Lakshimi Raave Maa Intiki Serial Today February 18th: శ్రీలక్ష్మీకి కాలేజీలో అడ్మిషన్ రాకుండా మ్యాడీ వేసిన ఎత్తులు చిత్తు...నేరుగా సీటు ఇచ్చిన కాలేజీ యాజమాన్యం
Lakshimi Raave Maa Intiki Serial Today Episode February 18 th: శ్రీలక్ష్మీకి కాలేజీలో అడ్మిషన్ రాకుండా మ్యాడీ వేసిన ఎత్తులు చిత్తు...నేరుగా సీటు ఇచ్చిన కాలేజీ యాజమాన్యం

Lakshimi Raave Maa Intiki Serial Today Episode: శ్రీలక్ష్మీ కాలేజీలో చేరకుండా ఉండేందుకు మ్యాడీ, అతని ప్రెండ్స్ కలిసి నాటకం ఆడి...ప్రిన్సిపల్గారు పిలుస్తున్నారంటూ పిలిపించి ఓ గదిలో పెట్టి బంధిస్తారు. ఇంతలో అడ్మిషన్ సమయం కావడంతో ఫ్యూన్ వచ్చి ఆమెను పిలుస్తాడు. ఎంత పిలిచినా పలకపోవడంతో మ్యాడీ, త్రిష ఇద్దరూ కలిసి రాలేదని చెబుతారు. దీంతో తర్వాత వాళ్లను పిలిచి అడ్మిషన్లు పూర్తి చేస్తుంటారు కాలేజీ యాజమాన్యం. మరో అరగంట పాటు ఆ శ్రీలక్ష్మీని బయటకు రాకుండా చూసుకున్నామంటే....ఇక అడ్మిషన్ లేనట్లేనని మ్యాడీ, త్రిష సంబరపడిపోతుంటారు. లేకపోతే ఇంటి నుంచి వెళ్లిపొమ్మంటే నాతోపాటే కాలేజికి వస్తుందా అని మ్యాడీ అంటాడు. ఇంతలో మ్యాడీతోపాటు, త్రిష వాళ్ల ప్రెండ్స్ అందరికీ కాలేజీలో అడ్మిషన్ దొరుకుంది. ఫ్యూన్ చివరిసారిగా మళ్లీ వచ్చి శ్రీలక్ష్మీ పేరు పిలుస్తాడు. ఆమె రాలేదని చెప్పడంతో అడ్మిషన్లు క్లోజ్ చేస్తారు.
ఆ తర్వాత శ్రీలక్ష్మీని బంధించిన గది వద్దకు వెళ్లి మ్యాడీ తాళం తీస్తాడు. త్రిష, మ్యాడీ ఇద్దరూ కలిసి ఎలా ఉంది మా దెబ్బ అని అంటారు. శ్రీముఖలింగంలో తనను అవమానించినందుకు బదులు తీర్చుకున్నానని...ఇంకెప్పుడూ తనతో పెట్టుకోవద్దని త్రిష హెచ్చరిస్తుంది. నేను వద్దంటే నేరుగా తాతయ్యను తీసుకుని కాలేజీకి వస్తావా అని మ్యాడీ శ్రీలక్ష్మీని తిడతాడు.ఇప్పుడు అడ్మిషన్ ఉండదు...కాలేజీ ఉండదని ఎగతాళిచేస్తారు. వాళ్లందరినీ నెట్టుకుని శ్రీలక్ష్మీ అడ్మిషన్ బ్లాక్ వద్దకు పరుగెత్తుతుంది.అప్పుడే అడ్మిషన్లు క్లోజ్ చేసి వెళ్లిపోతున్న స్టాప్ను బ్రతిమాలుతుంది. తనను ఎవరో గదిలో బంధించారని చెప్పడంతో సరే అడ్మిషన్ లెటర్ ఉంటే ఇవ్వమని...తాను ప్రిన్సిపల్తో మాట్లాడతానని అంటాడు. తన దగ్గర అడ్మిషన్ లెటర్ లేదని...అది కాలిపోయిందని చెప్పడంతో వారు మండిపడతారు. అడ్మిషన్ లెటర్ లేకుండా, టైంకు రాకుండా సీటు ఇవ్వమంటే ఎలా ఇస్తామని చెప్పి వెళ్లిపోతారు. శ్రీలక్ష్మీ అక్కడే ఏడుస్తూ ఉండిపోతుంది.
శ్రీలక్ష్మీకి కాలేజీలో అడ్మిషన్ దొరికిందో లేదోనని ఇంట్లో ప్రియంవదతోపాటు మిగిలిన వారంతా కంగారుపడుతుంటే...మ్యాడీ హుషారుగా ఇంటికి చేరుకుంటాడు. ఏమైందని అడిగితే ఆ ఎర్రబస్సును గదిలోపెట్టి తాళం వేసి అడ్మిషన్ రాకుండా చేశానని చెప్పడంతో ఇంట్లో వాళ్లందరూ ఎంతో సంతోషిస్తుంటారు.అప్పుడే శ్రీలక్ష్మీ ఇంటికి చేరుకుంటుంది. సూర్యనారాయణ కిందకు వచ్చి కాలేజీలో జాయిన్ అయ్యావా అని అడుగుతాడు. మ్యాడీముఖంలో ఆనందం వెల్లివిరుస్తుండగా....జాయిన్ అయ్యానని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ షాక్కు గురవుతారు. శ్రీలక్ష్మీ చెప్పిన మాటలు విని సూర్యనారాయణ ఎంతో సంతోషిస్తాడు. ప్రియంవదతో పాటు మిగిలిన వాళ్ల మ్యాడీని తిడతారు. నువ్వేమో సీటు రాలేదని చెప్పావ్...తనేమో జాయిన్ అయ్యానని చెబుతోందని మండిపడతారు. అప్పుడే అక్కడికి వచ్చిన శ్రీలక్ష్మీ కాలేజీలో జరిగిన విషయం చెబుతుంది.మీరు నాకు సీటురాకుండా చేయాలని చూసినా....తాతయ్యగారు మాట్లాడిన ఫ్రొపెసర్ కనిపించి తనను నేరుగా ప్రిన్సిపల్ రూంకు తీసుకెళ్లి అడ్మిషన్ ఇప్పించాడని చెబుతుంది.మీరు నాకు అన్యాయం చేయాలని చూసినా...దేవుడు న్యాయమే చేశాడని చెబుతుంది. నువ్వు స్వతహాగా మంచివాడివే అయినప్పటికీ నీ చుట్టూ ఉన్నవాళ్ల వల్ల చెడిపోతున్నావని మ్యాడని శ్రీలక్ష్మీ తిడుతుంది. ఈ మాటలకు ప్రియంవదకు కోపం వస్తుంది.నా మేనల్లుడి జీవితం నా ఇష్టమని అనగా...అతను నీకు మేనల్లుడు మాత్రమేనని....కానీ నాకు తాళికట్టిన భర్తని చెబుతుంది.






















