికి లైన్ క్లియర్ చేసుకుంటుంటాడు జై నందన్. మరోవైపు, విశ్వ జానుతో తన ప్రేమ విషయం చెప్పలేకపోయినందుకు వేదనకు గురవుతుంటాడు. ఇదే సమయంలో తనకు ఓ అత్తయ్య ఉందని ఆమె ప్రేమ పెళ్లి చేసుకుని తన కుటుంబానికి దూరమైందని తల్లి త్రివేణి ద్వారా తెలుసుకుంటాడు. అటు, తులసి దృష్టిలో రౌడీ షీటర్‌గా మిగిలిపోయిన సిద్ధు ఆమెను ఇంప్రెస్ చేసే పనిలో పడతాడు. దీంతో అతనికి వార్నింగ్ ఇస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది తులసి. ఇక ఈ రోజు ఎపిసోడ్‌లో..

కీర్తికి లక్ష్మి క్లాస్

తమ చీరలిచ్చి గిన్నెలు తీసుకోవాలని అనుకుంటారు లక్ష్మి కోడళ్లు. అతని వద్ద కీర్తి తన గొప్పతనం చూపించుకోవాలని ఆరాటపడుతుంది. ఆ గిన్నెలు తమకు వద్దంటూ.. లక్ష్మి తన చీరలిచ్చి గిన్నెలు తీసుకుంటుంది. ప్రతి ఒక్కరి వద్ద కూడా నీ డాబు చూపించుకోవాల్సిన అవసరం లేదంటూ కీర్తికి క్లాస్ తీసుకుంటుంది లక్ష్మి. ఇదే సమయంలో లక్ష్మి పుట్టింటి గురించి వెటకారంగా మాట్లాడుతుంది కీర్తి.

ఇంతలో శ్రీనివాస్ కలగజేసుకుని ఆమె నోటికి తాళం వేస్తాడు. అయితే, తన పుట్టింటి గురించి ఎవరికీ ఏమీ చెప్పొద్దంటూ లక్ష్మి శ్రీనివాస్‌కు చెప్తుంది. తులసి, జాను పెళ్లిళ్లు అయిపోతే ఇంటి గురించి ఆలోచిద్దామని.. తన గతం, పుట్టింటి గురించి కోడళ్ల వద్ద ఏమీ చెప్పొద్దంటూ లక్ష్మి.. శ్రీనివాస్‌తో అంటుంది.

సిద్ధుతో తులసి పెళ్లి!

సిద్ధు పెళ్లి గురించి అతని తల్లి విశాలాక్షి బసవ వద్ద ప్రస్తావిస్తుంది. సరిగ్గా అదే టైంకు అక్కడికి వచ్చిన పెద్ద కోడలు నీలిమ వెటకారంగా మాట్లాడుతుంది. మనకు డబ్బు వద్దని అణకువ ఉన్న పిల్ల కావాలని విశాలాక్షి బసవతో అంటుంది. మన కీర్తి ఆడపడుచు తులసితో సిద్ధుకు పెళ్లి చేద్దామని అంటుంది. దీంతో బసవ, అతని తల్లి తులసికి కుజ దోషం ఉందని ఆమెకి పెళ్లి కాదని పెటాకులే అవుతుందని.. ఆమెపై కోప్పడతారు. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన సిద్ధుకు విషయం చెప్తాడు బసవ. ఇది విన్న సిద్ధు తన తల్లిపై కోపం తెచ్చుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. 

జై యాటిట్యూడ్ డిఫరెంట్

జానుతో పెళ్లి ఫిక్స్ చేసుకునే ప్రయత్నాల్లో ఉన్న సిద్ధు అదే మూడ్‌లో ఆఫీసుకు వస్తాడు. ఇంతలో అతని ఆఫీసులో పని చేసే వ్యక్తి తన పెళ్లి అంటూ కార్డ్ ఇస్తాడు. దీంతో అతనికి రూ.12 లక్షలు చెక్ ఇస్తాడు. కార్డులో పెళ్లి కూతురు పేరు జాను అని చూసి.. పెళ్లి క్యాన్సిల్ చేసుకోమంటాడు. లేదంటే పెళ్లి కూతురునైనా మార్చేయాలంటూ తన ఉద్యోగితో చెప్తాడు జై. తను పెళ్లి చేసుకోవాలనుకునే అమ్మాయి పేరు కూడా జాను అని.. ఆ పేరు తాను మాత్రమే పలకాలంటూ అతన్ని ఉద్యోగం నుంచి తీసేస్తాడు జై.

తులసికి వేరే అమ్మాయితో పెళ్లి ఫిక్స్

మరోవైపు, సిద్ధుకు మేయర్ పదవి రాకుంటే తన కొడుకు సిద్ధు రాజకీయ భవిష్యత్తు ఏంటో అంటూ తన తల్లితో అంటాడు బసవ. ఎలాగైనా మునుస్వామి ఓడించాలని తల్లి సలహా ఇస్తుంది. పాలిటిక్స్ వాడుకోవాలని.. మునుస్వామి కూతురును సిద్ధుకి ఇచ్చి పెళ్లి చేయాలంటూ సలహా ఇస్తుంది అతని తల్లి. దీంతో వెంటనే తన ప్రత్యర్థి మునుస్వామికి కాల్ చేస్తాడు బసవ. నీతో వియ్యం అందుకోవాలనుకుంటున్నట్లు అతనితో చెప్తాడు బసవ. ఇది విని ఆశ్చర్యపోయిన మునుస్వామి.. తాను కూడా ఇదే అడుగుదామనుకున్నామని.. కానీ అహం అడ్డు వచ్చి ఆగిపోయామంటూ చెప్తాడు. తన కూతురు కనిష్క సిద్ధుని ఇష్టపడిందని అంటాడు.

మరి సిద్ధు ఈ పెళ్లికి ఒప్పుకొంటాడా?, జానును దూరం చేసుకున్న విశ్వ పరిస్థితి ఏంటి?, జై ఇదే ఆటిట్యూడ్‌తో జానును పెళ్లి చేసుకుంటాడా? ఇది తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Lakshimi Raave Maa Intiki Serial Today June3rd: సింధూను కాపాడేందుకు తాను నపుంసకుడినని అందరికీ చెప్పిన గోపీ..ఇంట్లో వాళ్లకు నిజం చెప్పిన సింధూజాక్షి
లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్‌: సింధూను కాపాడేందుకు తాను నపుంసకుడినని అందరికీ చెప్పిన గోపీ..ఇంట్లో వాళ్లకు నిజం చెప్పిన సింధూజాక్షి
Jagadhatri Serial Today June 3rd: చిలకమ్మపై బలపడిన నిషిక అనుమానం....జగధాత్రిని ఇంట్లో నుంచి తరిమివేయడానికి ఎత్తులు
జగద్ధాత్రి సీరియల్:చిలకమ్మపై బలపడిన నిషిక అనుమానం....జగధాత్రిని ఇంట్లో నుంచి తరిమివేయడానికి ఎత్తులు
Nindu Manasulu Serial Today June 3rd: జ్యూస్‌లో మందు కలిపింది ఎవరో నిరూపించిన సిద్ధూ....విజయానంద్‌ను అసహ్యించుకున్న మంజుల
నిండుమనసులు: జ్యూస్‌లో మందు కలిపింది ఎవరో నిరూపించిన సిద్ధూ....విజయానంద్‌ను అసహ్యించుకున్న మంజుల
Illu Illalu Pillalu Serial Today June 3rd:వల్లి ఎత్తులను చిత్తుచేసిన ధీరజ్‌...వేరుపడిన అన్నకు బుద్ధి చెప్పేలా ఝలక్‌ ఇచ్చిన ధీరజ్‌
ఇల్లు ఇల్లాలు పిల్లలు: వల్లి ఎత్తులను చిత్తుచేసిన ధీరజ్‌...వేరుపడిన అన్నకు బుద్ధి చెప్పేలా ఝలక్‌ ఇచ్చిన ధీరజ్‌

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Press Meet: తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
KTR vs Pawan Kalyan:
"పవన్‌ కల్యాణ్‌ను గౌరవిస్తా, అభిమానిస్తా, బిర్యానీ పెడతా కానీ..." కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్‌
Imtiaz Ali : లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
Telangana AP Weather Alert June 2026: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
TTD Ghee Scam: టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!
టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!
Karnataka Chief Minister DK Shivakumar : కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
Delhi Fire Accident: ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
Congress Internal Rifts: ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
Embed widget